వెలగపూడిలోనే బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను వెలగపూడిలోనే నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి మార్చి 31వరకు, లేదా ఏప్రిల్ తొలి వారం వరకు సమావేశాలు కొనసాగుతాయి. బడ్జెట్ రూపకల్పనపై నేడు విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. బడ్జెట్‌ సమావేశాలనే కాకుండా రానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలన్నిటినీ అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top