మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్
పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. విజయవాడలో శుక్రవారం టీడీపీ వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని అన్నారు. ' కొంతమంది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. రూలింగ్లో ఉన్నప్పుడు నాయకుల మనస్తత్వాలు. లేప్పుడు నాయకుల మనస్తత్వాలను చూస్తున్నాను. ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడం కుదరదు. నాలుగైదు జిల్లాల్లో క్రమశిక్షణ రాహిత్యం మొదలైంది. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో ఇది సరైన పద్దతి కాదు. పదవులు ఎవరికివ్వాలనేది అంతిమ నిర్ణయం నాదే.. మొహమాటాలకు పోయి పదవులిచ్చి పార్టీకి నష్టం చేసే పనులు చేయను. మంత్రులు ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దు' అని తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు