ఈ-కామర్స్ పెట్టుబడులపై బియానీ కీలకవ్యాఖ్యలు
ఫ్యూచర్ గ్రూప్ అధినేత, సీఈవో కిషోర్ బియానీ అందరికీ సుపరిచితమే. ఆఫ్ లైన్ రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆఫ్ లైన్ రిటైలర్లకు గట్టి పోటీగా నిలుస్తున్న ఆఫ్ లైన్ రిటైలర్లలో పెట్టుబడులపై ఆయన స్పందించిన తీరు చూస్తే, నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఈ-కామర్స్ లో పెట్టుబడులు పెట్టాలనుకోవడం అత్యంత మూర్ఖమమైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం రెండేళ్ల వరకు తాను ఈ-కామర్స్ రంగంలో పెట్టుబడులు పెట్టబోనని స్పష్టీకరించారు. ఆయన ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణాలున్నాయంట. ఈ గ్రూప్ ఇప్పటికే రూ.300 కోట్ల మేర నష్టాల్లో మునిగిపోయిందని, పరిశ్రమల మెగా ప్రకటనల వల్ల కంపెనీ భారీగా నష్టాలను చవిచూస్తున్నాయని తెలిసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
క్రీడలు
వైరల్ వీడియోలు