ఇద్దరు విద్యార్థులపై దూసుకెళ్లిన లారీ

సికింద్రాబాద్‌ తాడ్‌బంద్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కిందపడిన ఇద్దరు విద్యార్థులపైకి వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top