ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి

ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఎస్సై దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన ఓ కానిస్టేబుల్‌ అస్వస్థతకు గురై మృతిచెందాడు. అనంతపురం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బాలాజీ నాయక్‌ శనివారం కర్నూలులో జరుగుతున్న ఎస్సై దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో అతను అస్వస్థతకు గురై అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top