అనంతపురంలో పడవ బోల్తా, 13మంది మృతి
విహార యాత్ర ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువు (ఎర్ర తిమ్మరాజు చెరువు)లో ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 13మంది దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాగా గల్లంతు అయినవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు