రేవంత్ బెయిల్ రద్దు చేయండి

‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయసింహలకు ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సుప్రీంకోర్టులో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీ)దాఖలు చేసింది. ఏసీబీ తరపున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రారావు ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ప్రస్తావన (మెన్షనింగ్)కు అవకాశం ఇస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మెన్షనింగ్ జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో పిటిషన్ ఉంటే ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ అదే సమయంలో విచారణ మొదలుపెట్టవచ్చు లేదా మరో తేదీకి వాయిదా వేయవచ్చు లేదా పిటిషన్‌ను తిరస్కరించనూవచ్చు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top