'బాబు సర్కార్ ప్రజల పాలిట రాచపుండు'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏపీ ప్రజల పాలిట రాచపుండులా మారిందని వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజల కష్టాలు చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కరువుతో రాష్ట్రం విలవిలలాడుతుంటే హంగులు, ఆర్భాటాలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 12 రోజుల పాటు కృష్ణ పుష్కరాలను అట్టహాసంగా జరిపారు.. అసెంబ్లీ సమావేశాలు మాత్రం కేవలం ఐదురోజులే జరుపుతారట? అని ఎద్దేవా చేశారు. పుష్కరాలకు ప్రముఖులను ఆహ్వానించినట్లే అసెంబ్లీకి కూడా వారిని ఆహ్వానించండి' అని అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు