అభిమానులు క్షమించండి: రాజమౌళి

అనివార్య కారణాల వల్ల 'బాహుబలి' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి గురువారం ప్రకటించారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, అభిమానులు క్షమించాలని ఆయన కోరారు. దర్శకుడు రాజమౌళి, నిర్మాతలతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీ ప్రెస్మీట్ పెట్టి సినిమా విశేషాలను ప్రకటించాలనుకున్నామని, అయితే ఊహించని రీతిలో అభిమానులు తరలి రానున్నారని వారికి అసౌకర్యం కలిగించకూడదనే ఆ ప్రెస్మీట్ను రద్దు చేసినట్లు చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top