వైఎస్ ఐదో వర్ధంతి నేడు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెంది సెప్టెంబర్ 2వ తేదీకి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఆయన ఐదో వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు, ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి తెలుగు రాష్ట్ర చరిత్రలోనే కాక, దేశం మొత్తం మీద సంక్షేమ పథకాల అమలులో తనదైన ముద్ర వేసిన వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు వైఎస్ వర్ధంతి రోజున చేపట్టాలని వైఎస్సార్ సీపీ ఇప్పటికే పిలుపునిచ్చింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా రక్తదాన శిబిరంతో పాటుగా పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top