వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి

ఓ వైపు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా...మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై దాడులు కొనసాగిస్తోంది. ఏపీ పోలీసులు శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి చేశారు. హైదరాబాద్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన పోలీసులు సోదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తదితరులు హుటాహుటీన సోషల్‌ మీడియా కార్యాలయానికి చేరుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top