‘అగ్ర’ పీఠం కోసం నువ్వా.. నేనా?

పరస్పర ఆరోపణలు... విద్వేష ప్రసంగాల మధ్య అమెరికన్లకే అసహ్యం పుట్టించేలా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముగిసింది. శ్వేతసౌధ అధిపతిని ఎన్నుకునే అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. చివరి నిమిషం వరకూ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌లు ప్రచారంలో కత్తులు దూసుకున్నారు. ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, జాతి వ్యతిరేక వ్యాఖ్యల్ని హిల్లరీ అస్త్రాలుగా చేసుకోగా, ఈమెరుుల్ వివాదంలో ఆమె దోషి అని ట్రంప్ విరుచుకుపడ్డారు. దేశాధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంత వివాదాస్పద, విద్వేషపూరిత ప్రచారం ఎన్నడూ జరగలేదన్నది విశ్లేషకుల, సర్వేల అభిప్రాయం. చివరి నిమిషంలో హిల్లరీ వర్గానికి ఎఫ్‌బీఐ ఊరట నిస్తూ.. ఈమెరుుల్ వివాదంలో ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టబోమంది. ఈఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే దేశాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ అవుతారు. ట్రంప్ గెలిస్తే అత్యధిక వయసున్న అధ్యక్షుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇప్పటికే 4.2 కోట్ల మంది ముందస్తుగా ఓటేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top