ట్రంప్తో మన ఐటీకి ఊహించని మేలు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలతో దేశీ ఐటీ రంగానికి ఊహించని మేలే జరగవచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు దేశీ మార్కెట్లో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు తోడ్ప డగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ట్రంప్ రక్షణాత్మక ధోరణులు భారత ఐటీ రంగంతో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ట్రంప్ రాక నిజంగానే అనుకోని మేలు చేయొచ్చు. అతి పెద్ద మార్కెట్ అయిన మన దేశ సమస్యలపై భారత ఐటీ పరిశ్రమ.. ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
క్రీడలు
వైరల్ వీడియోలు