అంతా.. నీవల్లే!
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చేసిన దాడి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సెటిల్ చేశారు. తహసీల్దార్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఆమె రాజీకి సిద్ధపడేలా కొంత బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి శనివారం తన నివాసంలో తహసీల్దార్తోపాటు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే చింతమనేనితోనూ ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యే అనుచరులు దాడి నేపథ్యంలో మానసిక వేదన అనుభవిస్తున్న వనజాక్షిపై సీఎం కనీసం సానుభూతి చూపలేదు. పైగా తప్పంతా ఆమెదేనన్న భావన కలిగించేందుకు ప్రయత్నించారు. ‘‘ఉద్యోగాలు చేయాలి.. కానీ మొండిగా ఉంటే ఎలా? అది జిల్లా సరిహద్దుకు సంబంధించిన సమస్య అని ఎమ్మెల్యే చెప్పారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలి.
ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇసుక ర్యాంప్ వద్దకు ఎవరు వెళ్లమన్నారు? మీరు వెళ్లి ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చోవటం వల్లే ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. నేరుగా స్పాట్కు వెళ్లి గొడవ చేస్తే ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? వెళ్లిన తర్వాతైనా.. అవతలి వాళ్లు తమదే అని గట్టిగా చెప్పినప్పుడు వెనక్కి తగ్గి ఉండాల్సింది. ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చోవడం ఏమిటి? గొడవ చేయడం ఎందుకు? ఎస్ఐ కూడా మౌనంగా ఉండటం తప్పు. గొడవ జరుగుతుంటే సర్ది చెప్పడానికి ప్రయత్నించలేదు. తహసీల్దార్ను అక్కడి నుంచి తీసుకెళితే సరిపోయేది. అదీ చేయలేదు. ఈ మొత్తం వ్యవహారం వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదు’’ అని సీఎం అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు