జయలలిత మృతిపై అపోలో ఆస్పత్రి వివరణ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్సపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. చికిత్సకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదిక సీల్డ్‌ కవర్‌ లో అందిచేందుకు సిద్ధంగా ఉన్నామని మద్రాస్‌ హైకోర్టుకు అపోలో తరపు న్యాయవాది పీఎస్‌ రామస్వామి తెలిపారు. జయలలిత మృతి వెనుక సందేహాలు ఉన్నాయని దాఖలైన పిల్‌ పై మద్రాస్‌ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. జయలలిత క్త సంబంధీకులు తమను ఆశ్రయించనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు పిటిషనర్‌కు ఉందా మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top