‘స్వాతం‍త్ర్య సమర యోధుల పెన్షన్‌ పెంచుతా’

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన 71వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విశేష సేవలందించిన పోలీసులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఒకే పటంపైకి తీసుకొచ్చిన ఘనత వల్లభాయ్‌ పటేల్‌దేనన్నారు. అల్లూరి సీతారామరాజు, జాతీయ పతాకానికి నాంది పలికిన పింగళి వెంకయ్య ఇక్కడివారేనని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్‌ పెంచుతానని హామీ ఇచ్చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top