బైక్‌ రేసింగ్‌: వ్యాపారవేత్త కుమారుడి దుర్మరణం

యువకుల పాలిట యమపాశంలా మారుతున్న సూపర్‌ బైక్‌ రేసింగ్‌ మరో యువకుణ్ని బలితీసుకుంది. చేతిలో ఖరీదైన సూపర్‌ బైక్‌, మితిమీరిన వేగం వెరసి ఓ వ్యాపార వేత్త కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో హిమాంశు బన్సల్ (24) ప్రాణాలు కల్పోయాడు. ఢిల్లీలోని మండీ హౌస్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి ప్రమాదకరమైన ఓవర్‌ టేకింగ్‌లతో దూసుకుపోతూ వ్యక్తిని తప్పించుకోవటానికి ప్రయత్నించి అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొ‍ట‍్టాడు. దీంతో హిమాంశు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. పార్టీకి హాజరైన తరువాత ముగ్గురు యువకులు సూపర్‌ బైక్‌ లపై రేసింగ్‌ మొదలుపెట్టారు. కన్నాట్ ప్లేస్ మండి హౌస్ వైపు అతి వేగంతో వెళుతుంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారి తెలిపారు. వేగవంలో బైక్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై వెళుతున్న ఒక వ్యక్తిని ఢీకొట్టిన బైక్‌ పల్టీలు కొట్టింది. అనంతరం కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top