సంగారెడ్డిలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభ
జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో తెలంగాణ ప్రజా గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసమే ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. కేసీఆర్ పాలన నియంతృత్వం ట్రేడ్మార్క్లా మారిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు