breaking news
Virat Kohli
-
కోహ్లి, రోహిత్లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!
వన్డే ప్రపంచకప్-2027లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతురా? అంటే అవునానే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సీనియర్ క్రికెటర్లు ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో రో-కో అదరగొట్టారు.కోహ్లి రెండు సెంచరీలతో సత్తాచాటి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలవగా.. రోహిత్ కూడా పరుగులు వరద పారించాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నప్పటికి మిగితా క్రికెటర్ల కంటే చాలా యాక్టివ్గా, ఫిట్గా ఉన్నారు. వారి వయస్సు వారి జోరుకు అడ్డు కావడం లేదు.భారత క్రికెట్కే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో రో-కో వన్డే ప్రపంచకప్లో కచ్చితంగా ఆడుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్ను విలేకరులు ప్రశ్నించారు. "రోహిత్, కోహ్లిలు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు.రాబోయో రోజుల్లో కూడా తమ ఫామ్ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇది 50 ఓవర్ల ఫార్మాట్లో చాలా ముఖ్యం. అయితే వన్డే ప్రపంచకప్కు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. మనం వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: సూర్యను కెప్టెన్గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat kohli) ఖాతాలో మరో రికార్డు చేరింది. సౌతాఫ్రికా వన్డే సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలవడంతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో మరో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. సచిన్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉండగా.. విరాట్ ఖాతాలో 20వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు చేరింది. ఈ విభాగంలో విరాట్, సచిన్ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (17), జాక్ కల్లిస్ (14), సనత్ జయసూర్య (13), డేవిడ్ వార్నర్ (13) ఉన్నారు.జయసూర్య రికార్డు సమంప్రత్యేకించి వన్డే క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్కు వన్డేల్లో ఇది 11వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో విరాట్ సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు. జయసూర్య ఖాతాలోనూ 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా సచిన్ చలామణి అవుతున్నాడు.కాగా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. వరుసగా రెండు శతకాలు (135, 102) సహా చివరి మ్యాచ్లో అజేయమైన అర్ద సెంచరీ (65) చేశాడు. ఈ ప్రదర్శనలకు గానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.జైస్వాల్ సూపర్ సెంచరీ.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్విశాఖ వేదికగా నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (106) సెంచరీ సాయంతో 270 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీ.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్దే
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. పర్యాటక ప్రోటీస్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది.జైశ్వాల్ సెంచరీ..లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Look at what it means to him! 🥳What a special knock this has been from Yashasvi Jaiswal 🙌Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY— BCCI (@BCCI) December 6, 2025డికాక్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.Virat Kohli in this series :Innings -3 Runs - 302Avg. - 151SR - 117.05100s- 250s-1Should get Man of the Series.#ViratKohli𓃵 pic.twitter.com/NVeNDgTqU2— Pedriverse (@Cules651) December 6, 2025చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్ -
ఎట్టకేలకు టాస్ గెలిచిన టీమిండియా..
టీమిండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా విశాఖపట్నంలో తమ దురదృష్టానికి స్వస్తి పలికింది. 21వ ప్రయత్నంలో వన్డేల్లో తొలిసారి టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అందుకే తొలుత బౌలింగ్ఈ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేస్తాం. నిన్న రాత్రి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేశాము. రాంచి, రాయ్పూర్లో మాదిరి కాకుండా ఇక్కడ తేమ కాస్త ఆలస్యంగా ప్రభావం చూపుతోందని గ్రహించాము.వాషీపై వేటు.. జట్టులోకి తిలక్అందుకే లక్ష్య ఛేదననే మేము ఎంచుకున్నాము. ఈ వికెట్ బాగుందనిపిస్తోంది. గత రెండు మ్యాచ్లలో మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాము. పరిస్థితులకు తగ్గట్లుగా ఇంకాస్త మెరుగుపడితే అనుకున్న ఫలితం రాబట్టవచ్చు. ఈ మ్యాచ్లో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ (Tilak Varma) తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.గాయాలతో వారిద్దరు దూరంమరోవైపు.. సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (Temba Bavuma) సైతం టాస్ గెలిస్తే తాము తొలుత బౌలింగే ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. రాంచి, రాయ్పూర్ మాదిరి ఇక్కడ కూడా ఆఖరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగితే ప్రేక్షకులు సంతోషిస్తారన్న బవుమా.. బర్గర్, డి జోర్జి స్థానాల్లో ఒట్నీల్ బార్ట్మన్, ర్యాన్ రికెల్టన్ తుదిజట్టులోకి వచ్చారని తెలిపాడు. బర్గర్, డి జోర్జి గాయాల కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.ఫలితం తేల్చే మ్యాచ్కాగా మూడు వన్డేలో సిరీస్లో భాగంగా రాంచిలో తొలి మ్యాచ్లో టీమిండియా ఆదివారం పదిహేడు పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మన్.చదవండి: భారత్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు -
వైజాగ్ అంటే 'కింగ్'కు పూనకాలే..!
వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 6) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే సిరీస్ కైవసం చేసుకుంటుంది. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.వైజాగ్ వన్డే ప్రారంభానికి ముందు అందరి కళ్లు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. ఈ సిరీస్లో ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.కోహ్లి ఉన్న ఫామ్ను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. వైజాగ్ పిచ్ కూడా కోహ్లికి అద్భుతంగా సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానం అంటే కింగ్కు పూనకాలు వస్తాయి. ఇక్కడ అతనాడిన 7 మ్యాచ్ల్లో ఏకంగా 97.83 సగటున 587 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 2 అర్ద శతకాలు ఉన్నాయి.స్ట్రయిక్రేట్ కూడా 100కు పైబడే ఉంది. ఈ గణాంకాలు చూస్తే కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు. వైజాగ్లో మరిన్ని పరిస్థితులు కూడా కోహ్లి హ్యాట్రిక్ సెంచరీకి అనుకూలంగా ఉన్నాయి.పిచ్ స్వభాగం కోహ్లి బ్యాటింగ్ శైలికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌన్స్కు అవకాశమున్నా, బంతి బ్యాట్ వద్దకు సలువుగా వస్తుంది. ఈ పరిస్థితి కోహ్లిని రెచ్చిపోయేలా చేస్తుంది. బలంగా షాట్లు ఆడటం కంటే, టైమింగ్, బ్యాలెన్స్, ప్లేస్మెంట్ను నమ్ముకునే కోహ్లి బంతి బ్యాట్ వద్దకు వస్తే చెలరేగిపోతాడు.కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వైజాగ్లోని చిన్న బౌండరీలు మరో కారణం. పిచ్ ఎలాగూ సహకరిస్తుంది కాబట్టి, కోహ్లి తన సహజశైలిలో పంచ్ షాట్లు, డ్రైవ్లు ఆడితే సులువుగా బౌండరీలు వస్తాయి. కోహ్లికి పెద్దగా స్ట్రయిక్ రొటేట్ చేసే పని కూడా ఉండదు. పిచ్ స్వభావం, చిన్న బౌండరీలు ఉండటం చేత కోహ్లి వేగంగా పరుగులు చేయడంతో పాటు భారీ సెంచరీ చేసే ఆస్కారముంది.కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వీటన్నిటి కంటే ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. అదేంటంటే.. బలహీనమైన దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా ఎంత బలహీనంగా ఉందో గత మ్యాచ్లో స్పష్టమైంది. ప్రధాన పేసర్లు ఎంగిడి, జన్సెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరో ప్రధాన పేసర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఒకవేళ నేటి మ్యాచ్లో ఈ ముగ్గురూ బరిలోకి దిగినా పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోవచ్చు. స్పిన్నర్లను కోహ్లి ఎంత అలవోకగా ఎదుర్కోగలడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు. -
కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్లో ఎక్కువ మంది వెతికింది అతడినే
టీమిండియా లెజెండ్స్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఐపీఎల్లో అతడి ఆట కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అదేవిధంగా రో-కో ద్వయం కూడా కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నప్పటికి వారిని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. కానీ 2025 ఏడాదిలో వీరి ముగ్గురుని ఓ యువ క్రికెటర్ అధిగమించాడు. అతడి గురుంచి తెలుసుకునేందుకు నెటజన్లు గూగుల్లో తెగ వెతికేశారు. అతడే భారత అండర్-19 సంచలనం, ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది గూగుల్లో భారత్లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఈ వండర్ కిడ్ ఐపీఎల్, ఇండియా 'ఎ'మ్యాచ్లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో తన సంచలన ప్రదర్శనతో అందరిని ఆకర్షించాడు. దీంతో అతడి గురుంచి తెలుసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపారు. వైభవ్ 12 ఏళ్ల వయస్సలోనే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' నివేదిక ప్రకారం.. వైభవ్ అగ్రస్ధానంలో ఉండగా మరో యువ సంచలనం పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య సెకెండ్ ప్లేస్లో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్దానంలో అభిషేక్ శర్మ మరియు షేక్ రషీద్ నిలిచారు. అదేవిధంగా మహిళల ప్రపంచకప్ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ గురుంచి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు.చదవండి: ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్! -
IND vs SA: ఈ హీరోని మర్చిపోతే ఎలా?.. కెప్టెన్గానూ సరైనోడు!
జట్టులో తమకంటూ ప్రత్యేక బ్యాటింగ్ స్థానం లేకపోయినా టీమిండియాకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉంటాడు. 2014లో ఓపెనర్గా భారత జట్టు తరఫున ప్రస్థానం మొదలుపెట్టిన ఈ కర్ణాటక ఆటగాడు.. వికెట్ కీపర్గానూ సేవలు అందించాడు.తరచూ మార్పులుఅయితే, తర్వాతి కాలంలో రాహుల్ (KL Rahul) తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఓసారి ఐదో నంబర్ బ్యాటర్గా.. మరోసారి నాలుగో స్థానంలో.. ఆ తర్వాత మళ్లీ ఓపెనర్గా ఇలా వివిధ స్థానాల్లో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నిలకడైన ఆటతో రాణిస్తూ తనను తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు రాహుల్. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత రాహుల్కు టెస్టుల్లో ఓపెనర్గా వరుస అవకాశాలు వస్తున్నాయి.కీపింగ్ బాధ్యతలు కూడా.. ఇదిలా ఉంటే.. వన్డేల్లోనూ రాహుల్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్ బ్యాటర్గా తన సేవలు అందిస్తున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా తానే నిర్వర్తిస్తున్న రాహుల్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు తాత్కాలిక కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు.సఫారీ జట్టుతో తొలి వన్డేలో ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రాహుల్. కేవలం 56 బంతుల్లోనే 60 పరుగులు (రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించాడు. లెజెండరీ బ్యాటర్లు రోహిత్ శర్మ (57), విరాట్ కోహ్లి (135)తో రాహుల్ మెరుపు అర్ధ శతకంతో రాణించడంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందిరాహుల్ విలువైన ఇన్నింగ్స్ఇక ఈ మ్యాచ్లో బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆఖరి నిమిషంలో సత్తా చాటడంతో 17 పరుగుల తేడాతో భారత జట్టు గట్టెక్కింది. అదే విధంగా రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టగా (102).. రుతురాజ్ గైక్వాడ్ (105) కూడా సెంచరీతో అలరించాడు. వీరిద్దరికి తోడుగా రాహుల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్లో 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించినా టీమిండియా గెలవలేకపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగా నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్లోనూ బ్యాటర్గా, కెప్టెన్గా రాహుల్ తనదైన ముద్ర వేయగలిగాడు. అయితే, రో-కోల హవాలో అతడి ఆటకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.కెప్టెన్గానూ రాహుల్కు మంచి రికార్డు నిజానికి టీమిండియా కెప్టెన్గానూ రాహుల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా అతడు పద్దెనిమిదిసార్లు భారత జట్టును సారథిగా ముందుకు నడిపించాడు. ఇందులో ఏకంగా పన్నెండుసార్లు టీమిండియా గెలిచింది. రాహుల్ కెప్టెన్సీలో 14 వన్డేలకు గానూ తొమ్మిదింట విజయం సాధించిన టీమిండియా.. టెస్టుల్లో మూడింటికి రెండు, టీ20లలో ఒకటికి ఒకటి గెలిచింది.మరో విశేషం ఏమిటంటే.. రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఇప్పటికి ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఓవరాల్గా రాహుల్ సారథ్యంలో కోహ్లి సాధించిన స్కోర్లు వరుసగా... 122,51,0,65,113,135,102. ఇందులో చివరి రెండు సెంచరీలు సౌతాఫ్రికాతో వన్డేల్లో బాదినవే.ఏదేమైనా.. టీమిండియా విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించిన రాహుల్.. తెరవెనుకే ఉండిపోతున్నాడనే అభిప్రాయం అతడి అభిమానుల్లో ఉంది. అంతేకాదు.. కెప్టెన్గానూ రాణించగల సత్తా ఉన్నా ఈ 33 ఏళ్ల ఆటగాడికి అదృష్టం కలిసి రావడం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే సారథిగా రాహులే సరైనోడు అన్న విషయాన్ని యాజమాన్యం గుర్తిస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్పై రూట్ పంజా -
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
-
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
-
358 సరిపోలేదు
విరాట్ కోహ్లి తన అసాధారణ ఫామ్ను కొనసాగిస్తూ వన్డేల్లో 53వ సెంచరీతో చెలరేగాడు. అండగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. జట్టు గత మ్యాచ్లోకంటే మరో 9 పరుగులు ఎక్కువే చేసింది. అయినా సరే, రెండో వన్డేలో భారత్కు ఓటమి తప్పలేదు. రాంచీలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన సఫారీలు ఈసారి రాయ్పూర్లో పట్టు వదల్లేదు. ఏకంగా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను సమం చేశారు. మార్క్రమ్, బ్రెవిస్, బ్రెట్కీ బ్యాటింగ్ జోరుతో పాటు బౌలర్ల వైఫల్యం, అతి పేలవ ఫీల్డింగ్తో భారత్ నుంచి మ్యాచ్ చేజారింది. రాయ్పూర్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (93 బంతుల్లో 102; 7 ఫోర్లు, 2 సిక్స్లు) వరుసగా రెండో శతకంతో చెలరేగగా... రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడి కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. కోహ్లి, రుతురాజ్ మూడో వికెట్కు 26 ఓవర్లలో 156 పరుగులు జోడించగా, చివర్లో కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు సాధించింది. మార్క్రమ్ (98 బంతుల్లో 110; 10 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ నమోదు చేయగా... మాథ్యూ బ్రీట్కే (64 బంతుల్లో 68; 5 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే శనివారం విశాఖపట్నంలో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా... బర్గర్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (14) అదే ఓవర్లో వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జైస్వాల్ కూడా అవుటయ్యాడు. అయితే కోహ్లి, రుతురాజ్ భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. సిక్స్తో ఖాతా తెరిచిన కోహ్లి ఆ తర్వాత తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 66 పరుగులు చేసింది. గత మ్యాచ్లో అవకాశం వృథా చేసుకున్న రుతురాజ్ ఈసారి పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. ఇద్దరిలో ముందుగా రుతురాజ్ 52 బంతుల్లో, ఆ తర్వాత కోహ్లి 47 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నారు. అనంతరం మరింత జోరు పెంచిన రుతురాజ్... మహరాజ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. యాన్సెన్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ అతని ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. మరోవైపు బాష్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన రుతురాజ్ 77 బంతుల్లోనే తన తొలి శతకాన్ని అందుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరేందుకు అతను 25 బంతులే తీసుకున్నాడు. సెంచరీ తర్వాత రుతురాజ్ అవుట్ కాగా... యాన్సెన్ ఓవర్లో సింగిల్తో కోహ్లి సెంచరీ (90 బంతుల్లో) పూర్తయింది. ఆవెంటనే కోహ్లి వెనుదిరిగాడు. సుందర్ (1) విఫలం కాగా, రాహుల్, రవీంద్ర జడేజా (24 నాటౌట్) కలిసి స్కోరును 350 పరుగులు దాటించారు. ఈ క్రమంలో రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకోగా, ఆఖరి 10 ఓవర్లలో భారత్ 76 పరుగులు రాబట్టగలిగింది. బ్రెవిస్ దూకుడు... దక్షిణాఫ్రికా టాప్–5లో డికాక్ (8) మినహా మిగతా వారంతా లక్ష్య ఛేదనలో తమవంతు పాత్ర పోషించారు. జట్టు ఇన్నింగ్స్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన తర్వాత మార్క్రమ్, బవుమా కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన మార్క్రమ్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 88 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. అతను అవుటయ్యే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 30 ఓవర్లలో 197/3. మిగిలిన 20 ఓవర్లలో 8.10 రన్రేట్తో 162 పరుగులు అసాధ్యంగా కనిపించింది! అయితే ఇక్కడే బ్రెవిస్ ఆట స్వరూపాన్ని మార్చాడు. కుల్దీప్, హర్షిత్ బౌలింగ్లో చెరో రెండు చొప్పున మొత్తం ఐదు సిక్సర్లు బాదడంతో చేయాల్సిన రన్రేట్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బ్రెవిస్, బ్రీట్కే నాలుగో వికెట్కు 64 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగినా... కార్బిన్ బాష్ (15 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) నిలిచి మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బాష్ (బి) యాన్సెన్ 22; రోహిత్ (సి) డికాక్ (బి) బర్గర్ 14; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 102; రుతురాజ్ (సి) జోర్జి (బి) యాన్సెన్ 105; రాహుల్ (నాటౌట్) 66; సుందర్ (రనౌట్) 1; జడేజా (నాటౌట్) 24; ఎక్స్ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–40, 2–62, 3–257, 4–284, 5–289. బౌలింగ్: బర్గర్ 6.1–0–43–1, ఎన్గిడి 10–1–51–1, యాన్సెన్ 10–0–63–2, మహరాజ్ 10–0–70–0, బాష్ 8–0–79–0, మార్క్రమ్ 5.5–0–48–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 110; డికాక్ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 8; బవుమా (సి) హర్షిత్ (బి) ప్రసిధ్ 46; బ్రీట్కే (ఎల్బీ) (బి) ప్రసిధ్ 68; బ్రెవిస్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 54; జోర్జి (రిటైర్డ్హర్ట్) 17; యాన్సెన్ (సి) రుతురాజ్ (బి) అర్‡్షదీప్ 2; బాష్ (నాటౌట్) 29; మహరాజ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 18; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–26, 2–127, 3–197, 4–289, 5–317, 6–322. బౌలింగ్: అర్ష్ దీప్ 10–0–54–2, హర్షిత్ 10–0–70–1, ప్రసిధ్ 8.2–0–85–2, సుందర్ 4–0–28–0, జడేజా 7–0–41–, కుల్దీప్ 10–0–78–1. 11 కోహ్లి వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు సాధించడం ఇది 11వ సారి.34 కోహ్లి తన వన్డే కెరీర్లో 34 వేర్వేరు వేదికల్లో సెంచరీ సాధించాడు. సచిన్ కూడా 34 వేదికల్లో శతకాలు బాదాడు.44 ఒకే వన్డే ఇన్నింగ్స్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది 44వ సారి.3 దక్షిణాఫ్రికాపై మూడుసార్లు వన్డేల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయగా.. మూడుసార్లూ భారత్ ఓడిపోవడం గమనార్హం. 1991 నవంబర్ 14న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్... 2001 అక్టోబర్ 5న జొహనెస్బర్గ్లో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సెంచరీలు చేశారు. ఈ రెండింటిలోనూ భారత్ ఓటమి పాలైంది.2 రుతురాజ్ గైక్వాడ్ టి20 (2023 నవంబర్ 28న ఆ్రస్టేలియాపై గువాహటిలో 123 నాటౌట్), వన్డే (2025 డిసెంబర్ 3న రాయ్పూర్లో దక్షిణాఫ్రికాపై 105) ఫార్మాట్లలో తన తొలి సెంచరీ చేసిన రెండు సందర్భాల్లోనూ భారత్ ఓడిపోయింది.2 వన్డేల్లో భారత్పై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. 2019లో మొహాలీలో జరిగిన వన్డేలోనూ ఆ్రస్టేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. -
IND vs SA: టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా
రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది.ప్రోటీస్ ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 110) సూపర్ సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రీట్జ్కే(64 బంతుల్లో 68), బ్రెవిస్(34 బంతుల్లో 54) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఆఖరిలో కార్బిన్ బాష్(14 బంతుల్లో 25) మరోసారి కీలక నాక్ ఆడాడు.ఈ మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక్క అర్ష్దీప్ మినహా మిగితా బౌలర్లందరూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు తోడు చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ కొంపముంచింది. మిస్ ఫీల్డ్ల రూపంలో టీమిండియా దాదాపు 30 పరుగులు సమర్పించుకుంది. అర్ష్దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించారు.కోహ్లి, రుతు సెంచరీలు వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి((93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 105) సెంచరీలతో చెలరేగగా.. రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు. అయితే భారత్ ఓటమి పాలవ్వడంతో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే శనివారం వైజాగ్ వేదికగా జరగనుంది. -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్..సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో రుతురాజ్ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని.. రుతురాజ్కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్పై వేటు వేసి.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్మెంట్ రుతుకు మరో అవకాశం ఇచ్చింది. రాయ్పూర్ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్ ఎలెవన్కు ఎంపిక చేసింది.77 బంతుల్లోనే సెంచరీఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.మరికొన్నాళ్లపాటు..సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇవ్వడంతో రుతురాజ్ ఇన్నింగ్స్కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే రుతురాజ్ను మేనేజ్మెంట్.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డుఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్పూర్లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది.ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్లు జరుగగా.. కివీస్తో వన్డేలో నాటి కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్ శతకం సాధించి.. రోహిత్ పేరును చెరిపేశాడు.మరో రెండు రికార్డులుఇక ఈ మ్యాచ్లో రుతురాజ్తో పాటు విరాట్ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. అంతకు ముందు యూసఫ్ పఠాన్ 2011లో ప్రొటిస్ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.చదవండి: BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన -
శతక్కొట్టిన రుతురాజ్, కోహ్లి.. రాహుల్ మెరుపు ఇన్నింగ్స్
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (102), రుతురాజ్ (105) సెంచరీలతో చెలరేగారు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025 రాహుల్ మెరుపు అర్ధ శతకంతాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) రనౌట్ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్ పడగొట్టారు.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్.. ప్రొటిస్పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్కు ఇది రెండో అత్యధిక స్కోరు.వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్-5 జాబితా🏏గ్వాలియర్ వేదికగా 2010లో 401/3🏏రాయ్పూర్ వేదికగా 2025లో 358/5🏏రాంచి వేదికగా 2025లో 349/8🏏కార్డిఫ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ 2013లో 331/7🏏కోల్కతా వేదికగా వన్డే వరల్డ్కప్ 2023లో 326/5.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి -
IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేల్లో శతక్కొట్టిన కోహ్లి.. రాయ్పూర్లో రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా చాన్నాళ్ల తర్వాత ‘విన్టేజ్’ కోహ్లిని గుర్తు చేస్తూ వరుసగా రెండు శతకాల (Back to Back Centuries)తో సత్తా చాటాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamsion) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇంతకీ అదేమిటి అంటారా?... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లి (Virat Kohli) పునరాగమనం చేశాడు. కానీ, ఆసీస్ గడ్డపై తొలి రెండు వన్డేల్లో అనూహ్య రీతిలో అతడు డకౌట్ అయ్యాడు.అయితే, మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (74) బాది ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్లో (IND vs SA ODIs)నూ దుమ్ములేపుతున్నాడు. సఫారీలతో తొలి వన్డేలో 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో వన్డేలో తొంభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కోహ్లి శతక ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025మొత్తంగా రాయ్పూర్లో 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్లో.. ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి రెండో వికెట్కు 22 పరుగులు జోడించిన కోహ్లి.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (105)తో కలిసి 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.అనంతరం తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి 27 పరుగులు జోడించి కోహ్లి నిష్క్రమించాడు. కాగా సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్.. సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా ఉండగా.. కోహ్లి తాజాగా కేన్ మామ ప్రపంచ రికార్డును సమం చేశాడు.సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లి సెంచరీలు🏏కోల్కతా వేదికగా వన్డే వరల్డ్కప్ 2023లో 101 నాటౌట్🏏రాంచి వేదికగా 2025లో 135 పరుగులు🏏రాయ్పూర్ వేదికగా 2025లో 102 పరుగులుచదవండి: IND vs SA: గంభీర్ నమ్మకమే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్ -
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా విరాట్కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆరంభంలోనే రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్..వన్డేల్లో అత్యధిక సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 32 సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని మరొక ఆటగాడితో కలిసి నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ వరల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.టీమిండియా భారీ స్కోరుఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. తద్వారా సఫారీ జట్టుకు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా భారత బ్యాటర్లలో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు కొట్టగా.. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మెరుపు అర్ధ శతకం (43 బంతుల్లో 66 నాటౌట్) సాధించాడు.Play it on loop ➿Just like Virat Kohli 😎💯Yet another masterful knock! 🫡 Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/WYbSDLEQRo— BCCI (@BCCI) December 3, 2025 -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వన్డే పునరాగమనంలో వరుస మ్యాచ్లలో దుమ్ములేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ అర్ధ శతకం (74 నాటౌట్) బాది ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తున్నాడు.సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేలో కోహ్లి (Virat Kohli) శతక్కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 120 బంతుల్లోనే 135 పరుగులతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం నమోదు చేసి.. శతక శతకాలకు మరింత చేరువయ్యాడు.రెండో వన్డేలోనూ దూకుడుఇక తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ కోహ్లి దంచికొట్టాడు. రాయ్పూర్ వేదికగా 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వరుసగా మూడోసారి యాభై పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలోనే కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు.చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లియాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా13 వేర్వేరు సందర్భాల్లో (13 Streaks) వరుసగా మూడు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి నిలకడైన ఆటకు ఇదే నిదర్శనం. గతంలో భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ 11 సందర్భాల్లో ఈ ఫీట్ నమోదు చేయగా.. సచిన్ టెండుల్కర్ పది సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు.కోహ్లి- రుతు ధనాధన్మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు ఎంచుకున్న టీమిండియా 31వ ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, నాలుగో నంబర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని నూటా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. UPDATE: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్ సెంచరీచదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్ -
వరల్డ్ నెం1 ర్యాంక్కు చేరువలో కోహ్లి.. గిల్ను వెనక్కి నెట్టి
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లి భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టి నాలుగో స్ధానానికి చేరుకున్నాడు. రాంచీ వన్డేలో సెంచరీతో సత్తాచాటడంతో కోహ్లి(751 రేటింగ్ పాయింట్లు) తన ర్యాంక్ను మెరుగుపరుచుకున్నాడు. విరాట్ కంటే ముందు ఇబ్రహీం జద్రాన్(764), డార్లీ మిచెల్(766 రేటింగ్ పాయింట్లు), రోహిత్ శర్మ(783) ఉన్నారు. అగ్రస్ధానంలో రోహిత్ కంటే విరాట్ ఇంకా కేవలం 33 రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో కింగ్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడితే రోహిత్ను అధిగమించడం ఖాయం. రెండో వన్డేలో రోహిత్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.కాగా వన్డేల్లో కోహ్లి 2018 నుంచి 2021 వరకు దాదాపు మూడేళ్ల పాటు వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగాడు. ఆ తర్వాత పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం.. కోహ్లి స్ధానంలో దూసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కోహ్లి ఒక్కసారి కూడా వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్ధానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కింగ్ కోహ్లి ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడటమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.చదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్ -
అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపించినా.. టెస్టుల్లో అతడికి ఇప్పటికే రెండు చేదు అనుభవాలు చవిచూశాడు. గంభీర్ మార్గదర్శనంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 3-0తో వైట్వాష్కు గురైంది.గంభీర్ టెస్టు కోచ్గా పనికిరాడంటూ..భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా ఓ విదేశీ జట్టు చేతిలో మన జట్టు మూడు మ్యాచ్ల సిరీస్లో క్లీన్స్వీప్ కావడం ఇదే తొలిసారి. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)ని కోల్పోయింది. ఆసీస్ చేతిలో 3-1తో ఓడి ఇంటిబాట పట్టింది.ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో టెస్టు సిరీస్ను సమం చేసిన టీమిండియా.. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్వాష్కు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్ టెస్టు కోచ్గా పనికిరాడని.. అతడిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్లు పెరిగాయి.బీసీసీఐదే నిర్ణయంఈ విషయంపై గంభీర్ (Gautam Gambhir) స్వయంగా స్పందిస్తూ.. తన హయాంలోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025, ఆసియా టీ20 కప్-2025లో జట్టు గెలిచిందని పేర్కొన్నాడు. తనను కోచ్గా కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకుంటుందని స్పష్టం చేశాడు.అదే జరిగితే నీపై వేటు వేస్తారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ప్రభాత్ ఖబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ భవితవ్యం గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘మన ప్రదర్శన బాగా లేకుంటే.. కచ్చితంగా మనపై వేటు వేస్తారు. పదవి నుంచి తొలగిస్తారు.పరస్పర సమన్వయం, ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఇక్కడ అత్యంత ముఖ్యం. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటేనే అంతా సాఫీగా సాగిపోతుంది. గెలిచేలా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలి. కోచ్లుగా మా పని అదే. అయితే, మనం చేసే పని పట్ల ఇష్టం ఉండాలి. దానిని ఆస్వాదించాలి. అంతేగానీ ఒత్తిడిగా ఫీలవ్వకూడదు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అయిన రవిశాస్త్రి.. 2017- 2021 వరకు భారత జట్టు హెడ్కోచ్గా వ్యవహరించాడు. అతడి మార్గదర్శనంలోనే తొలిసారి టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలు గెలిచింది. అంతేకాదు.. సౌతాఫ్రికాలో తొలిసారి వన్డే సిరీస్ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. రవిశాస్త్రి- నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి కాంబినేషన్లో టెస్టుల్లో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా అగ్రపీఠానికి చేరుకుంది.చదవండి: హర్షిత్ రాణాకు బిగ్ షాక్ -
IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత తుదిజట్టు అదే!
భారత్తో రెండో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్తో తిరిగి జట్టుతో చేరిన ప్రొటిస్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘వికెట్ పాత బడుతున్న కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. తేమ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మేము తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం.అయితే, పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందో ముందుగా చెప్పడం కష్టమే. గత మ్యాచ్లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. నాతో పాటు కేశవ్ మహరాజ్ (Keshav Maharan), లుంగి ఎంగిడి తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ మాకెంతో కీలకమైనది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత్తో తొలి వన్డేలో విఫలమైన సఫారీ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్పై వేటు పడగా.. పేసర్లు ప్రెనేలన్ సుబ్రేయన్, ఒట్నీల్ బార్ట్మన్ తమ స్థానాలు కోల్పోయారు.తుది జట్టులో మార్పులు లేవుమరోవైపు.. మరోసారి టాస్ ఓడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘకాలంగా మేము టాస్ గెలవలేకపోతున్నాం. ఏదేమైనా గత మ్యాచ్లో మా ప్రదర్శన అద్భుతంగా సాగింది. ప్రత్యర్థి జట్టు కూడా గట్టి పోటీనిచ్చింది.పరుగులు సాధించడంతో పాటు.. వరుస విరామాల్లో వికెట్లు తీస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలము.ఈ వికెట్ బాగుంది. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు. ఆధిక్యంలో టీమిండియాకాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా రాంచి వేదికగా ఆదివారం తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో భారత జట్టు 17 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది.ఈ మ్యాచ్లో భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli) శతక్కొట్టడం (135), రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) రాణించడం హైలైట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలోనూ రో-కో ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరు మరోసారి చితక్కొడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో వన్డే తుదిజట్లు👉వేదిక: షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్పూర్👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికా తుదిజట్టుక్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ప్లేయర్ -
విరాట్ కోహ్లి అభిమానులకు పిచ్చెక్కించే వార్త
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానులకు ఇది బంపర్ బొనాంజా లాంటి వార్త. కింగ్ త్వరలో జరుగబోయే దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులగా ఈ విషయమై సందిగ్దత నెలకొని ఉండింది. కోహ్లి స్వయంగా తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని చెప్పడంతో అతడి అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి.. దేశవాలీ టోర్నీ ఆడనుండటం క్రికెట్ అభిమానులకు నిజంగా పండుగే. కోహ్లి తన సొంత దేశవాలీ జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ ఆడేందుకు కోహ్లి సంసిద్దత వ్యక్తం చేసిన విషయాన్ని ఢిల్లీ క్రికెట్ ఆసోసియేషన్ చీఫ్ రోహన్ జైట్లీ ధృవీకరించారు.ఈ విషయాన్ని ఆయన క్రిక్బజ్ మాధ్యమంగా వెల్లడిస్తూ.. అవును.. కోహ్లి విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న మాట వాస్తవమే. అయితే అతడెన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడన్న విషయం ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 వరకు జరుగుతుంది.కాగా, జాతీయ జట్టు పరిగణలో ఉండాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక రాణించాల్సి ఉంటుందని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కోహ్లి ఈ నిర్ణయం 2027 ప్రపంచకప్ ఆడాలనుకున్న అతని బలమైన సంకల్పాన్ని సూచిస్తుంది.కోహ్లి చివరిగా 2009-10 విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఈ టోర్నీలో అతను 14 మ్యాచ్లు ఆడి నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 819 పరుగులు చేశాడు. ఈ గణంకాలు చూస్తే చాలు ఈ టోర్నీలోనూ కింగ్ హవా ఎలా కొనసాగిందో చెప్పడానికి.ఇదిలా ఉంటే, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత కోహ్లి అత్యుత్తమ టచ్లో ఉన్నట్లు కనిపించాడు. చూడచక్కని డ్రైవ్లు, షాట్లు ఆడి అభిమానులకు అలరించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్తో కోహ్లి తన కెరీర్ అత్యున్నత స్థితిని గుర్తు చేశాడు. -
‘కోహ్లి భవిష్యత్తుపై చర్చ అనవసరం’
రాంచీ: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో అద్భుత ఇన్నింగ్స్తో ఆదివారం తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. గత కొంత కాలంగా జట్టులో కోహ్లి స్థానంపై, 2027 వరల్డ్ కప్ వరకు ఆడటంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్లోనూ అతని ప్రదర్శనపై అందరి దృష్టీ నిలుస్తోంది. అయితే ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఖండించాడు. కోహ్లి భవిష్యత్తు అనేది అసలు చర్చించాల్సిన అంశమే కాదని అతను స్పష్టం చేశాడు. ఇంత బాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంకేం ఆశిస్తామని కొటక్ వ్యాఖ్యానించాడు. ‘కోహ్లి గురించి ఈ తరహాలో ఆలోచించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు. అతను చాలా గొప్పగా ఆడుతున్నాడు. అసలు అతని భవిష్యత్తుపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది. అతని ఆట, ఫిట్నెస్ చూస్తే మరో చర్చకు తావు లేదు. కోహ్లి బ్యాటింగ్ అసాధారణంగా ఉంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే మరో విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కోహ్లి, రోహిత్ ఇద్దరూ జట్టు విజయంలో తమ పాత్ర పోషిస్తున్నారు. వారిద్దరికీ ఎంతో అనుభవం ఉంది. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. జట్టు విజయంలో వారి భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది’ అని కొటక్ భారత్ బ్యాటర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మంచు ప్రభావం కారణంగా తమ బౌలర్లను పట్టు చిక్కలేదని, అందుకే దక్షిణాఫ్రికా కూడా భారీగా పరుగులు సాధించి విజయానికి చేరువగా రాగలిగిందని విశ్లేíÙంచిన కొటక్...ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యరి్థని కట్టడి చేసిన హర్షిత్ రాణాపై ప్రత్యేకంగా ప్రశంసించాడు. -
రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవితవ్యం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్గా రోహిత్ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆద్యంతం అద్భుత ఆట తీరుతోఅయితే, ఆసీస్ టూర్లో అందుకు భిన్నంగా రోహిత్- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.రాంచి వేదికగా రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 83వ శతకం బాది తన బ్యాటింగ్లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.అగ్రెసివ్గా సెలబ్రేషన్స్ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకోగా.. రోహిత్ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్కాగా..రో- కో ఫ్యాన్స్ హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 బీసీసీఐ సీరియస్!ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్- అగార్కర్లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్పూర్ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్- అగార్కర్కు అస్సలు మాటల్లేవు.ఇక కోహ్లి- గంభీర్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్- కోహ్లి అభిమానులు గంభీర్- అగార్కర్లను ట్రోల్ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్రూమ్లోకి వెళ్లే సమయంలో గంభీర్ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్లాబీలో గంభీర్తో రోహిత్ సీరియస్గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్తో హోటల్ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసింది.తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కేక్ కట్ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాKohli completely ignored gambhir after win 😭😭 pic.twitter.com/XNBwPZPN0q— ADITYA (@Wxtreme10) December 1, 2025Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025 -
వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్
టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్కు గురైన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. సమిష్టి కృషితో రాణించి మొదటి వన్డేలో విజయం సాధించింది. అయితే, సఫారీలు సైతం ఓటమిని అంత తేలికగా అంగీకరించలేదు.యాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్టీమిండియా విధించిన 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆఖరి వరకు ప్రొటిస్ జట్టు గట్టిగా పోరాడింది. నాలుగో నంబర్ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్కే (80 బంతుల్లో 72) ఆచితూచి ఆడగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) మెరుపు ఇన్నింగ్స్ (39 బంతుల్లోనే 70)తో దుమ్ములేపాడు.ఓ దశలో యాన్సెన్ సెంచరీ దిశగా పయనించగా.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుత బంతితో అతడిని వెనక్కి పంపించాడు. బ్రీట్జ్కే, యాన్సెన్ నిష్క్రమించిన తర్వాత సఫారీ జట్టు ఓటమి ఖాయమనే అంచనాలు ఏర్పడగా.. మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ (Corbin Bosch) అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. బాష్ ఒంటరి పోరాటంఓవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖరి ఓవర్ వరకు బాష్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం (51 బంతుల్లో 67) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం పద్దెనిమిది పరుగులుగా మారగా.. బాష్ జోరు టీమిండియాను భయపెట్టింది. Game, set, match! 💪Prasidh Krishna bags the final wicket as #TeamIndia clinch a thrilling contest in Ranchi to go 1⃣-0⃣ up 🙌Scorecard ▶️ https://t.co/MdXtGgRkPo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/yHpkRnlEVk— BCCI (@BCCI) November 30, 2025 అయితే, ప్రసిద్ కృష్ణ వేసిన తొలి బంతికి పరుగు రాబట్టలేకపోయిన బాష్.. రెండో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పదో వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా పదిహేడు పరుగుల తేడాతో టీమిండియా గట్టెక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా పోరాట పటిమను ప్రశంసిస్తూ.. అదే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆటలో అలసత్వం వద్దని భారత జట్టును హెచ్చరించాడు. ఈ మేరకు..వాళ్ల పోరాటం అద్భుతం‘‘సౌతాఫ్రికా జట్టు పోరాడిన తీరు అద్భుతం. వారి ఆట కనువిందు చేసింది. చివరి ఓవర్ వరకు వాళ్లు పట్టువీడలేదు. ఇలాంటి ఆటను అందరూ ఆరాధిస్తారు. ఓడినా సరే వారిని ప్రశంసించతప్పదు.పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు.. ఇంతలా పుంజుకుని ఆఖరి వరకు గట్టి పోటీనివ్వడం నిజంగా అద్భుతం లాంటిదే. జాగ్రత్త అంటూ వార్నింగ్తదుపరి రెండు మ్యాచ్లలో టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆట తీరుతో సఫారీలు గట్టి హెచ్చరికనే జారీ చేశారు’’ అని గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షో వేదికగా టీమిండియాను హెచ్చరించాడు. కాగా రాంచి వేదికగా ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మ (57), తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) రాణించగా.. విరాట్ కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 135) రాణించాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 17 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ సింగ్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశారు. తదుపరి బుధ, శనివారాల్లో భారత్- సౌతాఫ్రికా మధ్య మిగిలిన రెండు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
'వారిద్దరూ అద్భుతం.. ఆడకపోతే వరల్డ్ కప్ను మరిచిపోవడమే'
రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 135)తో కదం తొక్కగా.. రోహిత్ (51 బంతుల్లోనే 57) తనదైన శైలిలో ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభంలోనే జైశ్వాల్ వికెట్ కోల్పోయిన భారత జట్టుకు వీరిద్దరూ తమ అనుభవంతో భారీ స్కోర్ను అందించారు. రో-కో ద్వయం రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. కాగా ఇప్పటికే టీ20, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లిలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో వన్డే వరల్డ్కప్-2027లో ఈ వెటరన్ క్రికెటర్లు ఆడుతారా? అప్పటివరకు ఫిట్నెస్గా ఉంటారా? లాంటి సందేహలు చాలా మంది మాజీ క్రికెటర్లు వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై విమర్శలు చేస్తున్న వారికి ఈ వెటరన్ జోడీ అద్భుత ఇన్నింగ్స్లతో సమాధానమిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్-కోహ్లి జోడీ లేకుండా 2027 వన్డే ప్రపంచకప్ను గెలవడం అసాధ్యమని అతడు చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు వేరే లెవల్లో ఆడుతున్నారు. వీరిద్దరూ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాల్సిందే. రో-కో లేకుండా మనం వరల్డ్కప్ను గెలవలేం. కాబట్టి ఇకపై ప్రపంచకప్లో వారిద్దరూ ఆడుతారా? ఫిట్నెస్గా ఉంటారా? లాంటి ప్రశ్నలు వేయొద్దు. రోహిత్-కోహ్లిలు 20 ఓవర్లు పాటు కలిసి బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్ధి కథ సమాప్తమైనట్లే. రాంచీలో కూడా అదే జరిగింది. వారిద్దరూ తమ సంచలన బ్యాటింగ్తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడీ చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతూ తమ రిథమ్ కొనసాగించడం అంత సులువు కాదు. వరల్డ్కప్లో కూడా వారు కీలకం కానున్నారు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక తొలి వన్డేలో సౌతాఫ్రికాపై 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కోహ్లి
సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి పాత ‘కింగ్’ను గుర్తుచేశాడు. రాంచి వేదికగా ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి శతక్కొట్టాడు. వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసి.. సింగిల్ ఫార్మాట్లో అత్యధికసార్లు వంద పరుగుల మార్కు అందుకున్న ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు.తన ‘విన్’టేజ్ ఆటతోనే విమర్శకులకు సమాధానం ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. టీమిండియా యాజమాన్యానికి కూడా తన ఫామ్ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో సఫారీలపై విజయానంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు‘‘నేను వందకు 120 శాతం ఫామ్తో తిరిగి వస్తానని ఇప్పటికే చెప్పాను. ఈ మ్యాచ్ కోసం నేను పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను. ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేశాను. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు.నా శరీరానికి కూడా తగినంత విశ్రాంతి, రికవరీ కోసం సమయం కావాలి. ఆట ఎలా ఉండబోతుందో ముందుగానే నా మైండ్లోనే ఓ స్పష్టతకు వచ్చేస్తాను. ఈరోజు మ్యాచ్లో ఇలా ఆడటం అద్భుతంగా అనిపించింది. తొలి 20- 25 ఓవర్ల వరకు పిచ్ బాగానే ఉంది. ఆ తర్వాత వికెట్ కాస్త నెమ్మదించింది.వెళ్లి బంతిని బాదడమే కదా అనుకున్నా. కానీ తర్వాత పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆటను పూర్తిగా ఆస్వాదించాను. చాలా ఏళ్లుగా నేను ఇదే పని చేస్తున్నాను. గత 15-16 ఏళ్లలో 300కు పైగా వన్డేలు ఆడాను.టచ్లో ఉన్నట్లే లెక్కప్రాక్టీస్లో మనం బంతిని హిట్ చేయగలిగామంటే టచ్లో ఉన్నట్లే లెక్క. సుదీర్ఘకాలం పాటు క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయాలంటే శారీరకంగా ఫిట్గా ఉండటం ముఖ్యం. ఆటకు మానసికంగా సిద్ధంగా ఉండటం అత్యంత ముఖ్యం.కేవలం గంటల కొద్ది సాధన చేస్తేనే రాణించగలము అనే మాటను నేను పెద్దగా నమ్మను. ముందుగా చెప్పినట్లు మానసికంగా సిద్ధంగా ఉంటే ఏదైనా సాధ్యమే. నేను ప్రతిరోజూ కఠినశ్రమ చేస్తాను. క్రికెట్ ఆడుతున్నాను కాబట్టే వర్కౌట్ చేయను. జీవితంలో ఇదీ ఒక భాగం కాబట్టే చేస్తాను.అప్పటి వరకు ఆడుతూనే ఉంటానాకు నచ్చినట్లుగా జీవిస్తాను. శారీరకంగా ఫిట్గా ఉండి.. మానసికంగా ఆటను ఆస్వాదించినన్ని రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటాను’’ అని కోహ్లి కుండబద్దలు కొట్టాడు. ఇప్పట్లో తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని సంకేతాలు ఇచ్చాడు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నుంచి వన్డే వరల్డ్కప్-2027 ఆడతామనే హామీ రాలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గతంలో పేర్కొన్నాడు. అయితే, రో-కో వన్డేల్లో వరుసగా సత్తా చాటుతూ తాము ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని చాటి చెబుతున్నారు.తాజాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు చేయగా.. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 51 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా సఫారీలను 17 పరుగులతో ఓడించి.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్! A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 -
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
-
కోహ్లి దూకుడు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
టెస్టు సిరీస్ పరాభవం నుంచి కోలుకున్న టీమిండియా... వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ‘స్టార్స్’ రోహిత్ శర్మ తనలో చేవ తగ్గలేదని నిరూపించగా... కోహ్లి వీరోచిత సెంచరీతో సత్తా చాటాడు. సింగిల్స్, డబుల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ సిక్స్లతో అచ్చమైన వన్డే ఇన్నింగ్స్తో కట్టిపడేశాడు. బంతితో కుల్దీప్, హర్షిత్ రాణించారు. సుదీర్ఘ ఫార్మాట్ గెలుపు ఇచి్చన స్ఫూర్తితో వన్డే సిరీస్లో బరిలోకి దిగిన సఫారీ జట్టు కడదాకా పోరాడినా పరాజయం తప్పలేదు. రాంచీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు... వన్డే సిరీస్లో బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (120 బంతుల్లో 135; 11 ఫోర్లు, 7 సిక్స్లు) వన్డే కెరీర్లో 52వ సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ కేఎల్ రాహుల్ (60; 2 ఫోర్లు, 3 సిక్స్లు), రోహిత్ శర్మ (51 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. బ్రాట్కీ (80 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్), యాన్సెన్ (39 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్స్లు), కార్బిన్ బాష్ (51 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం రాయ్పూర్లో రెండో వన్డే జరగనుంది. సెంచరీ భాగస్వామ్యం...ఇప్పటికే టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... ఆడుతున్న ఒక్క ఫార్మాట్లోనే అదరగొడుతున్నారు. చివరగా ఆ్రస్టేలియాతో ఆడిన వన్డేలో దంచికొట్టిన ఈ జంట ... సిడ్నీలో ఎక్కడ ఆపిందో రాంచీలో అక్కడి నుంచే మోత మోగించింది. ఫామ్, ఫిట్నెస్లో యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మరోసారి చాటింది. నాలుగో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (18; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుట్ కాగా.. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది విరాట్ తన ఉద్దేశాన్ని చాటాడు. సాధారణంగా నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించే కోహ్లి చూడచక్కటి షాట్లతో కట్టిపడేయగా... రోహిత్ కూడా లయ అందుకున్నాడు. దీంతో 10 ఓవర్లలో భారత జట్టు 80/1తో నిలిచింది. సుబ్రాయెన్ బౌలింగ్లో రోహిత్ రెండు వరుస సిక్స్లు బాదితే... కార్బిన్ బాష్ బౌలింగ్లో కోహ్లి చెలరేగిపోయాడు. రోహిత్ తనదైన పుల్ షాట్లతో రెచ్చిపోగా... విరాట్ వన్డేల్లో తన రెండో అత్యధిక సిక్స్ (7)లు ఈ మ్యాచ్లో నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి 48, రోహిత్ 43 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్కు 136 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ అవుట్ కాగా... రుతురాజ్ (8), సుందర్ (13) విఫలమయ్యారు. 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాక జూలు విదిలి్చన విరాట్... సుబ్రాయెన్ వేసిన 39వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాదాడు. మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కోహ్లి అవుటయ్యాడు. ఆఖర్లో జడేజా (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో... రాహుల్ కీలక పరుగులు జోడించాడు. యాన్సెన్ దూకుడు... భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం దక్కలేదు. రికెల్టన్ (0), డికాక్ (0), మార్క్రమ్ (7) పెవిలియన్కు చేరడంతో ఆ జట్టు 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో టోనీ జార్జి (39; 7 ఫోర్లు), బ్రెవిస్ (37; 2 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి బ్రిట్కీ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ ఇద్దరు ఎక్కువసేపు నిలవలేకపోయినా... యాన్సెన్ రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యాన్సెన్... భారీ షాట్లతో టీమిండియాను భయపెట్టాడు. దీంతో సఫారీ జట్టు పోటీలోకి రాగా... కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో ఈ ఇద్దరినీ అవుట్ చేసి జట్టులో ఆనందం నింపాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి బాష్ ఆఖర్లో పోరాడినా... జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.వన్డే ‘సిక్స్’లలో రోహిత్ రికార్డుఈ మ్యాచ్లో మూడు సిక్స్లు బాదిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ... వన్డే క్రికెట్లో అత్యధిక (352) సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెపె్టన్ షాహిద్ అఫ్రిది (351) పేరిట 15 ఏళ్లుగా ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు బాదగా... రోహిత్ 278 మ్యాచ్ల్లోనే అతడిని అధిగమించాడు. గేల్ (301 మ్యాచ్ల్లో 331 సిక్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు.కోహ్లి కాళ్లు తాకాలని... ఈ మ్యాచ్లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి విరాట్ వరకు చేరుకున్న అభిమాని... కోహ్లికి పాదాభివందనం చేశాడు. అంతలో అప్రమత్తమైన సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) డికాక్ (బి) బర్గర్ 18; రోహిత్ (ఎల్బీ) (బి) యాన్సెన్ 57; కోహ్లి (సి) రికెల్టన్ (బి) బర్గర్ 135; రుతురాజ్ (సి) బ్రెవిస్ (బి) బార్ట్మన్ 8;సుందర్ (సి) బాష్ (బి) బార్ట్మన్ 13; రాహుల్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 60; జడేజా (సి) మార్క్రమ్ (బి) బాష్ 32; హర్షిత్ (నాటౌట్) 3; అర్షదీప్ (బి) బాష్ 0; కుల్దీప్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు)349. వికెట్ల పతనం: 1–25, 2–161, 3–183, 4–200, 5–276, 6–341, 7–347, 8–347. బౌలింగ్: యాన్సెన్ 10–0–76–2; బర్గర్ 10–0–65–2; బాష్ 10–0–66–2; బార్ట్మన్ 10–0–60–2; సుబ్రాయెన్ 10–0–73–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) అర్షదీప్ 7; రికెల్టన్ (బి) హర్షిత్ 0; డికాక్ (సి) రాహుల్ (బి) హర్షిత్ 0; బ్రీట్కీ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 72; జోర్జి (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; బ్రెవిస్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 37; యాన్సెన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 70; బాష్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 67; సుబ్రాయెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 17; బర్గర్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 17; బార్ట్మన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 6; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 332. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–11, 4–77, 5–130, 6–227, 7–228, 8–270, 9–312, 10–332. బౌలింగ్: అర్షదీప్ 10–1–64–2; హర్షిత్ రాణా 10–0–65–3; సుందర్ 3–0–18–0; ప్రసిధ్ 7.2–1–48–1; కుల్దీప్ 10–0–68–4; జడేజా 9–0–66–0. -
నరాలు తెగే ఉత్కంఠ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రాంచిలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్కు ఈ గెలుపు సాధ్యమైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో టీమిండియా ముందంజ వేసింది. రాంచిలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్లో టాస్ వేదికగా తొలి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా (IND vs SA) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది. రోహిత్, కోహ్లి, రాహుల్ ధనాధన్ఓపెనర్లలో రీఎంట్రీ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (18) విఫలం కాగా.. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీ (51 బంతుల్లో 57)తో సత్తా చాటాడు. ఇక మరో లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat kohli) భారీ శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) అర్ధ శతకంతో అలరించాడు. మిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆదిలోనే షాకులుసౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఆదిలోనే షాకులు ఇచ్చాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను డకౌట్ చేసిన రాణా.. అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చిన క్వింటన్ డికాక్ను కూడా డకౌట్గా వెనక్కి పంపాడు. అదరగొట్టిన మాథ్యూ, యాన్సెన్మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7)ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో కష్టాల్లో కూరుకుపోయిన ప్రొటిస్ జట్టును మాథ్యూ బ్రీట్జ్కే (72) ఆదుకున్నాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ యాన్సెన్ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే యాన్సెన్ 70 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఫర్వాలేదనిపించారు. భయపెట్టిన బాష్అయితే, సగం ఇన్నింగ్స్లో (25) ఓవర్లలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా సులువుగానే తలవంచుతుందనిపించగా.. టెయిలెండర్లు ప్రెనెలర్ సుబ్రేయన్ (17), నండ్రీ బర్గర్ (17) ఆల్రౌండర్ కార్బిన్ బాష్తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మరోవైపు.. బాష్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి.. 40 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని మ్యాచ్ను ఎగురవేసుకుపోయే ప్రయత్నం చేశాడు. తొమ్మిది వికెట్లు పడినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపాడు. హాఫ్ సెంచరీ తర్వాత రెండు సిక్సర్లు బాది టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 18 పరుగులుగా మారింది. ఈసారి బంతి ప్రసిద్ కృష్ణ చేతికి ఇవ్వగా అతడు అద్భుతం చేశాడు. ప్రసిద్ కృష్ణ, రోహిత్ అద్భుతంఆఖరి ఓవర్లో రెండో బంతిని బాష్ గాల్లోకి లేపగా ఎక్స్ట్రా కవర్లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. 17 పరుగుల తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక కీలక వికెట్ కూల్చి జట్టును విజయతీరాలకు చేర్చారు.చదవండి: కోహ్లి ప్రపంచ రికార్డులు.. 7000వ సెంచరీ -
ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!
‘‘వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్లో ఆడే విషయంపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నుంచి మాకు ఎలాంటి హామీ లభించలేదు’’.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వేళ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన మాట ఇది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను వన్డే జట్టు కొత్త కెప్టెన్గా ప్రకటించిన అగార్కర్.. రో-కోల గురించి ఎదురైన ప్రశ్నకు అగార్కర్ (Ajit Agarkar) పైవిధంగా బదులిచ్చాడు. అయితే, ఆసీస్ టూర్లో ఆరంభంలో కోహ్లి తడబడ్డా.. రోహిత్ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్తో అలరించాడు.రో- కో వన్డే భవితవ్యంపై చర్చమూడో వన్డేలో శతక్కొట్టి భారత్ను గెలిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. మరోవైపు.. ఆఖరిదైన మూడో మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) సైతం భారీ అర్ద శతకంతో సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు ముందు కూడా రో- కో వన్డే భవితవ్యంపై చర్చ జరిగింది.టీమిండియాలో కొనసాగాలంటే దేశీ క్రికెట్ ఆడాలంటూ బోర్డు నుంచి రోహిత్, కోహ్లికి సందేశం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. సఫారీ జట్టుతో సిరీస్ ముగిసిన తర్వాత వీరిద్దరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ సమావేశం కానున్నారనే సమాచారం వచ్చింది.ఇచ్చిపడేశారు భయ్యా!ఇలాంటి తరుణంలో రాంచిలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57)తో దుమ్ములేపగా.. కోహ్లి శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగి తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ తమ అనుభవంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఈ నేపథ్యంలో రో-కో అభిమానులు గంభీర్, అగార్కర్లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజాల కెరీర్ ముగించాలని చూస్తే సహించేది లేదని.. ఒకవేళ మీ పంతం నెగ్గించుకోవాలని చూస్తే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్అంతేకాదు.. రో- కో భవిష్యత్తుపై కాకుండా గంభీర్- అగార్కర్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో 2-0తో వైట్వాష్కు బాధ్యతగా ముందుగా వీరిద్దరిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ సెలబ్రేషన్ సమయంలో రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ మరింత హైలైట్ అయింది. వన్డేల్లో రికార్డు స్థాయిలో 52వ సెంచరీ బాదడం ద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83 శతకాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లి. దీంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025ముఖం మీద కొట్టినట్లుగా ఇంతలో డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ.. ‘‘ఇదిరా మన సత్తా’’ అన్నట్లుగా కాస్త అసభ్య పదజాలంతో సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. గంభీర్- అగార్కర్లకు రో- కో సరైన సమాధానం ఇచ్చారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అంకితభావం లేదన్న వారికి సెంచరీలతో ముఖం మీద కొట్టినట్లుగా కౌంటర్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాంచిలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీRohit Sharma reaction on Virat Kohli century. 😭pic.twitter.com/hmsllR1eYm— Selfless⁴⁵ (@SelflessCricket) November 30, 2025 -
దంచికొట్టిన కోహ్లి, రోహిత్, రాహుల్.. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యం
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రాంచి వేదికగా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్ నమోదు చేసింది.రోహిత్ మెరుపు అర్ధ శతకంస్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచి వేదికగా సౌతాఫ్రికాతో తొలి వన్డే (IND vs SA 1st ODI)లో టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (Rohit Sharma) ధనాధన్ దంచికొట్టాడు. మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు.మరోవైపు.. రోహిత్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హిట్మ్యాన్తో కలిసి రెండో వికెట్కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి రికార్డు సెంచరీఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగులు జోడించిన కోహ్లి.. నండ్రీ బర్గర్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ మ్యాచ్లో మొత్తంగా 120 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం, వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేశాడు. 52nd ODI hundred for the King! 🤩👑Most in a single format in international cricket 🙌🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/DPYCzEZ72J— Star Sports (@StarSportsIndia) November 30, 2025రాణించిన జడేజామిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా.. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్ 349 పరుగులు సాధించి.. సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్ విధించింది.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా వన్డేల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు (349/8). ఇంతకు ముందు 2010లో గ్వాలియర్ వేదికగా టీమిండియా ప్రొటిస్ జట్టుపై మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు (401/3) చేసింది. ఇదిలా ఉంటే.. శుబ్మన్ గిల్ మెడ నొప్పి వల్ల వన్డే సిరీస్కు దూరం కాగా.. కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. 7000వ సెంచరీ గురించి తెలుసా? -
ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా..
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా సెంచరీతో చెలరేగిన కింగ్... యాభై ఓవర్ల ఫార్మాట్లో పలు ప్రపంచ రికార్డులు సృష్టించాడు.సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలురాంచి వేదికగా ప్రొటిస్ జట్టుతో ఆదివారం నాటి మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) 102 బంతుల్లో శతక మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సింగిల్ ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా ఉన్న టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టాడు.ఏకైక బ్యాటర్గాకాగా శతక శతకాల వీరుడు సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా.. కోహ్లి వన్డేల్లో 52వసారి వంద పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్గా చరిత్రకెక్కాడు.అంతేకాదు వన్డేల్లో భారత్లో ఒకే వేదికపై అతి తక్కువ ఇన్నింగ్స్లోనే మూడు శతకాలు బాదిన బ్యాటర్గా కోహ్లి నిలిచాడు. కోహ్లి రాంచిలో ఐదు ఇన్నింగ్స్లో మూడు శతకాలు బాదగా.. సచిన్ వడోదరలో ఏడు ఇన్నింగ్స్లో మూడుసార్లు శతక్కొట్టాడు.అదే విధంగా.. సౌతాఫ్రికాతో వన్డేల్లో అత్యధిక సెంచరీ సాధించిన క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. ప్రొటిస్ జట్టుపై కోహ్లికి ఇది ఆరో శతకం. అంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండుల్కర్, డేవిడ్ వార్నర్ (David Warner) పేరిట ఉండేది. వీరిద్దరు సౌతాఫ్రికాపై చెరో ఐదు శతకాలు బాదారు.అరుదైన నంబర్అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో కోహ్లి తాజాగా సాధించిన 83వ సెంచరీ (టెస్టుల్లో 30, వన్డేల్లో 52, టీ20లలో ఒకటి)కి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం దక్కనుంది. కోహ్లి హండ్రెడ్ బాదడంతో మెన్స్ క్రికెట్లో వ్యక్తిగత శతకాల సంఖ్య 7000కు చేరింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓవరాల్గా 7000వ సెంచరీ కోహ్లి పేరిట లిఖించబడింది. భారత్ స్కోరెంతంటే?కాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి మొత్తంగా 120 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మతో రెండో వికెట్కు 136 పరుగులు జోడించిన కోహ్లి.. కేఎల్ రాహుల్ (60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరితో పాటు రవీంద్ర జడేజా (32) కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?.. ఫ్యాన్స్ ఫైర్ -
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. వన్డే రారాజుకు తిరుగులేదు
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి శతక్కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 83వ సెంచరీని నమోదు చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లికి ఇది 52వ శతకం. ఈ నేపథ్యంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా తన రికార్డును తానే సవరించాడు కోహ్లి.వింటేజ్ కింగ్ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఆసీస్తో మూడో వన్డేలో మాత్రం ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ కోహ్లి ఇదే ఫామ్ను కొనసాగించాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ 102 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో 38వ ఓవర్లో ఐదో బంతికి మార్కో యాన్సెన్ బౌలింగ్లో ఫోర్ బాది కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.రోహిత్తో కలిసి ధనాధన్రాంచి వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి ఇన్నింగ్ నిర్మించాడు.రోహిత్ శర్మ అర్ద శతకం (57)తో సత్తా చాటగా.. అతడితో కోహ్లి రెండో వికెట్కు 109 బంతుల్లో 136 పరుగులు జోడించాడు. రోహిత్ అవుటైన తర్వాత కోహ్లి మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కేఎల్ రాహుల్ కోహ్లికి తోడుగా నిలిచాడు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేరు మార్చిన కోహ్లి జోరు పెంచాడు. ఫలితంగా 41 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.చదవండి: రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్ -
IND vs SA ODIs: షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, జట్లు.. పూర్తి వివరాలు
టెస్టు సిరీస్ తర్వాత భారత్- సౌతాఫ్రికా వన్డేలలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం మూడు మ్యాచ్ల సిరీస్కు తెరలేవనుంది. ఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా వన్డేల్లో ముఖాముఖి 94 మ్యాచ్లలో తలపడ్డాయి.సఫారీలదే పైచేయిఇందులో యాభై ఒక్క మ్యాచ్లు గెలిచి సౌతాఫ్రికా ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. భారత్ కేవలం నలభై గెలిచింది. మూడు మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, ఈసారి సొంతగడ్డపై సిరీస్ జరగడం టీమిండియాకు సానుకూలంగా పరిణమించింది. టెస్టుల్లో 2-0తో వైట్వాష్ పరాభవానికి.. కనీసం వన్డేలలోనైనా గెలిచి బదులు తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.గిల్ లేకుండానే..అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం వల్ల ఈ సిరీస్కు దూరం కావడం వల్ల ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లతో పాటు జట్టులోకి తిరిగి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు సత్తా చాటితే అతడు లేని ప్రభావం పెద్దగా పడకపోవచ్చు.ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తలపడిన టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కోల్కతా వేదికగా ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు.. గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సఫారీల చేతిలో 2-0తో వైట్వాష్కు గురైంది. తద్వారా పాతికేళ్ల తర్వాత మరోసారి సౌతాఫ్రికాతో టెస్టుల్లో టీమిండియా ఈ మేరకు ఘోర ఓటమి రుచిచూసింది. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్షెడ్యూల్👉తొలి వన్డే: నవంబరు 30, ఆదివారం- రాంచి👉రెండో వన్డే: డిసెంబరు 3, బుధవారం- రాయ్పూర్👉మూడో వన్డే: డిసెంబరు 6, శనివారం- విశాఖపట్నంమ్యాచ్ ఆరంభ సమయంభారత కాలమానం ప్రకారం మూడు వన్డేలు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభమవుతాయి.ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీలో ప్రసారాలు.. డిజిటల్ మీడియాలో జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.భారత్తో వన్డే సిరీస్కు సౌతాఫ్రికా జట్టు నండ్రీ బర్గర్, క్వింటన్ డికాక్, తెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మాన్, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్, ఐడెన్ మార్క్రమ్, ప్రెనేలన్ సుబ్రాయేన్.చదవండి: IND vs SA: తుదిజట్టులో అతడు తప్పక ఉంటాడు: కెప్టెన్ కేఎల్ రాహుల్ -
చెప్పినట్లు వింటారా?.. తమ మాటే నెగ్గించుకుంటారా?
సౌతాఫ్రికాతో టెస్టుల్లో వైట్వాష్ తర్వాత వన్డే సిరీస్కు సిద్ధమైంది టీమిండియా. సంప్రదాయ క్రికెట్లో విఫలమైనా.. పరిమిత ఓవర్ల సిరీస్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నవంబరు 30- డిసెంబరు 6 మధ్య ప్రొటిస్ జట్టుతో భారత్ మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా రాంచి వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట్టు మొత్తం ఇప్పటికే మ్యాచ్ జరిగే వేదికకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రో- కో భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. వన్డే వరల్డ్కప్-2027 (ICC World Cup 2027) వరకు ఈ లెజెండరీ బ్యాటర్లు కొనసాగుతారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వాటి ఆధారంగానే నిర్ణయిస్తాంఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. రోహిత్- కోహ్లిల విషయంలో యాజమాన్యం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని తెలిపాయి. జట్టులో వారి పాత్ర, అంచనాలు, ఫామ్ ఆధారంగానే వీరిద్దరు ప్రపంచకప్ టోర్నీ ఆడతారా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.‘‘ఆస్ట్రేలియా పర్యటనలో వాళ్లిద్దరు మూడో వన్డేలో వింటేజ్ ఆటను గుర్తు చేశారు. అయితే, అప్పటికే సిరీస్ మన చేజారిపోయింది. తొలి రెండు మ్యాచ్లలో రో-కో పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్క మ్యాచ్లో ఆడినంత మాత్రాన ప్రతిసారీ వారికి మినహాయింపు లభిస్తుందని అనుకోవద్దు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియతో సదరు వర్గాలు పేర్కొన్నాయి.తిరుగులేని రో-కోవన్డేల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు కోహ్లి, రోహిత్. ముఖ్యంగా ఇప్పటికే వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో అత్యధిక సెంచరీల వీరుడిగా కోహ్లి కొనసాగుతుండగా.. యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఘనుడు రోహిత్ (264 పరుగులు). వీరి ఘనతను చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.ఇక కెప్టెన్గా రోహిత్ శర్మ ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచాడు. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని సారథిగా తప్పించి.. అతడి స్థాయంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చెప్పినట్లు వింటారా?కాగా వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఇంకా 22 నెలల వ్యవధి ఉంది. ఈలోపు టీమిండియా ఆడే వన్డే సిరీస్లలో ప్రదర్శన ఆధారంగానే రో- కో భవితవ్యం తేలనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచకప్ నాటికి రోహిత్ 40, కోహ్లి 38 ఏళ్ల వయసు దాటేస్తారు. కాబట్టి ఫిట్నెస్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, ఇప్పటికే ఫిట్నెస్కు మారుపేరుగా పేరొందిన కోహ్లి.. మరింత ఫిట్గా మారగా.. రోహిత్ ఆసీస్ టూర్కు ముందు ఏకంగా పది కిలోల బరువు తగ్గి స్లిమ్గా మారిపోయాడు. అయితే, ఇప్పటికే వీరిద్దరు అంతర్జాతీయ టీ20లతో పాటు.. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు.ఇలాంటి తరుణంలో ఫిట్నెస్, మ్యాచ్ ప్రాక్టీస్, ఫామ్ కోసం రో- కో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బోర్డు కూడా వీరి నుంచి ఇదే కోరుకుంటోంది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకున్న రో-కో ఇందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’తో వన్డే సిరీస్లో వీరిద్దరు ఆడతారని ముందుగా వార్తలు వచ్చాయి.గంభీర్, అగార్కర్తో చర్చల తర్వాతే..కానీ ఈ అనధికారిక సిరీస్లో రో-కో ఆడలేదు. ఏదేమైనా సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్తో రోహిత్- కోహ్లి భవిష్యత్తుపై ఒక అంచనాకు రావాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరిగే సమావేశంలో హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయం గురించి రో-కోతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో రోహిత్- కోహ్లి వంటి సీనియర్ల అనుభవం యువ జట్టుకు పనికివస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరిని మించి సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు. అలాంటపుడు రో- కోను గనుక కావాలని తప్పిస్తే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు!!చదవండి: India vs South Africa: టికెట్లు సోల్డ్ అవుట్ -
కోహ్లితో ఉన్నదెవరో కనిపెట్టారా?
రాంచీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురువారం జార్ఖండ్లో ల్యాండ్ అయ్యాడు. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో అతడికి స్పెషల్ వెల్కం లభించింది. ఒకప్పుడు కోహ్లితో కలిసి క్రికెట్ ఆడిన మాజీ క్రికెటర్ సౌరభ్ తివారీ అతడికి దగ్గరుండి మరీ స్వాగతం పలికాడు. చాలా కాలం తర్వాత కోహ్లితో కలిసి సౌరభ్ తివారీ కెమెరాకు చిక్కడంతో వారిద్దరి జ్ఞాపకాలను క్రికెట్ లవర్స్ గుర్తు చేసుకుంటున్నారు. తొలి నాళ్ల నాటి అనుభవాలను నెమరువేసుకుంటున్నారు.జూనియర్ ధోనిగా ముద్ర పడిన 35 ఏళ్ల సౌరభ్ తివారీ (Saurabh Tiwary).. చాలా సంవత్సరాలు జార్ఖండ్కు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో కోహ్లి నాయకత్వంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అయిన తివారీ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. టీమిండియా తరపున కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. 2010, అక్టోబర్ 20న విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో వన్డేల్లో అరంగ్రేటం చేశాడు.ఆర్సీబీలోనూ కోహ్లితో కలిసి..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ నాలుగు జట్లకు ప్రాతినిథ్యం వహించిన తివారీ 93 మ్యాచ్లు ఆడాడు. 2008 నుంచి 2010 ముంబై ఇండియన్స్తో ఉన్నాడు. 2011 నుండి 2013 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జట్టులో మళ్లీ విరాట్ కోహ్లితో కలిసి ఆడాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా తన శక్తివంతమైన స్ట్రోక్ ఆటతో జూనియర్ ధోనిగా గుర్తింపు పొందాడు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అడ్మినిస్ట్రేషన్లోకి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JKCA) కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ హోదాలోనే ఇప్పుడు విరాట్ కోహ్లికి హృదయపూర్వ స్వాగతం పలికాడు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలవడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపింది. మాజీ సహచరులు తిరిగి కలిసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసి నెటిజనులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. "నీలం రంగు సూట్లో ఉన్న వ్యక్తి కోహ్లి అండర్-19 సహచరుడు అని ఎవరికీ తెలియదు" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. "విమానాశ్రయంలో సౌరభ్ తివారీ!" అని మరొకరు పేర్కొన్నారు. "సౌరభ్ తివారీ.. కరణ్ ఔజ్లా లాగా కనిపిస్తున్నాడు!" అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.చదవండి: పలాష్ ముచ్చల్ చాట్లను బయటపెట్టింది నేనే..కాగా, నవంబర్ 30 నుంచి భారత్- దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి. రెండు టెస్టుల సిరీస్ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో వన్డే సిరీస్ అయినా గెలవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by NDTV (@ndtv) -
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్
స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్స్వీప్నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 3-0తో వైట్వాష్ అయింది. తాజాగా కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్వాష్ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
ఆల్టైమ్ టీ20 జట్టు.. రోహిత్, కోహ్లికి దక్కని చోటు! కెప్టెన్ ఎవరంటే..
ఐపీఎల్-2026 వేలానికి ముందు భారత ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)కు భారీ షాక్ తగిలింది. గతేడాది కోట్లు కుమ్మరించి అతడిని కొనుక్కున్న కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఈసారి మాత్రం ఆక్షన్లోకి విడిచిపెట్టేసింది. అన్నీ కుదిరితే కేకేఆర్ వెంకటేశ్ను మళ్లీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ 2025లో అతడి ప్రదర్శన దృష్ట్యా ఇది సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తోంది.ఏకంగా రూ. 23.75 కోట్లుకాగా మధ్యప్రదేశ్కు చెందిన వెంకటేశ్ అయ్యర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. రూ. 20 లక్షలకు 2021లో కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. అదే ఏడాది వెంకటేశ్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. పది మ్యాచ్లలో కలిపి 370 పరుగులతో సత్తా చాటిన ఈ ఆల్రౌండర్ను 2022లో ఏకంగా రూ. 8 కోట్లకు కేకేఆర్ రిటైన్ చేసుకుంది.ఇక గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో వెంకీ తన వంతు పాత్ర పోషించాడు. 15 మ్యాచ్లలో కలిపి 370 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్.. ఫైనల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో వెంకటేశ్ వేలంలోకి వెళ్లినా కేకేఆర్ అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ ఈసారి అతడు పూర్తిగా విఫలమయ్యాడు.ఆల్టైమ్ టీ20 ఎలెవన్ఐపీఎల్-2025లో పదకొండు మ్యాచ్లు ఆడి కేవలం 142 పరుగులే చేశాడు. దీంతో కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ను వేలంలోకి విడిచిపెట్టింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 16న అబుదాబి వేదికగా వేలంపాట జరుగనున్న నేపథ్యంలో క్రిక్ట్రాకర్కు వెంకీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఆల్టైమ్ టీ20 ఎలెవన్ను వెంకటేశ్ అయ్యర్ ప్రకటించాడు.రోహిత్, కోహ్లికి దక్కని చోటుఅయితే, వెంకీ ఎంచుకున్న టీ20 ఆల్టైమ్ జట్టులో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ఐపీఎల్లో.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రో-కోకు వెంకటేశ్ అయ్యర్ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం.ఓపెనర్లుగా వీరూ, అభిషేక్ఇక తన జట్టులో ఓపెనర్లుగా భారత విధ్వంసకర బ్యాటర్లు వీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మను ఎంచుకున్న వెంకీ.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ను వన్డౌన్లో ఆడిస్తానని తెలిపాడు. మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనాను ఎంపిక చేసుకున్న అతడు.. తన జట్టులో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుకు చోటిచ్చాడు.ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్తో పాటు టీమిండియా మేటి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు వెంకీ ఈ మేరకు తన జట్టులో స్థానం కల్పించాడు. ఇక ఏడో స్థానానికి, వికెట్ కీపర్ బ్యాటర్గా.. కెప్టెన్గా టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్నాడు.బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ దిగ్గజం సునిల్ నరైన్లకు చోటు ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్.. పేస్ దళంలో భారత మేటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగలను ఎంచుకున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్కు వెంకీ స్థానమిచ్చాడు.వెంకటేశ్ అయ్యర్ ఆల్టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్ ఇదేవీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మ, ఏబీ డివిలియర్స్, సురేశ్ రైనా, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునిల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్: మాథ్యూ హెడెన్. -
IPL 2026: రిటెన్షన్ జాబితా విడుదల చేసిన ఫ్రాంఛైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేశాయి. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన చేశాయి.గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ జాబితా ఇదే (Gujarat Titans Retention List)శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), అనూజ్ రావత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.సన్రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ జాబితా (SRH Retention List)ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.ఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు (DC Retention List)అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్.కోల్కతా నైట్ రైడర్స్ రిటెన్షన్ జాబితా (KKR Retention List)అజింక్య రహానే, రోవ్మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (LSG Retention List)అబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్. ఆకాశ్ సింగ్, మణిమరన్ సిద్దార్థ్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండుల్కర్ (ముంబై నుంచి ట్రేడింగ్), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్ పంత్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహమమ్మద్ షమీ (సన్రైజర్స్ నుంచి ట్రేడింగ్), ఆయుశ్ బదోని, మిచెల్ మార్ష్.ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా (MI Retention List)అల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్బవా, తిలక్ వర్మ, హార్దిక్పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్.పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ లిస్టు (PBKS Retention List)అర్ష్దీప్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముషీర్ ఖాన్. సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ పన్నూ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, వైశాక్ విజయ్కుమార్, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్ ఆర్య, జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, పైలా అవినాశ్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, యజువేంద్ర చహల్.రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే (RR Retention List)ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, డొనొవాన్ ఫెరీరా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్), యుధ్వీర్ చరక్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్ హెట్మెయిర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, శుభమ్ దూబే, నండ్రీ బర్గర్, తుషార్ దేశ్పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), వైభవ్ సూర్యవంశీ.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకున్న ప్లేయర్ల జాబితా (RCB Retention List)అభినందన్ సింగ్, నువాన్ తుషార, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, యశ్ దయాళ్, జేకబ్ బెతెల్, రసిఖ్ ధార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్, సూయాంశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్. -
బాబర్ ఆజమ్ను వెనక్కు నెట్టిన విరాట్ కోహ్లి
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) టీమిండియా బ్యాటర్ల హవా కొనసాగింది. తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ను (Babar Azam) వెనక్కు నెట్టి టాప్-5లోకి చేరాడు.గత వారం ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉండిన విరాట్ ఓ స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకాడు. సౌతాఫ్రికా సిరీస్లో ఘెరంగా విఫలమైన బాబర్ రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. టాప్-10 మరో టీమిండియా స్టార్ ఆటగాడు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ సిరీస్లో ఓ హాఫ్ సెంచరీతో రాణించిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో స్థానాన్ని కాపాడుకున్నాడు.తాజాగా ర్యాంకింగ్స్లో ఇద్దరు పాక్ ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. సౌతాఫ్రికా సిరీస్లో రాణించినందుకు యువ ఆల్రౌండర్ సైమ్ అయూబ్ ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకొని 36వ స్థానానికి ఎగబాకాడు. అదే సౌతాఫ్రికా సిరీస్లో పర్వాలేదనిపించి, నిన్న శ్రీలంకతో జరిగిన వన్డేలో శతక్కొట్టిన పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా 14 స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు.పాక్తో సిరీస్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ప్లేస్కు చేరాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో కుల్దీప్ యాదవ్ (6) ఒక్కడే ఉన్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ టాప్ ప్లేస్ను కాపాడుకోగా.. భారత ఆటగాడు అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.చదవండి: IPL 2026: ఆర్సీబీ అభిమానులకు చేదు వార్త -
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma).. ఇప్పుడు స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు సిద్దమవుతున్నాడు. రోహిత్ ప్రస్తుతం ముంబైలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2027 ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో సిరీస్లో కూడా తన సత్తా చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో ఆడాలని రోహిత్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో కూడా రోహిత్ ఆడనున్నాడంట. ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి రోహిత్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా 50 ఓవర్ల ప్రపంచకప్కు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో రోహిత్, విరాట్ కోహ్లిల ఎంపికపై బీసీసీఐ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వన్డే జట్టుకు వారిద్దరూ ఎంపిక కావాలంటే తప్పనిసరిగా దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ విజయ్ హాజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం విజయ్ హాజారే ట్రోఫీ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు. కోహ్లి ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. ఈ నెలఖారున సౌతాఫ్రికాతో సిరీస్ కోసం స్వదేశానికి రానున్నాడు.ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్-కోహ్లిలు ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ లెజెండరీ క్రికెటర్లు ఇద్దరూ వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లలో భారత్కు ప్రాతినిథ్యం వహించనున్నారు.ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్ వరకు భారత్కు వన్డే సిరీస్లు లేవు. దీంతో రో-కో తమ ఫిట్నెస్ను కోల్పోకుండా ఉండడానికి దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ సూచించింది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హాజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నీలో ముంబై తరపున రెండు మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 50 పరుగులు చేశాడు.రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నీలో ముంబై తరపున రెండు మ్యాచ్లు ఆడిన హిట్మ్యాన్ 50 పరుగులు చేశాడు. కోహ్లి అయితే ఆఖరిగా 2010లో ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఢిల్లీ తరపున ఆడాడు.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే -
విరాట్ కోహ్లి రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ (నవంబర్ 11) శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో బాబర్ 29 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత బాబర్ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ సెంచరీ చేసి నేటికి 799 రోజులవుతుంది. ఇన్నింగ్స్ల పరంగా (3 ఫార్మాట్లలో) ఇది 83కు పెరిగింది. దీంతో బాబర్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును సమం చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కూడా ఓ దశలో సెంచరీ లేక 83 ఇన్నింగ్స్లు ఆడాడు. విరాట్ కెరీర్లో మాయని మచ్చగా ఉన్న ఈ అప్రతిష్టను తాజాగా బాబర్ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండా ఎక్కువ ఇన్నింగ్స్లు ఆడిన చెత్త రికార్డు శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉంది.జయసూర్య తన కెరీర్లో ఓ దశలో సెంచరీ లేకుండా 88 ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ రెండో స్థానంలో ఉన్నారు. విండీస్ దిగ్గజం శివ్నరైన్ చంద్రపాల్ (78) మూడో స్థానంలో నిలిచాడు.2023 ఆగస్ట్ నుంచి ఇదే తంతుమూడు, నాలుగేళ్ల కిందట ప్రపంచ క్రికెట్లో అత్యంత స్థిరమైన బ్యాటర్గా గుర్తింపు పొందిన బాబర్ ఆజమ్.. 2023 నుంచి పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఆ ఏడాది ఆగస్ట్లో నేపాల్పై సెంచరీ చేసిన తర్వాత అతనిప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇటీవలికాలంలో బాబర్ ఫామ్ అదఃపాతాళానికి పడిపోయింది. ఫామ్లేమి కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు.ఇదిలా ఉంటే, బాబర్ విఫలమైనా శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో పాక్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసేలా ఉంది. 47.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 261/5గా ఉంది. సల్మాన్ అఘా (95) సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతనికి జతగా మహ్మద్ నవాజ్ (10) క్రీజ్లో ఉన్నాడు. చదవండి: మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ -
ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!
ఐపీఎల్-2026 వేలం (IPL 2026 Auction) నేపథ్యంలో పది ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకోవాల్సిన, వదిలివేయాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. నవంబరు 15 నాటికి లిస్టును ఖరారు చేయాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంఛైజీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ తమ జట్టును కొనసాగించాలని సూచించాడు. అంతగా అవసరం అయితే.. ఓ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే విడిచిపెట్టాలని అభిప్రాయపడ్డాడు.కాగా పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్గా అవతరించింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో విజయోత్సవం సందర్భంగా తొక్కిసిలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.అమ్మకానికి ఆర్సీబీఇదిలా ఉంటే.. ఆర్సీబీ ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది. డియాజియో తాము ఆర్సీబీని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో జట్టుకు కొత్త యజమానులు రావడం ఖాయం కాగా.. రిటెన్షన్ లిస్టుపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ ఆరంభం నుంచి.. అంటే 2008 నుంచి భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఒక్కడే జట్టుతో ఉన్న విషయం తెలిసిందే.ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ ఈసారి ఇద్దరిని మాత్రమే విడుదల చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం జట్టు కూర్పు బాగుంది. అలాంటపుడు మార్పులు చేయడం సరికాదనే చెప్పాలి.లియామ్ లివింగ్స్టోన్, రసిఖ్ దర్ సలామ్లను విడుదల చేసినా పెద్దగా నష్టం లేదు. అంతకు మించి మార్పులు వద్దు. మిగిలిన అందరినీ అట్టిపెట్టుకోవాలి. నిజానికి లివింగ్స్టోన్ ఖరీదైన ఆటగాడు. ఈ సీజన్లో అంత గొప్పగా కూడా ఆడలేదు.రజత్ పాటిదార్, విరాట్ కోహ్లి తర్వాత జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ వస్తారు. కాబట్టి మిడిలార్డర్లో లివింగ్స్టోన్ను తీసేసి.. ఇంకా మెరుగ్గా ఆడగలిగే బ్యాటర్ను కొనుగోలు చేస్తే సరిపోతుంది.అతడికి అంత మొత్తం ఎక్కువేపేస్ విభాగంలో యశ్ దయాళ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రొమారియో షెఫర్డ్, నువాన్ తుషార ఉన్నారు. వీరికి తోడుగా భారత ఫాస్ట్ బౌలర్ను తెచ్చుకుంటే సరి. రసిఖ్కు అంత మొత్తం ఎక్కువే. కాబట్టి అతడిని వదిలేసి మరొకరిని తీసుకుంటే మరో ప్లేయర్ కోసం డబ్బు కూడా మిగులుతుంది’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా లివింగ్స్టోన్ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ.. రసిఖ్ కోసం ఏకంగా రూ. 6 కోట్లు వెచ్చించింది. లివింగ్స్టోన్ ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 112 పరుగులు చేయగా.. రసిఖ్ రెండు మ్యాచ్లలో కలిపి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం! -
అలాంటి పని అస్సలు చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్
టీమిండియా హెడ్కోచ్, భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. దీనికి తోడు దూకుడు స్వభావం కారణంగా ఎన్నోసార్లు విమర్శలు మూటగట్టుకున్నాడు గౌతీ. అయినా.. కూడా తగ్గేదేలే అంటూ అలాగే ముందుకు సాగుతున్నాడు. అతడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.ఇటీవల గౌతీ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో వన్డే సిరీస్ను టీమిండియా 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు ముందు వన్డే కెప్టెన్గా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న యాజమాన్యం.. టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది.చేదు అనుభవం ఇక వన్డే కెప్టెన్గా ఆసీస్ రూపంలో తొలి ప్రయత్నంలోనే కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్.. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా చేదు అనుభవం చవిచూశాడు. తొలి రెండు వన్డేల్లో ఓడి భారత్ ముందుగానే సిరీస్ కోల్పోగా.. ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం గెలిచి క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది.‘రో-కో’దే కీలక పాత్రఈ విజయంలో రీఎంట్రీ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిదే కీలక పాత్ర. రోహిత్ అజేయ శతకం (121)తో దుమ్ములేపగా.. కోహ్లి 74 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా ఆసీస్ విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఓటమి పట్ల గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. సిరీస్ ఓడిపోవడం ఎంతమాత్రం ఉపేక్షించదగింది కాదని.. తాను అందుకే మూడో వన్డే గెలుపు సెలబ్రేట్ చేసుకోలేదంటూ కుండబద్దలు కొట్టాడు.వాటిని పట్టించుకోను‘‘వ్యక్తిగత ప్రదర్శనలను నేనెప్పుడూ పట్టించుకోను. అయితే, వారి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాను. ఏదేమైనా అంతిమంగా మనం సిరీస్ ఓడిపోయాం.అన్నింటికంటే అదే అతి ముఖ్యమైన విషయం. కోచ్గా నేను ఇలాంటి వాటిని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోను. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగత ప్రదర్శనలను అభినందిస్తా. కానీ కోచ్గా ఇలాంటివి జీర్ణించుకోలేను.కోచ్గా అలాంటి పని ఎప్పటికీ చేయనుదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు ఆటగాళ్లైనా, కోచ్ అయినా ఇలాంటి ఘోర ఓటమి తర్వాత వచ్చిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు కూడా!.. ఏదేమైనా మేము ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ గెలిచాం. ఇదొక భిన్నమైన ఫార్మాట్. అయితే, ఈ సిరీస్లో సానుకూల అంశాలతో పాటు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా ఉన్నాయి’’ అని గంభీర్ తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.కాగా ఆసీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. మొదటి. ఆఖరి మ్యాచ్లు వర్షం వల్ల రద్దు అయ్యాయి. అయితే, రెండో టీ20లో ఓడిన సూర్యకుమార్ సేన వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు -
వన్డే ఆల్టైమ్ జట్టు.. రోహిత్కు దక్కని చోటు
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ హషీం ఆమ్లా (Hashim Amla) వన్డేల్లో తన ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి స్థానం కల్పించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను మాత్రం విస్మరించాడు.అంతర్జాతీయ కెరీర్లో సౌతాఫ్రికా తరఫున 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ20 మ్యాచ్లు ఆడిన హషీం ఆమ్లా.. టెస్టుల్లో 9282, వన్డేల్లో 8113, టీ20లలో 1277 పరుగులు సాధించాడు. ఇక 2023 జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు ఆమ్లా. తాజాగా శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో పాల్గొన్న ఈ దిగ్గజ బ్యాటర్.. తన ఆల్టైమ్ వన్డే జట్టును ఎంచుకున్నాడు.ఓపెనర్లుగా వారేఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా లెజెండ్ సచిన్ టెండుల్కర్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్లను ఆమ్లా ఎంపిక చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో భారత మరో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)కి స్థానమిచ్చాడు. వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో ప్రపంచ రికార్డు సాధించినందుకు తాను కోహ్లికి ఓటు వేస్తున్నట్లు ఆమ్లా ఈ సందర్భంగా తెలిపాడు.ఏడో స్థానంలో ధోనిఇక నాలుగు, ఐదు స్థానాలకు వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ను ఆమ్లా ఎంపిక చేశాడు. ఆరో స్థానంలో దీర్ఘకాలం తనకు సహచర క్రికెటర్గా ఉన్న జాక్వెస్ కలిస్కు చోటిచ్చిన ఆమ్లా... ఏడో స్థానానికి భారత దిగ్గజ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిన మహేంద్ర సింగ్ ధోనిని ఎంచుకున్నాడు.బౌలర్లుగా వీరికే ఛాన్స్బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు ఆమ్లా చోటిచ్చాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్కు తన జట్టులో స్థానం కల్పించిన ఆమ్లా.. పేసర్ల కోటాలో పాకిస్తాన్ ఫాస్ట్బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం, సౌతాఫ్రికా డైనమైట్ బౌలర్ డేల్ స్టెయిన్లకు చోటిచ్చాడు.దిగ్గజ బ్యాటర్ అయితే, టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు మాత్రం ఆమ్లా తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం. వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఘనత రోహిత్ది. అంతేకాదు యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) కూడా అతడిదే.అంతేకాదు.. కెప్టెన్గా టీమిండియాను వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే) కూడా గెలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో పర్యటనలో భాగంగా సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో శతక్కొట్టిన హిట్మ్యాన్.. ఐసీసీ వన్డే వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు. అదే విధంగా.. అతడి ఖాతాలో 33వ వన్డే శతకాన్ని జమ చేసుకున్నాడు.హషీం ఆమ్లా ఎంచుకున్న ఆల్టైమ్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్సచిన్ టెండుల్కర్, ఆడం గిల్క్రిస్ట్, విరాట్ కోహ్లి, బ్రియాన్ లారా, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్, ఎంఎస్ ధోని, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రం, డేల్ స్టెయిన్.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
పెళ్లైన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడు.. అప్పుడు అన్నా అంటే..
టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లైన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడని తెలిపాడు. ఇక తండ్రిగా ప్రమోషన్ పొందిన తర్వాత విరాట్ తన దూకుడు స్వభావానికి విరుద్ధంగా పూర్తిగా నెమ్మదస్తుడైపోయాడని వెల్లడించాడు.పెళ్లైన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడుయూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో కైఫ్నకు కోహ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. విరాట్ కోహ్లి మారిపోయాడు. ఇప్పుడు కాస్త నెమ్మదస్తుడు అయ్యాడు. అతడు ఒక తండ్రి.పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత కోహ్లిలో చాలా మార్పు వచ్చింది. ఐపీఎల్లో ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇటీవల అతడిని కలిశాను. ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం.కగిసో రబడ బౌలింగ్లో ఆరోజు కోహ్లి ఫోర్ బాదాడు. ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. నిజంగా కోహ్లి చాలా కామ్గా ఉన్నాడు. ఒకవేళ తాను ముందుగానే రబడపై బ్యాట్తో విరుచుకుపడకపోతే.. అతడు తనను పరుగులు రాబట్టనివ్వడని చెప్పాడు.అందుకే తొలి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టానని అన్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ఇలాగే ఆడుతున్నాడు. కోహ్లి అద్భుతమైన క్రికెటర్. రోజురోజుకీ తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడు. హడావుడి లేకుండా నెమ్మదిగా తన పని తాను చేసుకుపోతున్నాడు.అప్పుడు అన్నా అంటే..ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం, రికార్డుల తర్వాత కూడా తను నాతో వ్యవహరించే విధానంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అపుడు నన్ను అన్నా అని పిలిస్తే.. ఇప్పుడు కూడా అలాగే పిలుస్తున్నాడు. తనతో కలిసి ఆడిన వాళ్లకు తగిన గౌరవం ఇస్తాడు. ఎంత ఎదిగినా ఇతరులతో వ్యవహరించే తీరులో మాత్రం అతడు మారలేదు. అయితే, మునుపటి కంటే కాస్త నెమ్మదస్తుడు అయ్యాడని చెప్తాను’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.ముచ్చటైన కుటుంబంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017, డిసెంబరు 11న ఆమెను పెళ్లాడాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. గోప్యత దృష్ట్యా ఇంతవరకు తమ పిల్లల ముఖాలను విరుష్క జోడీ బయటి ప్రపంచానికి చూపించనేలేదు. వీరు ప్రస్తుతం లండన్లోనే ఎక్కువగా నివాసం ఉంటున్నారు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయిన కింగ్.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) బాది ఫామ్లోకి వచ్చాడు. తదుపరి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్తో కోహ్లి రీఎంట్రీ ఇస్తాడు.చదవండి: ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?.. అప్పుడేమో బొద్దుగా.. ఇప్పుడు ఇలా.. -
ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి..
క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు, ఛేజింగ్ మాస్టర్, ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇవాళ (నవంబర్ 5, 2025) కింగ్ కోహ్లి 37వ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ క్రీడా సమాజం అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది.ఇటీవలే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్ ఆడాలన్నది అతడి కొరిక. అంతవరకు విరాట్ మునుపటి మెరుపులు మెరిస్తూ, మరెన్నో రికార్డులను బద్దలు కొడుతూ అప్రతిహతంగా కెరీర్ను కొనసాగించాలని ఆశిద్దాం.కోహ్లి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆడాడు. ఇందులో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైనా, మూడో మ్యాచ్లో తిరిగి పుంజుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను విజయాన్నందించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో రోహిత్ సెంచరీ (121 నాటౌట్) చేయగా.. కోహ్లి (74 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.విరాట్ త్వరలో మరోసారి దర్శనమివ్వబోతున్నాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. 2027 ప్రపంచకప్ వరకు కోహ్లి ఫిట్నెస్ను, ఫామ్ను కాపాడుకుంటూ టీమిండియాను గెలిపిస్తూ ఉండాలని భారత క్రికెట్ అభిమానులంతా కోరుకుంటున్నారు. అతడి జన్మదినం సందర్భంగా ప్రతి భారత క్రికెట్ అభిమాని అకాంక్ష ఇదే.ఢిల్లీ వీధుల్లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, క్రీడలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కోహ్లి.. ఫామ్ను కాపాడుకోగలిగితే సునాయాసంగా మరో రెండు, మూడేళ్లు దేశానికి సేవలందించగలడు. ఫిట్నెస్ విషయంలో అతడికి ఎలాంటి సమస్యలు లేవు. ఉండవు. సాధారణంగా 35 ఏళ్ల వయసొచ్చే సరికే క్రికెటర్లు ఫిట్నెస్ను కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటుంటారు.అయితే కోహ్లి మాత్రం అలా కాదు. 25 ఏళ్ల కుర్రాళ్లు కూడా పోటీ పడలేని విధంగా ఫిట్నెస్ను మెయిన్టెయిన్ చేస్తున్నాడు. తాజాగా ఆసీస్తో జరిగిన సిరీస్లో కోహ్లిని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది.కెరీర్ను నిదానంగా ప్రారంభించిన కోహ్లి.. అందరిలాగే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటివరకు పొగిడిన నోళ్లే అతన్ని దూషించాయి. బ్యాడ్ టైమ్ను అధిగమించిన కోహ్లి తిరిగి నిలబడ్డాడు. దూషించిన నోళ్లకు బ్యాట్తో సమాధానం చెప్పాడు.ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ కోహ్లి కెరీర్ విజయవంతంగా సాగింది. టెస్ట్ల్లో భారత అత్యుత్తమ కెప్టెన్ కోహ్లినే అని చెప్పవచ్చు. అతడి హయాంలో భారత్ అత్యున్నత శిఖరాలు అధిరోహించింది. కోహ్లి జట్టు ఆటతీరునే మార్చేశాడు. ఆటగాళ్లకు దూకుడు నేర్పాడు. ఫిట్నెస్ మెరుగుపర్చుకునే విషయంలో అందరికీ దిక్సూచిగా నిలిచాడు. కోహ్లి జమానాలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. చాలాకాలం పాటు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా కొనసాగింది.కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఇప్పటికే భారత క్రికెట్కు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. అయినా కోహ్లిలో కసి తీరడం లేదు. భారత జట్టుకు ఇంకా ఏదో చేయాలనే తపన ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచి కెరీర్కు ముగింపు పలకాలన్నది కోహ్లి కోరిక. ఈ కోరిక నెరవేరాలని, కోహ్లి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. కోహ్లి సాధించిన ఘనతలు..అండర్-19 వరల్డ్కప్ (2008)వన్డే వరల్డ్కప్ (2011)టీ20 వరల్డ్కప్ (2024)ఛాంపియన్స్ ట్రోఫీ (2013, 2025)ఐపీఎల్ (2025)ఆసియా కప్-3టెస్ట్ మేస్-5ఐసీసీ అవార్డ్స్-10చదవండి: డ్రగ్స్కు బానిస.. స్టార్ క్రికెటర్పై శాశ్వత నిషేధం -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం (Babar Azam) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20 (PAK vs SA 3rd T20I)లో ఈ వన్డౌన్ బ్యాటర్ అదరగొట్టాడు. ధనాధన్ దంచికొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలోనే బాబర్ ఆజం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మరో ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో వైఫల్యం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన బాబర్కు.. ఆ తర్వాత జట్టులోనూ స్థానం కరువైంది. అయితే, ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు పునరాగమనం చేశాడు.కానీ రీఎంట్రీలో.. అంటే ప్రొటిస్తో తొలి మ్యాచ్లో బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అయితే, రెండో టీ20లో 11 పరుగులతో అజేయంగా నిలిచి ఫర్వాలేదనిపించిన అతడు.. మూడో టీ20లో మాత్రం మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.139 పరుగులకు కట్టడిలాహోర్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. సౌతాఫ్రికాను 139 పరుగులకు కట్టడి చేసింది. షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు తీయగా.. ఫాహిమ్ ఆష్రఫ్ , ఉస్మాన్ తారిక్ రెండేసి వికెట్లు, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రొటిస్ బ్యాటర్లలో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 34 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. కార్బిన్ బాష్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (19), సయీమ్ ఆయుబ్ (0) దారుణంగా విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన బాబర్ బాధ్యత తీసుకున్నాడు.బాబర్కు తోడుగా కెప్టెన్ సల్మాన్ ఆఘా (26 బంతుల్లో 33) రాణించగా.. హసన్ నవాజ్ (5), నవాజ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇక బాబర్ మొత్తంగా 47 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. ఆఖర్లో ఉస్మాన్ ఖాన్ 6, ఫాహిమ్ ఆష్రఫ్ 4 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. కోహ్లి ప్రపంచ రికార్డు బద్దలుఇక మూడో టీ20లో విజయంతో పాకిస్తాన్ సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తన ఫిఫ్లీ ప్లస్ స్కోర్ల సంఖ్యను నలభైకి పెంచుకున్నాడు.తద్వారా ఇప్పటిదాకా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా 11 పరుగులు చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను అధిగమించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్లు🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 40 (3 శతకాలు, 37 ఫిఫ్టీలు)🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 39 (ఒక శతకం, 39 ఫిఫ్టీలు)🏏రోహిత్ శర్మ (ఇండియా)- 37 (5 శతకాలు, 32 ఫిఫ్టీలు)🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 31 (ఒక శతకం, 30 ఫిఫ్టీలు)🏏డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 29 (ఒక శతకం, 28 ఫిఫ్టీలు).చదవండి: IND vs SA: వన్డే తరహా బ్యాటింగ్!.. పాపం పంత్.. భారత్కు షాక్ -
రోహిత్ శర్మ ఆల్టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్
సౌతాఫ్రికాతో రెండో టీ20లో పాకిస్తాన్ (PAK vs SA 2nd T20) ఘన విజయం సాధించింది. లాహోర్ వేదికగా సఫారీ జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది.ప్రపంచ రికార్డు బద్దలుఈ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (Babar Azam) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో హయ్యస్ట్ రన్ స్కోరర్గా బాబర్ నిలిచాడు.బాబర్ డకౌట్వరుస వైఫల్యాల నేపథ్యంలో పాక్ కెప్టెన్సీ కోల్పోయిన బాబర్ ఆజం.. చాన్నాళ్ల పాటు టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఎట్టకేలకు స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా సెలక్టర్లు అతడిని కరుణించారు. అయితే, రావల్పిండి వేదికగా సఫారీలతో తొలి టీ20లో బాబర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు.ఇందుకు తోడు ఈ మ్యాచ్లో పాక్ 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో బాబర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే, తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.110 పరుగులకు ఆలౌట్లాహోర్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాను 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు టాపార్డర్ పాక్ బౌలర్ల ధాటికి కుదేలైంది.రీజా హెండ్రిక్స్ డకౌట్ కాగా.. క్వింటన్ డికాక్ (7), టోనీ డి జోర్జి (7) పూర్తిగా విఫలమయ్యారు. యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ 25 పరుగులతో ప్రొటిస్ ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. మిగిలిన వారిలో కెప్టెన్ డొనోవాన్ ఫెరీరా (15), కార్బిన్ బాష్ (11), ఒట్నీల్ బార్ట్మన్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో ఫాహీమ్ ఆష్రఫ్ నాలుగు వికెట్లు తీయగా.. సల్మాన్ మీర్జా మూడు, నసీం షా రెండు, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకంఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (28) ఓ మోస్తరుగా రాణించగా.. సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకం (38 బంతుల్లో 71) సాధించాడు. అతడికి తోడుగా బాబర్ ఆజం 18 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే బాబర్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా రోహిత్ శర్మను అధిగమించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరులు (టాప్-5)🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 130* మ్యాచ్లలో 4234 పరుగులు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్లలో 4231 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 125 మ్యాచ్లలో 4188 పరుగులు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్లలో 3869 పరుగులు🏏పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 153 మ్యాచ్లలో 3710 పరుగులు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
IND vs SA: కోహ్లిని అవమానించిన రిషభ్ పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్
టెస్టు క్రికెట్లో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. సంప్రదాయ ఫార్మాట్లో కెప్టెన్గా భారత్ను అగ్రస్థానంలో నిలిపిన కోహ్లి.. మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో జట్టును ఫైనల్కు చేర్చాడు.ఇక టీమిండియా తరఫున మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 9230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు కూడా ఉన్నాయి. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ముందు తనకు ఇష్టమైన టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లి.భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం బెంగళూరు వేదికగా తొలి టెస్టు మొదలైంది.కోహ్లిని అవమానించిన పంత్?!.. ఫ్యాన్స్ ఫైర్ఈ మ్యాచ్లో పంత్ ‘18’ నంబర్ ఉన్న జెర్సీ ధరించడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కాగా 18 నంబర్ విరాట్ కోహ్లిది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘రిషభ్ పంత్ కావాలనే 18వ నంబర్ జెర్సీ ధరించి కోహ్లిని అవహేళన చేయాలని చూస్తున్నాడా?.. కోహ్లి అంటే పడని.. హెడ్కోచ్ గౌతం గంభీర్ దృష్టిలో పడి.. అతడిని ఆకట్టుకోవాలనే ఇలా చేస్తున్నాడా?అది కింగ్ కోహ్లి నంబర్. క్రీడా ప్రపంచంలో దిగ్గజ ఆటగాడు రిటైర్ అయిన తర్వాత అతడి గౌరవార్థం జెర్సీ నంబర్కు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి’’ అంటూ తీవ్ర స్థాయిలో కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా ఇటీవల భారత్- ‘ఎ’ తరఫున ఇంగ్లండ్ లయన్స్తో మ్యాచ్లో పేసర్ ముకేశ్ కుమార్ కూడా 18 నంబర్ ఉన్న జెర్సీ ధరించగా ఇలాగే విమర్శలు వచ్చాయి.అసలు విషయం ఇదీ!ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘భారత్- ‘ఎ’ జట్టులో జెర్సీ నంబర్లు ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించబడవు. వాటిపై పేర్లు కూడా ఉండవు. కాబట్టి మ్యాచ్కు ముందు తమకు వచ్చిన జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రమే పర్టికులర్గా జెర్సీ నంబర్లకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపాయి.కాగా సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో టాస్ గెలిచిన భారత్-‘ఎ’ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 79 ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్!? -
అదొక్కటే జీవితం కాదు.. గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..: రోహిత్
ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు తన ఇష్ట్రపకారం తనకు నచ్చిన రీతిలో సన్నద్ధమయ్యాయని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. అదే ఇప్పుడు ఫలితాన్ని చూపించిందని హర్షం వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ సాధించడంతో పాటు రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ప్రొఫెషనల్ ఆటగాడిగా క్రికెట్ కెరీర్ కోసం సాధన చేయడం సహజమని... అయితే ఆట బయట కూడా మరో ప్రపంచం ఉందని భావించి ప్రాధాన్యతలు తెలుసుకోవాలని అతడు చెప్పాడు.క్రికెట్ ఒక్కటే జీవితం కాదు‘క్రికెటర్గా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక సిరీస్ కోసం 4–5 నెలల సన్నద్ధం అయ్యే అవకాశం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి ఈ సారి ఆ సమయాన్ని బాగా వాడుకున్నాను. నాకు నచ్చిన రీతిలో, నా ఇష్ట్రపకారం సాధన చేయాలని నిర్ణయించుకున్నా. అది బాగా పని చేసింది. మిగిలిన కెరీర్ కోసం ఏం చేయాలో అర్థమైంది కూడా.భారత్తో పోలిస్తే ఆస్ట్రేలియా భిన్నమైన పరిస్థితులు ఉన్నా చాలా సార్లు రావడంతో వాటిపై అవగాహన ఉంది. ఒక్కసారి లయ అందుకుంటే చాలని భావించా. నా కోసం ఎక్కువ సమయం కేటాయించా. జీవితంలో క్రికెట్ కాకుండా ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయని తెలుసుకున్నా’ అని రోహిత్ వెల్లడించాడు.కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యంఆస్ట్రేలియా గడ్డపై ఆడతాన్ని తాను చాలా ఇష్టపడతానని, ఇక్కడి అభిమానులు కూడా ఎంతో మద్దతునిస్తారని రోహిత్ పేర్కొన్నాడు వివరించాడు. ‘సిడ్నీ వన్డేలో నేను భారీ స్కోరు చేయడంతో పాటు జట్టును గెలిపించడం సంతృప్తినిచ్చింది. చాలా కాలం తర్వాత కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. మేం సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పి చాలా రోజులైంది. జట్టుకు ఇది ఉపయోగపడటం సంతోషకరం.గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..గిల్ తొందరగా అవుట్ కావడంతో శ్రేయస్ గాయం కారణంగా మాపై బాధ్యత పెరిగింది. నేను, విరాట్ ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం. ఇద్దరికీ అనుభవం ఉంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలం. అందుకే క్రీజ్లో ఎంతో మాట్లాడుకుంటూ ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాం. సిరీస్ గెలవకపోయినా అభిమానులు ఎంతో మద్దతునిచ్చారు. జట్టుతో సంబంధం లేకుండా మంచి ఆటను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు’ అని రోహిత్ వెల్లడించాడు.మూడో వన్డేలో గెలిచికాగా ఆసీస్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ కోల్పోయింది. ఆతిథ్య జట్టు తొలి రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా.. టీమిండియా నామమాత్రపు మూడో వన్డేలో గెలిచి పరువు నిలుపుకొంది. ఈ మ్యాచ్లో రోహిత్ 121, కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్ను తొమ్మిది వికెట్ల తేడాతో గెలిపించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇదిలా ఉంటే.. ఆసీస్తో సిరీస్కు ముందే రోహిత్ను వన్డే కెప్టెన్గా తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను సారథిగా నియమించింది బీసీసీఐ. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318.. ఒక్క నాన్ 118!.. ఈ రేట్లు ఎక్కడంటే..
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అభిమానులను అలరించాడు. పెర్త్, అడిలైడ్లో డకౌట్లతో నిరాశపరిచిన ఈ రన్మెషీన్.. సిడ్నీలో మాత్రం సత్తా చాటాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆఖరి ఆస్ట్రేలియా టూర్ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి రెండో వికెట్కు ఏకంగా 168 పరుగులు జోడించిన కోహ్లి.. విన్నింగ్ షాట్గా ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోహ్లి కెరీర్లో ఇదే ఆఖరి ఆస్ట్రేలియా టూర్ కానుంది. దీంతో అభిమానులతో పాటు కింగ్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఎట్టకేలకు సిడ్నీలో మరోసారి తన విలువను చాటుకుని ఆసీస్ పర్యటనను ముగించాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కోహ్లి పేరు వైరల్గా మారింది.ఈసారి ఆటతో కాకుండా వ్యక్తిగత విషయంతో కోహ్లి వార్తల్లోకి ఎక్కాడు. కాగా ఈ క్రికెట్ సూపర్స్టార్ వన్8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలో 2022లో తొలి రెస్టారెంట్ తెరిచిన కోహ్లి.. జుహులోనూ ఓ బ్రాంచ్ పెట్టాడు.ఐకానిక్ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్కు చెందిన ఐకానిక్ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్ నడుస్తోంది. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల ధరలు తాజాగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318జుహులోని వన్8 రెస్టారెంట్లో పావ్ భాజీ ధర రూ. 650. అదే విధంగా.. ఉడకబెట్టిన అన్నం ధర రూ. 318. సింగిల్ సర్వింగ్ ఫ్రైస్ ధర ఏకంగా రూ. 348. వీటి సంగతి ఇలా ఉంటే.. కిచిడీ, తందూరీ రోటీ, బేబీ నాన్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.విరాట్ రెస్టారెంట్లో ఒక తందూరీ రోటీ ధర రూ. 118. ఇక కిచిడీ ధర ఏకంగా అక్షరాలా 620 రూపాయలు. కాగా వన్8 రెస్టారెంట్లో మొక్కల ఆధారిత వంటకాలతో పాటు మాంసం, సీ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటాయి.విరాట్ ఫేవరెట్స్అంతేకాదు.. ‘విరాట్ ఫేవరెట్స్’ పేరిట ప్రత్యేక వంటకాలు కూడా ఈ రెస్టారెంట్లో లభిస్తాయి. టోఫు స్టీక్, మష్రూమ్ డంప్లింగ్స్ విత్ ట్రఫోల్ ఆయిల్, సూపర్ఫుడ్ సలాడ్ ఇక్కడి వెజిటేరియన్ స్పెషల్స్. ఇక పెంపుడు జంతువుల కోసం వన్8లో ఫుడ్ అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 518- 818 వరకు ఉంటుంది.ఇక అభిమానులను ఆకర్షించేందుకు వన్8 కమ్యూన్ ఎంట్రన్స్లోనే కోహ్లి క్రికెట్ ప్రయాణాన్ని సూచించేలా ఫొటోలు ఉంటాయి. కోహ్లి జెర్సీ (నంబర్ 18)ని అక్కడి గోడపై వేలాడదీసి ఉంచారు. గ్లాస్ రూఫ్ ద్వారా సూర్యకాంతి పడుతూ ఉంటుంది. ‘‘చక్కటి, ఆహ్లాకరమైన పరిసరాలు ఉండటం అత్యంత ముఖ్యం. భోజన నాణ్యత ఎలాగూ బాగానే ఉంటుంది. ప్రతి వంటకాన్ని శ్రద్ధ పెట్టి తయారు చేస్తాం. కానీ అన్నింటికంటే ఆంబియన్స్ బాగుంటేనే ఎవరైనా ఇక్కడి వరకు వస్తారు’’.. ఆతిథ్య రంగంలో రాణిస్తున్న కోహ్లి తరచూ చెప్పే మాట ఇది!!చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఆసీస్తో మూడో వన్డేలో దుమ్ములేపారు.168 పరుగులు భాగస్వామ్యంఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం (125 బంతుల్లో 121*)తో చెలరేగగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి 74 పరుగులతో చెలరేగి.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ వెటరన్ బ్యాటర్లు తమ వింటేజ్ ఇన్నింగ్స్ను గుర్తుచేస్తూ.. ఏకంగా 168 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.తప్పిన గండంమరోవైపు.. అంతకు ముందు కెప్టెన్, ఓపెనర్ గిల్ (24)తో కలిసి రోహిత్ 69 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. తద్వారా సిడ్నీ వన్డేలో గెలుపొంది ఆసీస్ చేతిలో క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది.మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి పరువు కాపాడుకుంది. మరోవైపు.. ఆఖరిదైన ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణా తన కెరీర్లో తొలిసారి నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసి.. ఆసీస్ను 236 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.రోహిత్- గిల్ సూపర్ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూమ్లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్కోచ్ గౌతం గంభీర్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘శుబ్మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది.ఆ తర్వాత రోహిత్-విరాట్ పార్ట్నర్షిప్ అత్యద్భుతం. ముఖ్యంగా రోహిత్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అతడి ఆట తీరు అమోఘం. మ్యాచ్ను ముగించిన తీరు ప్రశంసనీయం. రోహిత్తో పాటు విరాట్ పని పూర్తి చేశాడు’’ అని గంభీర్ కొనియాడాడు.అహంకారం వద్దుఅంతకుముందు.. ‘‘బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. హర్షిత్ అవుట్స్టాండింగ్ స్పెల్ వేశాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒద్దికగా.. ఒదిగి ఉండాలి. మరింత కష్టపడాలి. అహంకారం వద్దు’’ అని గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ రాణాకు సూచించాడు. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్ టూర్లో కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే గిల్ విఫలమయ్యాడు.మూడు వన్డేల్లో గిల్ చేసిన స్కోర్లు వరుసగా.. 10, 9, 24. ఇక కెప్టెన్గానూ సిరీస్ను ఆసీస్కు 1-2తో కోల్పోయాడు. మరోవైపు.. రోహిత్ శర్మ 8, 73, 121* పరుగులతో రాణించి మూడో వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20లకు, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే వీరి ఏకైక లక్ష్యం. ఇందులో భాగంగానే వారు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.రోకో తదుపరి టార్గెట్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్. ఈ సిరీస్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్పూర్, వైజాగ్ వేదికలుగా ఈ వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి చెలరేగే అవకాశం ఉంది. స్వదేశంలో జరిగే వన్డేల్లో ఈ ఇద్దరికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రత్యర్ధి ఎవరైనా స్వదేశంలో రోకోను ఆపడం అసాధ్యం.రో'హిట్టు'తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ సూపర్ హిట్టయ్యాడు. 3 మ్యాచ్ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 202 పరుగులు చేశాడు. ఈ సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ రోహిత్ ప్రదర్శన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి వన్డేలో రోహిత్ చేసిన సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.భారీగా బరువు తగ్గి ఫిట్నెస్ మెరుగుపర్చుకున్న రోహిత్ ఆ మ్యాచ్లో యధేచ్చగా షాట్లు ఆడాడు. మునుపటి రోహిత్ను గుర్తు చేశాడు. రెండో వన్డేలోనూ రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టమైన పిచ్పై శైలికి విరుద్దంగా, చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.ఈ రెండు ఇన్నింగ్స్ల తర్వాత రోహిత్ భవితవ్యంపై అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న రోహిత్ 2027 ప్రపంచకప్ సమయానికి 40వ పడిలో ఉంటాడు.ఆ వయసులో అతనెలా ఆడగలడని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ అనుమానాలకు రోహిత్ తన ప్రదర్శనలతో చెక్ పెట్టేశాడు. ఫిట్నెస్ ఇలాగే కాపాడుకుంటే 40 కాదు మరో ఐదేళ్లైనా ఆడగలనన్న సంకేతాలు పంపాడు. మొత్తంగా ఆస్ట్రేలియా సిరీస్లో హిట్టైన రోహిత్ 2027 ప్రపంచకప్కు సిద్దమంటూ సంకేతాలు పంపాడు.పరువు కాపాడుకున్న కోహ్లిఆసీస్ సిరీస్లో రోహిత్ హిట్టైతే.. అతని సహచరుడు కోహ్లి మాత్రం నాట్ బ్యాడ్ అనిపించాడు. తొలి రెండు వన్డేల్లో డకౌటైనా, మూడో వన్డేలో రోహిత్తో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (74 నాటౌట్) ఆడి పరువు కాపాడుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో కోహ్లి భవితవ్యంపై కూడా అనుమానాలు తొలగిపోయాయి. కోహ్లి సైతం 2027 ప్రపంచకప్కు రెడీ అంటూ సంకేతాలు పంపాడు. ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండే కోహ్లి.. ఫామ్ను కాపాడుకుంటే ఈజీగా మరో నాలుగైదేళ్లు ఆడగలడు. మొత్తానికి ఈ సిరీస్తో రోహిత్, కోహ్లి భవితవ్యంపై అనుమానాలకు తెరపడింది. ప్రపంచకప్ వరకు వారు ఈజీగా కొనసాగగలరు.ఈ మధ్యలో వారు ఆడే అవకాశమున్న మ్యాచ్లపై ఓ లుక్కేద్దాం..- స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం వచ్చే ఏడాది స్వదేశంలోనే న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. - దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారత్లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అనంతరం ఇంగ్లండ్, బంగ్లాదేశ్ పర్యటనల్లో భారత్ వన్డే సిరీస్లు ఆడుతుంది. - ఆతర్వాత వెస్టిండీస్ భారత్లో పర్యటించి వన్డేలు ఆడనుంది. - అతర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించి వన్డేలు ఆడుతుంది. - 2027 వన్డే ప్రపంచకప్కు కొద్దిముందు భారత్ స్వదేశంలో శ్రీలంకతో వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ల్లో రోకో అన్ని ఆడతారని చెప్పలేము కాని, మెజార్జీ శాతం సిరీస్ల్లో పాల్గొనే అవకాశం ఉంది. చదవండి: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ -
రోహిత్ – కోహ్లి సూపర్హిట్
‘సినిమా ఇంకా మిగిలే ఉంది’... ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆట చూస్తే అభిమానులందరికీ ఇదే అనిపిస్తుంది. సిరీస్ ఆరంభానికి ముందు వారి బ్యాటింగ్పై సందేహాలు, జట్టులో చోటుపై చర్చ... తొలి మ్యాచ్లో వైఫల్యం తర్వాత రోహిత్పై ఒత్తిడి పెరగగా, వరుసగా రెండు డకౌట్లు కోహ్లి సత్తాపై సందేహాలు రేకెత్తించాయి. కానీ వన్డే క్రికెట్ దిగ్గజాలుగా తమ అసలు స్థాయి ఏమిటో వారు ఇప్పుడు చూపించారు.మరికొంత కాలం తమ స్థానం గురించి ఎవరూ మాట్లాడకుండా చేశారు... అలవోకగా పరుగులు సాధించి తమ బ్యాటింగ్లో పదును తగ్గలేదని నిరూపించారు. ఆస్ట్రేలియా గడ్డపై చివరి సారిగా ఆడిన రోహిత్, కోహ్లి సిడ్నీ మైదానంలోని 40,587 మంది ప్రేక్షకులను చక్కటి షాట్లతో అలరించారు. రోహిత్ శతకంతో చెలరేగగా, కోహ్లి దీటైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో రికార్డు స్థాయిలో 5483 పరుగులు జోడించిన ఈ జంట తమ జుగల్బందీతో మరో మ్యాచ్ను గెలిపించి ఫ్యాన్స్కు జోష్ను అందించింది. సిడ్నీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్ను భారత్ విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయినా... చివరి మ్యాచ్ టీమిండియాకు ఆనందాన్ని పంచింది. శనివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. మాట్ రెన్షా (58 బంతుల్లో 56; 2 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 237 పరుగులు సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (124 బంతుల్లో 121 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్స్లు) కెరీర్లో 33వ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి (81 బంతుల్లో 74; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్కు 170 బంతుల్లో అభేద్యంగా 168 పరుగులు జోడించడంతో మరో 11.3 ఓవర్లు ఉండగానే భారత్ విజయం ఖాయమైంది. తొలి రెండు వన్డేలు నెగ్గిన ఆసీస్ 2–1తో సిరీస్ సొంతం చేసుకోగా, మొత్తంగా 202 పరుగులు చేసిన రోహిత్కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ మొదలవుతుంది. హర్షిత్ రాణాకు 4 వికెట్లు... ఆ్రస్టేలియా ఇన్నింగ్స్లో టాప్–6 బ్యాటర్లు మెరుగ్గా ఆరంభించినా, ఒక్కరూ కూడా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఓపెనర్లు మిచెల్ మార్ష్(50 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 29; 6 ఫోర్లు) తొలి వికెట్కు 56 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్ (41 బంతుల్లో 30; 2 ఫోర్లు), రెన్షా కూడా ఫర్వాలేదనిపించడంతో ఒక దశలో స్కోరు 183/3 వద్ద నిలిచింది. అయితే శ్రేయస్ అద్భుత క్యాచ్తో అలెక్స్ క్యారీ (24)ని అవుట్ చేయడంతో ఆసీస్ పతనం మొదలైంది. గత మ్యాచ్ గెలిపించిన కూపర్ కలోనీ (23)తో పాటు ఇతర బ్యాటర్లెవరూ క్రీజ్లో నిలబడలేకపోయారు. ఫలితంగా 53 పరుగుల వ్యవధిలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయింది. మరో 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు ఆలౌట్ అయింది. క్యారీ క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. నితీశ్ రెడ్డి, అర్ష్ దీప్ స్థానాల్లో కుల్దీప్, ప్రసిధ్ కృష్ణలకు చోటు కల్పించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, శుబ్మన్ గిల్ (24) చకచకా 62 బంతుల్లోనే 69 పరుగులు జత చేశారు. గిల్ వెనుదిరిగిన తర్వాత ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కోహ్లి బరిలోకి దిగాడు. తన తొలి బంతికే సింగిల్ తీయడంతో స్టేడియం హోరెత్తిపోగా, కోహ్లి కూడా నవ్వుతూ వారికి అభివాదం చేయడం విశేషం! రోహిత్, కోహ్లి జోడి ఎదురు లేకుండా దూసుకుపోయింది. రోహిత్ దూకుడు ప్రదర్శించగా, కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. జంపా బౌలింగ్లో లాంగాఫ్ మీదుగా రోహిత్ కొట్టిన ‘ఇన్సైడ్ అవుట్’ సిక్స్ హైలైట్గా నిలిచింది. ముందుగా 63 బంతుల్లో రోహిత్, ఆ తర్వాత 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యారు. జంపా బౌలింగ్లో సింగిల్తో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఎలాంటి సంబరాలు చేసుకోకపోగా, భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. ఆ తర్వాత మరో 33 బంతుల్లో జట్టు మ్యాచ్ను ముగించింది. 14,255 వన్డేల్లో కోహ్లి పరుగుల సంఖ్య. సంగక్కర (14,234)ను అధిగమించిన అతను సచిన్ (18,426) తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు.9 ఆస్ట్రేలియాపై రోహిత్ సెంచరీల సంఖ్య. సచిన్ (9)తో అతను సమంగా నిలిచాడు.50 అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ సెంచరీల సంఖ్య. మరో 9 మంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మార్ష్(బి) అక్షర్ 41; హెడ్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 29; షార్ట్ (సి) కోహ్లి (బి) సుందర్ 30; రెన్షా (ఎల్బీ) (బి) సుందర్ 56; క్యారీ (సి) అయ్యర్ (బి) రాణా 24; కనోలీ (సి) కోహ్లి (బి) రాణా 23; ఒవెన్ (సి) రోహిత్ (బి) రాణా 1; స్టార్క్ (బి) కుల్దీప్ 2; ఎలిస్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 16; జంపా (నాటౌట్) 2; హాజల్వుడ్ (బి) రాణా 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 236. వికెట్ల పతనం: 1–61, 2–88, 3–124, 4–183, 5–195, 6–198, 7–201, 8–223, 9–236, 10–236. బౌలింగ్: సిరాజ్ 5–1–24–1, రాణా 8.4–0–39–4, ప్రసిధ్ 7–0–52–1, కుల్దీప్ 10–0–50–1, అక్షర్ 6–0–18–1, సుందర్ 10–0–44–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 121, గిల్ (సి) క్యారీ (బి) హాజల్వుడ్ 24; కోహ్లి (నాటౌట్) 74; ఎక్స్ట్రాలు 18; మొత్తం (38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 237. వికెట్ల పతనం: 1–69. బౌలింగ్: స్టార్క్ 5–0–31–0, హాజల్వుడ్ 6–1–23–1, ఎలిస్ 7.3–0–60–0, కనోలీ 5–0–36–0, జంపా 10–0–50–0, ఒవెన్ 1–0–2–0, షార్ట్ 4–0–29–0. -
రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతక్కొట్టాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లను హిట్మ్యాన్ ఉతికారేశాడు. మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లితో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు.రోహిత్ ఓవరాల్గా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కోహ్లి (74నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా టీమిండియా లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, సిరీస్గా నిలిచిన రోహిత్ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఇవే..👉సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన విదేశీ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 95 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్(92) పేరిట ఉండేది. ఈ మ్యాచ్లో 3 సిక్స్లు బాదిన రోహిత్.. గేల్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతి పెద్ద వయష్కుడిగా రోహిత్ నిలిచాడు.38 ఏళ్ల 178 రోజులు వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(37 సంవత్సరాలు, 132 రోజులు) పేరిట ఉండేది.👉వన్డే చరిత్రలో లేటు వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు👉ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన విదేశీ బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి (5), కుమార సంగక్కర (5)లను హిట్మ్యాన్ అధిగమించాడు. 👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్గా రోహిత్ రికార్డులకెక్కాడు.చదవండి: థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్ -
థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశారు. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రో-కో ద్వయం.. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.ఈ సీనియర్ క్రికెటర్లు మరో రెండేళ్ల పాటు జట్టులో కొనసాగే అవకాశమున్నప్పటికి టీమిండియా మాత్రం ఇప్పటిలో వైట్ బాల్ సిరీస్లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లదు. మళ్లీ భారత జట్టు 2028లో ఆసీస్ టూర్కు వెళ్లే అవకాశముంది.అప్పటికి కోహ్లి-రోహిత్ల వయస్సు 40 ఏళ్లు దాటుతుందున్నందన భారత జట్టులో కొనసాగే ఛాన్స్ లేదు. దీంతో శనివారం సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేనే కోహ్లి-రోహిత్కు ఆసీస్ గడ్డపై ఆఖరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్లో వీరిద్దరూ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు.రోహిత్ శర్మ(121) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే క్రికెట్లో ఈ సీనియర్ జోడీకి 12వ 150 ప్లస్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియాలో జ్ఞాపకాలను రో-కో గుర్తు చేసుకున్నారు."నేను ఆస్ట్రేలియాలో ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడతాను. 2008 నుంచి ఇక్కడ ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు మాకు మరొక అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆడిన ప్రతీ క్షణాన్ని అస్వాధించాము. ఇక్కడ మాకు సపోర్ట్గా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు": రోహిత్"ఆస్ట్రేలియాలో ఆడేందుకు మేము ఎంతో ఇష్టపడతాము. ఈ గడ్డపై మా నుంచి ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. ఇక్కడ అభిమానులు మద్దతు నిజంగా ఒక అద్భుతం. అందరికీ చాలా థాంక్స్: విరాట్ కోహ్లిచదవండి: IND vs AUS: తీవ్ర గాయం! అస్పత్రిలో శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
రోహిత్ ఉంటే చాలు చెలరేగిపోతా.. ఛేజింగ్ అంటే నాకు ఇష్టం: కోహ్లి
సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే పదడుగులు ముందుకు వేస్తుంది.. ఈ డైలాగ్ సరిగ్గా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సరిపోతుంది. దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కోహ్లి.. ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లోనే డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.అ తర్వాత రెండో మ్యాచ్లో కూడా మళ్లీ డకౌట్. దీంతో కోహ్లిపై సర్వాత్ర విమర్శల కురిసింది. కోహ్లి రిటైర్ అయపోతాడని, ఇక లండన్కు బ్యాగ్ సర్ధుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కానీ కోహ్లి అభిమానులు మాత్రం తమ ఆరాధ్య క్రికెటర్గా బలంగా తిరిగొస్తాడని నమ్మారు.వారి నమ్మకాన్ని కోహ్లి నిలబెట్టాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ విశ్వరూపం చూపించాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 81 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తన అద్బుత ఇన్నింగ్స్తో సచిన్, సంగక్కరల వరల్డ్ రికార్డులను కింగ్ బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్కప్-2027కు తను సిద్దమనేని ఈ నాక్తో కోహ్లి చాటి చెప్పాడు. ఇక తన ఇన్నింగ్స్పై మ్యాచ్ అనంతరం కోహ్లి స్పందించాడు."అదృష్టవశాత్తూ డకౌట్ల నుంచి బయటపడగలిగాను. అంతర్జాతీయ క్రికెట్లో చాలా కాలం ఆడినా.. ప్రతీ మ్యాచ్ కూడా మనకు కఠిన సవాల్ను విసరుతోంది. కొన్నిసార్లు పూర్తిగా పరుగులు ఎలా సాధించాలో తెలియకపోయినట్లు అన్పిస్తోంది. ఈ జేంటల్మేన్ గేమ్ మనల్ని పరీక్షిస్తోంది. నా కెరీర్లో ఇటువంటి పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. ఈ కఠిన పరిస్థితులలే నాలోని ప్రతిభను వెలికితీశాయి. రోహిత్తో కలిసి బ్యాటింగ్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. రోహిత్ శర్మ క్రీజులో ఉంటే స్ట్రైక్స్ రొటేట్ చేయడం సులభమవుతుంది. అతడితో భాగస్వామ్యాన్ని అస్వాదించాను. ఛేజింగ్ ఎల్లప్పుడూ నాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తుంది. ఇద్దరం ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన జోడీగా మేము ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మ్యాచ్లలో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాము.2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే హోమ్ సిరీస్ నుంచి మా ఇద్దరి పార్టనర్ షిప్ మొదలైంది. ఆ మ్యాచ్లో దాదాపు 20 ఓవర్ల పాటు కలిసి బ్యాటింగ్ చేశాము. ఆస్ట్రేలియాలో మాకు లభించిన ఆదరణకు మేము రుణపడి ఉంటాము" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి-రోహిత్ ఇద్దరూ 168 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.చదవండి: #ViratKohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో వరుసగా రెండు మ్యాచ్లలో డకౌటైన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. సిడ్నీ వన్డేలో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 237 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో విరాట్ ఆజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను కోహ్లి అలరించాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. 81 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడితో పాటు రోహిత్ శర్మ ((125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121) శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ల ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 38.3 ఓవర్లలోనే చేధించింది. కాగా ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్..👉అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డే, టీ20లు కలిపి 18437 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ రెండు వైట్ బాల్ ఫార్మాట్లు కలిపి 18436 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు. అయితే సచిన్ తన కెరీర్లో భారత్ తరపున కేవలం ఒక్క టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు.👉అదేవిధంగా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఛేజింగ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా సచిన్ రికార్డును కోహ్లి సమం చేశాడు. సచిన్ తన కెరీర్లో వన్డే రన్ చేజ్లో 70 హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లి కూడా సరిగ్గా 70 ఆర్ధ శతకాలు సాధించాడు. మరో హాఫ్ సెంచరీ చేస్తే సచిన్ను విరాట్ అధిగమిస్తాడు.👉వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా కుమర సంగక్కర రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. సంగక్కర 380 ఇన్నింగ్స్లలో14234 పరుగులు చేయగా.. కోహ్లి కోహ్లి ఇప్పటివరకు 293* ఇన్నింగ్స్లో 14255 రన్స్ సాధించాడు. ఈ జాబితాలో సచిన్(18426 పరుగులు) అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు.చదవండి: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత స్థానం ‘కింగ్’దే! -
శతక్కొట్టిన రోహిత్... కోహ్లి హాఫ్ సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (India Beat Australia) ఘన విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) అద్భుత ప్రదర్శనలతో రాణించి జట్టుకు విజయం అందించారు. రోహిత్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్, అడిలైడ్ వన్డేల్లో ఓడిన టీమిండియా.. సిడ్నీ వేదికగా శనివారం మూడో వన్డే ఆడింది. ఇందులో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 236 పరుగులకు ఆసీస్ ఆలౌట్ ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించగా.. మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23) ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేశారు.తొలి ఫోర్ వికెట్ హాల్అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా తన కెరీర్లో తొలి వన్డే హాఫ్ సెంచరీ (56)తో సత్తా చాటాడు. తద్వారా ఆసీస్ ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి.. తన కెరీర్లో తొలి ఫోర్ వికెట్ హాల్ నమోదు చేశాడు.CLUTCH! ⭐⭐⭐⭐#HarshitRana bags his maiden 4-wicket haul in international cricket as #TeamIndia bowl out Australia in Sydney 👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/JXFhwCDgzX— Star Sports (@StarSportsIndia) October 25, 2025మిగిలిన వారిలో పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్, విరాట్ ధనాధన్ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (26 బంతుల్లో 24) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్ 105 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు.Hitman has RO-ared with all class in Sydney! 💯👉 His 33rd ODI century, 50th across formats👉 9 - Joint-most 100s in ODIs against AUS👉 6- Most 100s by a visiting batter in ODIs in AUS#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/r5AtoC6u1i— Star Sports (@StarSportsIndia) October 25, 2025 కాగా రోహిత్ వన్డే కెరీర్లో ఇది 33వ శతకం కావడం విశేషం. మరోవైపు.. పెర్త్, అడిలైడ్ వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. ఈసారి మాత్రం తనదైన ముద్ర వేయడంలో సఫలం అయ్యాడు. వన్డే కెరీర్లో 75వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. ఫోర్ బాది రోహిత్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.Hence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌👉 Virat Kohli's 75th ODI fifty👉 His 70th 50+ score in ODI run chases - most by any batter👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఇక ఈ మ్యాచ్లో సత్తా చాటిన రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. పెర్త్లో ఎనిమిది పరుగులే చేసిన రోహిత్.. అడిలైడ్లో మాత్రం 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా సెంచరీతో చెలరేగి మరోసారి తన విలువను చాటుకున్నాడు. ఏదేమైనా సిడ్నీ వన్డేతో తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని రో- కో చెప్పారంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.చదవండి: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్ తర్వాత స్థానం ‘కింగ్’దే! INDIA WINNNNNN! 🇮🇳The crowd came to witness something special in Sydney and Ro-Ko didn’t disappoint! 🫂If this was their last match in Australia, what a way to leave a legacy behind! 💙 pic.twitter.com/3MR2KxQBxh— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
అత్యధిక పరుగుల వీరుడు.. సచిన్ తర్వాత స్థానం కోహ్లిదే!
అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat Kohli) తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా.. కుమార్ సంగక్కరను అధిగమించి కోహ్లి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు అతి తక్కువ ఇన్నింగ్స్లోనే పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఆటగాడిగానూ కోహ్లి నిలిచాడు.వరుసగా డకౌట్లుదాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ దిగ్గజ బ్యాటర్.. అడిలైడ్ వన్డేలోనూ ఇదే పునరావృతం చేశాడు. ఈ క్రమంలో భారీ అంచనాలు, ఒత్తిడి నడుమ సిడ్నీ వన్డే బరిలో దిగిన కోహ్లి వింటేజ్ కింగ్ను గుర్తు చేశాడు. నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా ఆ తర్వాత జోరు పెంచరీ అర్ధ శతకం సాధించాడు. వన్డే కెరీర్లో 75 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపుశతకధీరుడు ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సిడ్నీ వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి క్లీన్స్వీప్ గండం నుంచి తప్పించుకుంది.అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)- 452 ఇన్నింగ్స్లో 18426 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 293* ఇన్నింగ్స్లో 14235 పరుగులు🏏కుమార్ సంగక్కర (శ్రీలంక)- 380 ఇన్నింగ్స్లో 14234 పరుగులు🏏రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 365 ఇన్నింగ్స్లో 13704 పరుగులు🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 433 ఇన్నింగ్స్లో 13430 పరుగులుHence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌👉 Virat Kohli's 75th ODI fifty👉 His 70th 50+ score in ODI run chases - most by any batter👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025 -
సింగిల్ తీసిన కోహ్లి.. దద్దరిల్లిన స్టేడియం.. వీడియో వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా తాజా పర్యటనలో పరుగుల ఖాతా తెరిచాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తన మార్కు చూపిస్తున్నాడు.కాగా కెరీర్ చరమాంకానికి చేరుకున్న కోహ్లికి ఇదే ఆఖరి ఆసీస్ టూర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెర్త్, అడిలైడ్లో కోహ్లి ఆట చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. అయితే, రాజు ఎక్కడైనా రాజే అన్నట్లుగా అడిలైడ్ వన్డేలో ఈ లెజెండరీ బ్యాటర్ డకౌట్ అయినా.. టీమిండియా, ఆసీస్ అభిమానులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి కోహ్లి పట్ల ప్రేమను చాటుకున్నారు.తాజాగా శనివారం నాటి మూడో వన్డేలో కోహ్లి బ్యాటింగ్కు వస్తున్నపుడే సిడ్నీ క్రౌడ్... లేచి నిలబడి అతడిని చీర్ చేస్తూ ఎమోషనల్ అయింది. కాగా ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ త్వరగానే పెవిలియన్ చేరాడు.మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న గిల్.. భారత ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో రెండో బంతికి జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లి.. రోహిత్ శర్మతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు.దీంతో సిడ్నీ ప్రేక్షకుల సంబరాలు అంబరాన్నంటాయి. కోహ్లి ఒక్క పరుగు పూర్తి చేసుకోగానే స్టేడియం కేరింతలతో దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 16 ఓవర్ల ఆట (డ్రింక్స్ బ్రేక్) పూర్తయ్యేసరికి రోహిత్ 49 బంతుల్లో 43, కోహ్లి 21 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.So many emotions! ☺️🥹❤️He’s off the mark & the crowd has made its happiness loud and clear! 🙌Will we witness a Chase Master special from #ViratKohli tonight? 🔥#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/SZiBRnnvUY— Star Sports (@StarSportsIndia) October 25, 2025 ఇక మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య ఆసీస్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మార్ష్ బృందం.. 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత యువ పేసర్ హర్షిత్ రాణా నాలుగు వికెట్లతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్ రెండు. సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. కోహ్లి మాథ్యూ షార్ట్ (30), కూపర్ కన్నోలి (23) క్యాచ్లు అందుకుని టీమిండియా కీలక వికెట్లు దక్కించుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. -
IND vs AUS: సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం
Australia vs India, 3rd ODI Updates And Highlights: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియాతో నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 236 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ లక్ష్యం: 237 పరుగులుగా నిర్దేశించింది.భారత్ ఘన విజయం..సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వైట్ వాష్ నుంచి టీమిండియా తప్పించుకుంది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రం కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో సీనియర్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి 74 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరూ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేశారు.విజయం దిశగా32.6: జంపా బౌలింగ్లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. వన్డేల్లో రోహిత్కు ఇది 33వ శతకం. 33 ఓవర్లలో టీమిండియా స్కోరు 200-1. రోహిత్ 100, కోహ్లి 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి 37 పరుగుల దూరంలో ఉంది.కోహ్లి హాఫ్ సెంచరీ..వరుసగా రెండు మ్యాచ్లలో డకౌటైన విరాట్ కోహ్లి.. సిడ్నీ వన్డేలో మాత్రం సత్తాచాటాడు. కోహ్లి 56 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 178-1(29).రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..సిడ్నీ వన్డేలోనూ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 63 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 23 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్తో పాటు కోహ్లి(36) ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్10.2: గిల్ (24) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 70-1(10.3). రోహిత్ 32 పరుగులతో ఉన్నాడు. కోహ్లికి సిడ్నీలో ఇదే ఆఖరి మ్యాచ్ అన్నట్లుగా ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తూ ఎమోషనల్ అయ్యారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 68-0 (10).గిల్ 24, రోహిత్ 31 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న రోహిత్, గిల్237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఆది నుంచే ఆసీస్ బౌలర్లు కట్టడి చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ఆచితూచి ఆడుతున్నారు. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 48-0. రోహిత్ 25, గిల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.హాజిల్వుడ్ బౌల్డ్46.4: హర్షిత్ రాణా బౌలింగ్లో హాజిల్వుడ్ (0) బౌల్డ్ కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. ఫలితంగా 236 పరుగులకే ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ డౌన్46.2: హర్షిత్ రాణా బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన కన్నోలి (23). దీంతో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 236-9(46.2). హాజిల్వుడ్ క్రీజులోకి రాగా... జంపా రెండు పరుగులతో ఉన్నాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా43.5: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన నాథన్ ఎల్లిస్ (16). స్కోరు: 223-8(43.5). కన్నోలి 13 పరుగులతో ఉన్నాడు. జంపా క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ డౌన్38.4: కుల్దీప్ బౌలింగ్లో ఏడో వికెట్గా వెనుదిరిగిన స్టార్క్ (2). కుల్దీప్ అద్భుత బంతితో స్టార్క్ను బౌల్డ్ చేశాడు. ఆసీస్ స్కోరు: 201-7(38.4). నాథన్ ఎల్లిస్ క్రీజులోకి రాగా.. కన్నోలి 8 పరుగులతో ఉన్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాఓవెన్ (1) రూపంలో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్ చేరాడు. స్టార్క్ క్రీజులోకి రాగా.. 38 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 199-6(38). కన్నోలి 7, స్టార్క్ ఒక పరుగుతో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా36.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హాఫ్ సెంచరీ వీరుడు మ్యాట్ రెన్షా (56) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఎల్బీడబ్ల్యూ విషయంలో ఆసీస్ రివ్యూకు వెళ్లగా.. బంతి లెగ్ స్టంప్ను హిట్ చేస్తున్నట్లుగా తేలింది. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోగా.. మిచెల్ ఓవెన్ క్రీజులోకి వచ్చాడు. 37 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 197-5. కన్నోలి 6 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా33.4: హర్షిత్ రాణా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి క్యారీ (24) అవుట్. అద్భుతమైన క్యాచ్తో మెరిసి టీమిండియా కీలక వికెట్ పొందడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ గాయపడినట్లు తెలుస్తోంది. కూపర్ కన్నోలి క్రీజులోకి రాగా 34 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోరు: 184-4. రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్22.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి మాథ్యూ షార్ట్ అవుటయ్యాడు. 41 బంతుల్లో 30 పరుగులు చేసి మూడో వికెట్గా వెనుదిరిగాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. 24 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. రెన్షా 22, క్యారీ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.The only leadership summit all of us want to be part of! 📝📚#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/HzAE2KIPI1— Star Sports (@StarSportsIndia) October 25, 2025 రెండో వికెట్ డౌన్15.1: మార్ష్ (41) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మార్ష్ బౌల్డ్ అయ్యాడు. మ్యాట్ రెన్షా క్రీజులోకి రాగా.. షార్ట్ 11 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 92-2 (16)A classic Axar Patel delivery! 🔥The Aussie skipper heads back, and #TeamIndia are right back in the contest! 🇮🇳👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/BDrWFPLvgs— Star Sports (@StarSportsIndia) October 25, 2025తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన ట్రావిస్ హెడ్. 25 బంతులు ఎదుర్కొని 29 పరుగుల చేసిన హెడ్ అవుట్. ఫలితంగా తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. మాథ్యూ షార్ట్ క్రీజులోకి రాగా.. మార్ష్ 25 పరుగులతో ఆడుతున్నాడు. పది ఓవర్లలో ఆసీస్ స్కోరు: 63-1ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 26-0(5)మిచెల్ మార్ష్ 6, ట్రావిస్ హెడ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. హర్షిత్ రాణా సిరాజ్ కలిసి ఆల్టర్నేటివ్ ఓవర్లలో బరిలోకి దిగాడు.ఒక మార్పుతో బరిలోకిఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. యువ ఆటగాళ్లు రాణించడం మా జట్టుకు శుభపరిణామం. 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసే సువర్ణావకాశం మా ముందుంది. గత మ్యాచ్లో కూపర్ కన్నోలి అద్భుతంగా ఆడాడు. ఈ వన్డేలో మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేవియర్ బార్ట్లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.టీమిండియాలో రెండు మార్పులుమరోవైపు.. టీమిండియా గత మ్యాచ్లలో చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లు అనిపిస్తోంది. రెండు వన్డేల్లో బెంచ్కే పరిమితం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఎట్టకేలకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణలను ఎంపిక చేసుకుంది.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్. -
రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు?
వన్డే కెప్టెన్గా టీమిండియా పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ (IND vs AUS ODIS 2025)ను భారత్ కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఓడి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.ఈ నేపథ్యంలో వన్డే సారథిగా తొలి సిరీస్లోనే వరుసగా రెండు వన్డేలు ఓడిన ఆరో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. అతడి కంటే ముందు అజిత్ వాడేకర్, దిలీప్ వెంగ్సర్కార్, క్రిస్ శ్రీకాంత్, మొహమ్మద్ అజారుద్దీన్, కేఎల్ రాహుల్ ఈ చేదు అనుభవాన్ని చవిచూశారు.రోహిత్ శర్మపై వేటు వేసికాగా భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025 అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి మరీ.. బీసీసీఐ గిల్కు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడిలైడ్లో రెండో వన్డేలో గిల్ సేన ఓటమి నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తనదైన శైలిలో స్పందించాడు.రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు..‘‘కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రతి కెప్టెన్ మదిలో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. గిల్ కూడా ఇందుకు అతీతం కాదు. అతడి జట్టులో ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటికే నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న దిగ్గజం. అతడి సారథ్యంలో గిల్ ఆడాడు. కెప్టెన్గా రోహిత్ ఎలాంటి తప్పూ చేయలేదని గిల్కు బాగా తెలుసు.అయినా సరే.. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారనీ తెలుసు. హోటల్ రూమ్లో నిద్రకు ఉపక్రమించే ముందు బహుశా గిల్ ఇదే అనుకుంటూ ఉంటాడు. ‘రోహిత్ భాయ్ ఎలాంటి తప్పూ చేయలేదు. అయినా ఎందుకిలా చేశారు?నన్నెందుకు కెప్టెన్ చేశారు?నన్ను సమర్థిస్తున్న వాళ్లు ఒక్కసారైనా రోహిత్ భాయ్ గురించి ఆలోచించారా? ఆయన రెండు ట్రోఫీలు గెలిచాడు. అయినా సరే కెప్టెన్గా వేటు వేశారు. కొత్త కెప్టెన్గా నన్ను ఎంపిక చేశారు’ అనే గిల్ట్తో సతమతమవుతూ ఉంటాడు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా సిరీస్ ఓటమిపై స్పందిస్తూ..ఆ విషయం గుర్తే లేదు ‘‘వరుస సిరీస్లు, ప్రయాణ బడలిక. రోహిత్, కోహ్లి వంటి దిగ్గజాలను లీడ్ చేయడం వంటికి గిల్కు పెద్ద సవాలు. వన్డే కెప్టెన్గా గిల్ ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నాడు. జట్టు మార్పు చెందే ప్రక్రియలో ఇలాంటివి సహజమే.గిల్ కాస్త ఒత్తిడికి లోనై ఉంటాడు. అతడి సారథ్యంలో మనం వన్డే సిరీస్ కోల్పోయాం. చివరగా ఎప్పుడు ఇది జరిగిందో కూడా ఎవరికీ గుర్తులేదు. గిల్ కెప్టెన్సీలో ఆరంభంలోనే ఇది జరిగింది’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.చదవండి: WTC: ఒక్క మ్యాచ్తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!Oh my word! 🤩@ImRo45 is back to his very best. Just what #TeamIndia needed. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/P95TUGWl95— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
విరాట్ కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లి (Virat Kohli) విఫలమయ్యాడు. అడిలైడ్లో మంచి రికార్డు కలిగి ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గురువారం నాటి మ్యాచ్లో మాత్రం డకౌట్ అయ్యాడు. అంతకు ముందు పెర్త్ వేదికగా తొలి వన్డేలోనూ ఈ దిగ్గజ ఆటగాడు సున్నా చుట్టడం గమనార్హం.ఈ నేపథ్యంలో అడిలైడ్ వన్డేలో కోహ్లి అవుటై.. పెవిలియన్కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా కోహ్లి సైతం గ్లోవ్స్ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా మైదానం వీడాడు. అయితే, కోహ్లి చర్య రిటైర్మెంట్కు సంకేతమంటూ వదంతులు వ్యాపించాయి.రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన..ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. ‘‘వన్డేల్లో 52 సెంచరీలు చేశాడు. 14 వేలకు పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లోనూ 32 దాకా శతకాలు ఉన్నాయి. ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు.అలాంటి ఆటగాడు వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏమీలేదు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. మున్ముందు ఇంకా ఆడతాడు. తదుపరి సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్ కోహ్లికి ఫేవరెట్ గ్రౌండ్. అక్కడ శతకాలు బాదిన చరిత్ర అతడికి ఉంది. కాబట్టి.. సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ తట్టుకోలేకపోయారు. అయినా ఆటగాడి కెరీర్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.ఆ స్పందన అమోఘంఏదేమైనా కోహ్లి మైదానాన్ని వీడుతున్న వేళ అభిమానుల నుంచి వచ్చిన స్పందన అమోఘం. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. వారంతా కూడా భారతీయ అభిమానులతో కలిసి కోహ్లికి ఓవియేషన్ ఇచ్చారు. గొప్ప ఆటగాడికి లభించే ఆదరణకు తార్కాణం అది.ఇది చాలా చాలా ప్రత్యేకం. ఇదేమీ కోహ్లి కెరీర్కు ముగింపు కాదు. అతడు ఆటగాళ్లు కూర్చునే స్టాండ్ వైపు వెళ్లాడు. అయితే, తన పట్ల అభిమానం చూపుతున్న వారి కోసం మాత్రమే గ్లోవ్స్ తీసి వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.అంత తేలికగా ఓటమిని ఒప్పుకోడువిరాట్ కోహ్లి.. అంత తేలికగా ఓటమిని ఒప్పుకొని ఆటను వదిలేసే రకం కాదు. వరుసగా రెండుసార్లు డకౌట్ అయిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఉన్నత స్థాయిలోనే అతడు ఆటకు వీడ్కోలు పలుకుతాడు.సిడ్నీ మ్యాచ్ తర్వాత.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఉంది. ఇంకా చాలా మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. రోహిత్ శర్మతో కలిసి విరాట్ వన్డే వరల్డ్కప్-2027 ఆడతాడనే భావిస్తున్నా. లేదంటే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్కూడా నిరాశ చెందుతారనడంలో సందేహం లేదు.ఆ ఛాన్సే లేదుఏదేమైనా కోహ్లి తన పట్ల అభిమానం చూపిన వారికి కృతజ్ఞతగా మాత్రమే గ్లోవ్స్ తీశాడు. ఒకవేళ తను సెంచరీ చేసి ఉంటే బ్యాట్ ఎత్తి అభివాదం చేసేవాడు. కాబట్టి కోహ్లి రిటైర్మెంట్ అంటూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని గావస్కర్ స్పోర్ట్స్తక్తో పేర్కొన్నాడు. కాగా పెర్త్ వన్డేలో ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. అడిలైడ్లో రెండు వికెట్ల తేడాతో ఓడి సిరీస్ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల, టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడుA tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8— Star Sports (@StarSportsIndia) October 23, 2025 -
IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆతిథ్య ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు.. తాజాగా అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ జయభేరి మోగించారు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాఅడిలైడ్ ఓవల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. పర్యాటక భారత జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఒకే ఓవర్లో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) వికెట్ తీసి జేవియర్ బార్ట్లెట్ ఆసీస్కు శుభారంభం అందించాడు.రాణించిన రోహిత్, శ్రేయస్ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. రోహిత్ (97 బంతుల్లో 73), అయ్యర్ (77 బంతుల్లో 61) పరుగులతో రాణించగా.. మిగతా వారిలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (41 బంతుల్లో 44), హర్షిత్ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (11) నితీశ్ రెడ్డి (8) రూపంలో కీలక వికెట్లు దక్కించుకున్నాడు. పేసర్లలో బార్ట్లెట్ గిల్, కోహ్లి, వాషింగ్టన్ సుందర్ (12) వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. మిచెల్ స్టార్క్ రోహిత్ శర్మ, అర్ష్దీప్ సింగ్ (13)లను అవుట్ చేశాడు.264 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (11)ను అర్ష్దీప్ త్వరగానే పెవిలియన్కు పంపగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 28)ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు.అదరగొట్టిన షార్ట్, కన్నోలి అయితే, వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ అద్భుత అర్ధ శతకం (74)తో మెరిసి మ్యాచ్ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేయగా.. మ్యాట్ రెన్షా (30) అతడికి సహకరించాడు. షార్ట్, రెన్షా వేసిన పునాదిపై ఆల్రౌండర్ కూపర్ కన్నోలి మిచెల్ ఓవెన్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.Just the wicket #TeamIndia needed! 🤩#NitishKumarReddy gets the wicket and #MohammedSiraj makes amends for the dropped catch. 👏#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YZwdPY0nr7— Star Sports (@StarSportsIndia) October 23, 2025 ఆఖర్లో వరుస విరామాల్లో వికెట్లు పడినా కన్నోలి పట్టుదలగా నిలబడ్డాడు. ఓవెన్ 23 బంతుల్లో 36 పరుగులతో వేగంగా ఆడి.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వెనుదిరగగా.. బార్ట్లెట్ (3), స్టార్క్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.అయితే, కన్నోలి మాత్రం నిలకడగా ముందుకు సాగాడు. 53 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టపోయిన ఆస్ట్రేలియా లక్ష్యం పూర్తి చేసింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి.. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు సిడ్నీ వేదిక. కాగా వన్డే సారథిగా గిల్కు తొలి సిరీస్లోనే ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఇక రెండో వన్డేలో జంపాకు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ -
Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో (India vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 23) తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్లో 4 బంతుల డకౌట్ను నమోదు చేశాడు.కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ డబుల్ డక్ కోహ్లి కెరీర్లో చెరగని మరకలా మిగిలిపోతుంది. కెరీర్ చరమాంకంలో రికార్డుల రారాజుకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం.టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లి మునుపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో వన్డేలో ఔటైన తర్వాత అతని ప్రవర్తన ఈ సిరీస్తో కెరీర్ ముగింపును సూచించింది. తమ ఆరాధ్య ఆటగాడు కెరీర్ చరమాంకంలో వరుస డకౌట్లు కావడాన్ని కోహ్లి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.డబుల్ డక్ తర్వాత కోహ్లి వన్డే సగటు కూడా పడిపోయింది. కోహ్లి ఫామ్లో ఉన్నప్పుడే రిటైరయ్యుంటే గౌరవంగా ఉండేదని అతని అభిమానులు అనుకుంటున్నారు. మరోపక్క కోహ్లిలాగే కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం రెండో వన్డేలో హిట్ అయ్యాడు.రోహిత్ కూడా తొలి వన్డేలో నిరాశపరిచినా రెండో వన్డేలో మాత్రం బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (73) జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో రోహిత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. హిట్మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్తో పాటు శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతుంది. 54 పరుగులకే ఓపెనర్లు మిచెల్ మార్ష్ (11), ట్రవిస్ హెడ్ (28) వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (32), మ్యాట్ రెన్షా (23) క్రీజ్లో ఉన్నారు. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96/2గాఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఆసీస్ మరో 169 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.చదవండి: కొత్త బ్యాటర్.. ఆరంభంలోనే అదుర్స్! -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ ఆదుకున్నాడు.తొలుత ఆచితూచి ఆడిన రోహిత్, క్రీజులో నిలదొక్కకున్నాక ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 97 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్లతో 73 పరుగులు చేశాడు. సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో ఓపెనర్గా 9180* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (9146 ) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో గంగూలీని రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్(15310) అగ్రస్ధానంలో ఉన్నాడు.👉ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టుపై 1,000 కంటే ఎక్కువ వన్డే పరుగులు తొలి భారత బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్గా ఐదో బ్యాటర్గా హిట్మ్యాన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఫీట్ను అంత్యంత వేగంగా అందుకున్న రెండో బ్యాటర్ మాత్రం రోహిత్ శర్మనే కావడం గమనార్హం. రోహిత్ కేవలం 21 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ (19) అగ్రస్దానంలో ఉన్నాడు.👉వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్ధానానికి చేరుకున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 11225 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గంగూలీ(11221)ని రోహిత్ అధిగమించాడు.👉ఆసీస్పై వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా బ్రియాన్ లారా రికార్డును హిట్మ్యాన్ సమం చేశాడు. వీరిద్దరూ 18 హాఫ్ సెంచరీలు ఆసీస్పై సాధించారు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!? -
డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా?
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. పెర్త్లో ఎనిమిది బంతులు ఎదుర్కొని మిచెల్ స్టార్క్ బౌలింగ్లో డకౌట్ అయిన కోహ్లి.. అడిలైడ్ వేదికగా రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. లెగ్ బిఫోర్ వికెట్గాభారత జట్టు ఇన్నింగ్స్లో ఏడో ఓవర్లో ఆస్ట్రేలియా యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ (Xavier Bartlett) బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న కోహ్లి వికెట్ల ముందు అతడికి దొరికిపోయాడు. బార్ట్లెట్ సంధించిన బంతిని ఫ్లిక్ షాట్ ఆడబోయిన కోహ్లి విఫలమయ్యాడు. బంతి బ్యాట్కు బదులు ప్యాడ్కు తాకింది.VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T— cricket.com.au (@cricketcomau) October 23, 2025 అయితే, ఫీల్డ్ అంపైర్ సామ్ నొగాజ్స్కి లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా ప్రకటించేందుకు తటపటాయించాడు. అయితే, ఆసీస్ బౌలర్లు అప్పీలు చేసిన వెంటనే అవుట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో కోహ్లితో పాటు అడిలైడ్ స్టేడియంలోని అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. నాలుగు బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఇలా మరోసారి సున్నా చుట్టడంతో స్టేడియం అంతా సైలెంట్ అయిపోయింది.ఇదే తొలిసారికాగా వన్డే క్రికెట్లో కోహ్లి తన పదిహేడేళ్ల కెరీర్లో వరుసగా రెండుసార్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. అవుటైన తర్వాత పెవిలియన్కు చేరే క్రమంలో కోహ్లి గ్లోవ్స్ తీసి.. అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ డ్రెసింగ్ రూమ్ వైపు వెళ్లడం రిటైర్మెంట్ వదంతులకు ఊతమిచ్చింది.డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్బై చెప్పేశాడా?ఆస్ట్రేలియాతో గతేడాది బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లోనూ వరుస వైఫల్యాల నేపథ్యంలో కోహ్లి ఆఖరి మ్యాచ్లో ఇలాగే చేశాడంటూ ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. ఇక ఆ సిరీస్ తర్వాత కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి తాజా చర్య కూడా వన్డే రిటైర్మెంట్కు సంకేతమేనంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మరికొంత మంది మాత్రం తనకెంతో ఇష్టమైన అడిలైడ్ వేదికపై కోహ్లి చివరి వన్డే ఆడేశాడని.. ఓవల్తో పాటు ఇక్కడి అభిమానులకు మాత్రమే గుడ్బై చెప్పాడని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తు ప్రశ్నార్థకంచివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన కోహ్లి ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ ఆసీస్తో వన్డేతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, పునరాగమనంలో ఇలా వరుసగా డకౌట్లు కావడం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. వన్డే వరల్డ్కప్-2027 ఆడాలని కోహ్లి పట్టుదలగా ఉండగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం ఇది కుదరదనే సంకేతాలు ఇచ్చాడు. ఆసీస్తో వన్డే జట్టు ప్రకటన సందర్భంగా రోహిత్ శర్మ, కోహ్లి తమకు ఈ విషయమై హామీ ఇవ్వలేదని.. అందుకే రోహిత్ను వన్డే కెప్టెన్గా తొలగించినట్లు తెలిపాడు. కాగా రో- కో ఇప్పటికే పొట్టి ఫార్మాట్, టెస్టులకు గుడ్బై చెప్పి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇక ఆసీస్తో రెండో వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్ను మించిపోయేవాడిని' End is very-very near guys, cherish each and every moment of Virat kohli in this tour.💔 pic.twitter.com/vgJ3Uy4rxO— U' (@toxifyy18) October 23, 2025 -
విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అసీస్తో తొలి వన్డేలో డకౌటైన కోహ్లి.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్లో కూడా అదే తీరును కనబరిచాడు. 4 బంతులు ఎదుర్కొని తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.గిల్ ఔటైన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కింగ్ కోహ్లి.. ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన బార్ట్లెట్ తొలి బంతికి కెప్టెన్ గిల్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత అదే ఓవర్లో ఆఖరి బంతిని కోహ్లికి మిడిల్ స్టంప్ లైన్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సాధించాడు. ఆ బంతిని కోహ్లి ఫ్లిక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కనీ బంతి మాత్రం బ్యాట్కు మిస్స్ అయ్యి ఫ్రంట్ ప్యాడ్కు తాకింది. వెంటనే బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న రోహిత్ శర్మతో చర్చించాక రివ్యూ తీసుకోకుండానే కోహ్లి మైదానం వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రిప్లేలో బంతి మిడిల్ స్టంప్ను హిట్ చేస్తున్నట్లు కన్పించింది.ఇక తన ఇంటర్ననేషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో దారుణ ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లిపై నెటిజన్లు ఫైరవతున్నారు. ఇక నీ పని అయిపోయింది.. లండన్కు బ్యాగ్ సర్దుకో అంటూ పోస్ట్లు పెడుతున్నారు. కాగా అడిలైడ్లో కోహ్లికి మంచి రికార్డు ఉన్నప్పటికి.. ఈ మ్యాచ్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు.ఈ మైదానంలో అతడికి రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా 2027 వన్డే ప్రపంచకప్లో ఆడాలని లక్ష్యం పెట్టుకున్న కోహ్లి ఈ తరహా ప్రదర్శనలు కనబరిచడం అందరిని షాక్కు గురిచేస్తోంది. రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్ను మించిపోయేవాడిని'VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T— cricket.com.au (@cricketcomau) October 23, 2025 -
ఆసీస్తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య రేపు (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్లో విరాట్ 54 పరుగులు చేస్తే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ టెండూల్కర్-18426కుమార సంగక్కర-14234విరాట్ కోహ్లి-14181ఈ మ్యాచ్లో విరాట్ 68 పరుగులు చేస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో (వన్డేలు, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 463 వన్డేల్లో 18426 పరుగులు, ఒకే ఓక టీ20లో 10 పరుగులు సహా 18436 పరుగులు చేయగా.. విరాట్ 303 వన్డేల్లో 14181 పరుగులు, 125 టీ20ల్లో 4188 పరుగులు 18369 చేశాడు.ఈ మ్యాచ్లో విరాట్ సెంచరీ చేస్తే సచిన్ పేరిటే ఉన్న మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. ఏదైనా సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్, సచిన్ల పేరిట సంయుక్తంగా ఉంది. విరాట్ వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. టెస్ట్ల్లో సచిన్ పేరిట 51 శతకాలు ఉన్నాయి.కాగా, టెస్ట్లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. ఆరు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) ప్రస్తుత ఆసీస్ సిరీస్తోనే రీఎంట్రీ ఇచ్చాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడి డకౌటైన విరాట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. రేపు జరుగబోయే రెండో వన్డేలో విరాట్ చెలరేగడం ఖాయమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఈ మ్యాచ్కు వేదిక అయిన అడిలైడ్లో విరాట్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో 2 సెంచరీల సాయంతో 244 పరుగులు చేశాడు. ఈ మైదానంలో మిగతా రెండు ఫార్మాట్లలో కూడా విరాట్కు మంచి రికార్డు ఉంది. 5 టెస్ట్ల్లో 3 సెంచరీలు, ఓ అర్ద సెంచరీ సాయంతో 527 పరుగులు... 3 టీ20ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 204 పరుగులు చేశాడు.రేపటి మ్యాచ్లో విరాట్ 25 పరుగలు చేస్తే అడిలైడ్లో 1000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకుంటాడు. ఇదిలా ఉంటే, పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా మరో 29 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమిండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమయ్యాడు. ఆప్షనల్ సెషన్లో భాగంగా నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చిన హిట్మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బిజీబిజీగా గడిపాడు.అయితే, ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న తర్వాత రోహిత్ శర్మ మైదానాన్ని వీడే క్రమంలో ముభావంగా కనిపించడం చర్చకు దారితీసింది. ఇందుకు ప్రధాన కారణం.. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చర్యలే అని తెలుస్తోంది.అందుకే రోహిత్పై వేటుకెప్టెన్ హోదాలో భారత్కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన 38 ఏళ్ల రోహిత్ శర్మపై యాజమాన్యం ఊహించని రీతిలో వేటు వేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని రోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ ఆసీస్ పర్యటన జట్టు ప్రకటన సందర్భంగా తెలిపాడు.రోహిత్కు ఇష్టం లేకపోయినా..అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డే కెప్టెన్గా కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ బలవంతంగానే రోహిత్ను తప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి.ఓపెనర్గానూ చోటివ్వరా?ఇక ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత్కు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే జట్టులో ఓపెనర్గా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, ఆ స్థానానికీ గంభీర్- అగార్కర్ ఎసరు పెట్టినట్లు తాజా ఊహాగానాల ద్వారా తెలుస్తోంది.ఆసీస్తో రెండో వన్డేకు ముందు అడిలైడ్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వేళ.. గంభీర్, అగార్కర్.. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే రోహిత్ మూడ్ ఆఫ్ అవడానికి కారణమని రెవ్స్పోర్ట్స్ కథనం ద్వారా అర్థమవుతోంది.జైసూతో చర్చలకు అర్థం ఏమిటి?కాగా ఇప్పటికే టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. వన్డేల్లో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. రోహిత్- గిల్ వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న నేపథ్యంలో జైసూకు ఇంత వరకు ఒకే ఒక్క వన్డే ఆడే అవకాశం వచ్చింది.అయితే, తాజాగా ఆసీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో జైస్వాల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేశారు సెలక్టర్లు. కెప్టెన్గా తుదిజట్టులో గిల్ స్థానానికి వచ్చిన ఢోకా లేదు. మరోవైపు.. రోహిత్ కూడా పది కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో గంభీర్, అగార్కర్ జైసూకు ప్రాధాన్యం ఇస్తూ చర్చలు జరపడం.. రోహిత్ అభిమానులను ఆందోళనలోకి నెట్టేసింది.భవిష్యత్తు ప్రణాళికలు అంటూ.. రోహిత్ను జట్టు నుంచే తప్పించి జైస్వాల్ ఆడిస్తారా ఏమిటి? అనే సందేహాలు ఫ్యాన్స్ను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్యూర్ బ్యాటర్ అయిన జైస్వాల్.. నెట్స్లో లెగ్ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. గంభీర్ ఆల్రౌండర్లకే పెద్దపీట వేస్తాడన్న పేరుంది. కాబట్టి తనలోని ఆల్రౌండ్ నైపుణ్యాలతో గంభీర్ను ఆకట్టుకుని తుదిజట్టులో చోటు సంపాదించాలని జైసూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఆప్షనల్ సెషన్కు విరాట్ కోహ్లితో పాటు గిల్ కూడా డుమ్మాకొట్టినట్లు సమాచారం.విఫలమైన రో- కోకాగా ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ ఓవల్ వేదిక. ఇక ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున తొలి వన్డేతో రీఎంట్రీ ఇచ్చిన రో- కో నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులే చేసి అవుట్ కాగా.. కోహ్లి డకౌట్గా వెనుదిరిగాడు. చదవండి: కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్ వైరల్ -
విరాట్ కోహ్లి ‘వదినమ్మ’పై అనుష్క శర్మ కామెంట్.. వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రన్మెషీన్గా పేరొందిన ఈ ఢిల్లీ ఆటగాడు.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గతేడాది పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక సోషల్ మీడియాలో పాతిక కోట్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లి.. కుటుంబానికి సంబంధించి అరుదుగా పోస్టులు పెడుతుంటాడు. వీటిలోనూ ఎక్కువగా భార్య, నటి అనుష్క శర్మ (Anushka Sharma)తో ఉన్న ఫొటోలే పంచుకుంటాడు. కాగా విరుష్క దంపతులు ఇప్పటి వరకు తమ కుమార్తె వామిక (Vamika), కుమారుడు అకాయ్ (Akaay)ల ఫొటోలు కూడా రివీల్ చేయలేదు.కుటుంబంతో కలవరా?ఇదిలా ఉంటే.. విరాట్ కుటుంబంతో అనుష్క శర్మ ఎక్కువగా కలిసినట్లే కనిపించదు. విరాట్ అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి భార్య చేతన కోహ్లి మాత్రం.. కోహ్లి, అతడి పిల్లల గురించి అప్పుడప్పుడూ పోస్టులు పెడుతుంటారు. అయితే, వీరికి సంబంధించిన ఫొటోలను మాత్రం అనుష్క ఎక్కువగా పోస్ట్ చేయదు. కానీ వారి పోస్టులకు లైకులు మాత్రం కొడుతుంది.తోటి కోడలిని ప్రశంసించిన అనుష్కఈ నేపథ్యంలో అనుష్క శర్మ తాజాగా.. తన తోటి కోడలు చేతన కోహ్లిని ప్రశంసిస్తూ ఇన్స్టా స్టోరీ పెట్టడం వైరల్గా మారింది. చేతన యోగాసనంలో ఉన్న ఫొటోను పంచుకున్న అనుష్క .. ‘‘ప్రతి భంగిమలోనూ యోగానే ఈమె ప్రతిబింబిస్తోంది. స్ట్రెంత్, గ్రేస్ అన్నీ తనలో ఉన్నాయి. నిన్ను చూసి గర్విస్తున్నా చేట్స్’’ అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జతచేసింది. 'ఈ పోస్టుకు చేతనను ట్యాగ్ చేయగా.. ఆమె కూడా స్పందించింది. ‘‘కృతజ్ఞతలు అనుష్క.. నాలో ఉన్న గ్రేస్ గుర్తించినందుకు థాంక్యూ’’ అంటూ చేతన హర్షం వ్యక్తం చేసింది. లండన్లోనే నివాసంకాగా కుమారుడు అకాయ్ జన్మించిన తర్వాత విరాట్- అనుష్క లండన్లోనే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్ల కోసం మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు.ఇక ప్రస్తుతం అతడు వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఎనిమిది బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు.చదవండి: రూ. 80 కోట్ల ప్రాపర్టీ అన్నకు ఇచ్చేసిన కోహ్లి.. ట్విస్ట్ ఏంటంటే? -
కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్
దాదాపు ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేసిన దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఊహించని రీతిలో విఫలమయ్యారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఇద్దరూ తేలిపోయారు. ఓపెనర్ రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది ఎనిమిది పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు.కోహ్లి.. తొలిసారి డకౌట్ఎనిమిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి పరుగుల ఖాతా తెరవకుండానే.. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్లో కూపర్ కన్నోలికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తద్వారా ఆసీస్తో వన్డేల్లో కోహ్లి తొలిసారి డకౌట్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో రో- కో వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించిన తీరు చర్చకు దారితీసింది.కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు‘‘వాళ్లిద్దరు ఐపీఎల్ ఆడారు. కాబట్టి రీఎంట్రీ సన్నాహకాల గురించి సందేహాలు అవసరమే లేదు. నాకు తెలిసి వాతావరణం కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్కు వచ్చిన వాళ్ల టాపార్డర్కు ఇలాగే జరిగి ఉండేది.నాలుగైదుసార్ల అంతరాయం తర్వాత బ్యాటింగ్కు వెళితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్లిద్దరు తిరిగి పుంజుకుంటారు’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘వాళ్లిద్దరు అనుభవజ్ఞులైన బ్యాటర్లు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే ముందు ఇద్దరూ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు.ఇప్పుడే వాళ్ల ప్రదర్శను జడ్జ్ చేయడం సరికాదు. ఇటీవలే వాళ్లు టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. ఆ వెంటనే ఈ సిరీస్ ఆడేందుకు వచ్చారు. ఇద్దరూ పూర్తి ఫిట్గా ఉన్నారు. సీనియర్లకు ప్రత్యేకంగా మేము ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని సితాన్షు కొటక్ రోహిత్- కోహ్లిలను వెనకేసుకువచ్చాడు.వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా!అయితే, కొటక్ చెప్పినట్లు రోహిత్- కోహ్లి వర్షం అంతరాయం కలిగించేంత వరకు క్రీజులోనే లేరు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో.. ‘‘వాళ్లిద్దరు అసలు క్రీజులోనే ఉంటేనే కదా.. అంతరాయాల వల్ల డిస్టర్బ్ అవడానికి’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా ఆసీస్- భారత్ మధ్య పెర్త్లో జరిగిన తొలి వన్డేను వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం తమకు విధించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ఆసియా కప్ భారత్దే.. కానీ నా చేతుల మీదుగానే ట్రోఫీ ఇస్తా: నఖ్వీ ఓవరాక్షన్ -
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు
టీమిండియా తరఫున పునరాగమనంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్రంగా నిరాశపరిచారు. చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన రో-కో తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేయగా.. కోహ్లి మరీ ఘోరంగా విఫలమయ్యాడు.ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు కోహ్లి. ఆసీస్తో వన్డేల్లో కోహ్లి ఇలా సున్నా చుట్టడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఆట తీరును విమర్శించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT) నాటి కోహ్లి వైఫల్యాలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నాడు.ఆ వైఫల్యాలే వెంటాడుతున్నాయి.. ఇలా అయితే కష్టంకాగా బీజీటీ టెస్టు సిరీస్లో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడబోయి దాదాపు ఎనిమిదిసార్లు అవుటైన విషయం తెలిసిందే. మరోవైపు.. రోహిత్ కూడా నాటి సిరీస్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఈ ఇద్దరు ఇప్పుడు సరికొత్తగా తిరిగివచ్చారు. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఇక ఫిట్నెస్కు మారుపేరైన కోహ్లి నెట్స్లో చెమటోడ్చి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ ఏకంగా పది కిలోల మేర బరువు తగ్గి మరింత ఫిట్గా తయారయ్యాడు. అయితే, ఇద్దరూ రీఎంట్రీలో విఫలం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..‘‘ఫిట్నెస్ వేరు. మ్యాచ్ ఫిట్నెస్ వేరు. ఆసీస్తో తొలి వన్డేలో పరుగులు రాబట్టేందుకు రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇక విరాట్కేమో బీజీటీ కష్టాలు మళ్లీ తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. అడిలైడ్, సిడ్నీ వన్డేల్లో మాత్రం వీరు కచ్చితంగా లోపాలను అధిగమించి సత్తా చాటుతారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం ఉత్తమంఇక తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు. ‘‘ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించేటపుడు.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటం ఉత్తమం.నేరుగా వెళ్లి మ్యాచ్లు ఆడటం అంటే.. టీమిండియాకు కఠిన సవాలే. అక్కడి పిచ్ పరిస్థితులకు అంత తేలికగా అలవాటుపడలేము. బౌన్సీ పిచ్లు మనల్ని పరీక్షిస్తాయి. మన బౌలర్లు తొలి వన్డేలో సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయలేకపోయారు. ఇకనైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ హితవు పలికాడు.చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి -
244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) తమ అంతర్జాతీయ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు నెలల తర్వాత భారత్ తరపున ఆడిన ఈ సీనియర్ ద్వయం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. కోహ్లి డకౌట్గా వెనుదిరిగారు. బౌన్స్ అండ్ ఫాస్ట్ పెర్త్ పిచ్పై ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడానికి వీరిద్దరూ ఇబ్బంది పడ్డారు. హిట్మ్యాన్ జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో ఓ బౌన్సర్ బంతికి దొరికి పోగా.. స్టార్క్ బౌలింగ్లో డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఇక ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అందరి కళ్లుపై వీరిద్దరి పైనే ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన రో-కో అడిలైడ్లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆడిలైడ్ ఓవల్లో రోహిత్, కోహ్లి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.కోహ్లి రికార్డు అదుర్స్.. ఈ మైదానంలో కోహ్లికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడిన కోహ్లి.. 61.00 సగటుతో 244 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ మైదానంలో అతడు చివరగా 2019లో ఆడాడు. అయితే ఈ ఓవల్ స్టేడియంలోని పిచ్ తొలుత ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించినప్పటికి.. నెమ్మదిగా స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు. కాబట్టి ఈ మ్యాచ్లో కోహ్లి సత్తాచాటే అవకాశముంది. ఈ ఓవల్ మైదానంలో కోహ్లికి టెస్టుల్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 టెస్టులు ఆడిన కింగ్ కోహ్లి.. 52.70 సగటుతో 527 పరుగులు చేశాడు. ఈ చారిత్రత్మక మైదానంలో అతడి పేరిట మూడు టెస్టు సెంచరీలు ఉన్నాయి.రోహిత్.. నో హిట్అయితే ఈ మైదానంలో గత రికార్డులు రోహిత్ శర్మను భయపెడుతున్నాయి. అడిలైడ్లో హిట్మ్యాన్ ట్రాక్ రికార్డు అస్సలు బాగోలేదు. ఇప్పటివరకు ఈ మైదానంలో 6 వన్డేలు ఆడిన ఈ మాజీ కెప్టెన్.. 21.83 సగటుతో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 44గా ఉంది. టెస్టుల్లో కూడా రోహిత్ తన మార్క్ను చూపించలేకపోయాడు.చదవండి: 352 వికెట్లు.. 10,470 రన్స్.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా క్రికెటర్ -
ఆల్ ఫార్మాట్ గ్రేట్గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కమార్ రెడ్డి (Nitish Kumar Reddy)పై భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ప్రశంసలు కురిపించాడు. ఈ ఆంధ్ర ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని పేర్కొన్నాడు.అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాలతో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. ఇప్పటికే టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారాడు. అంతకుముందే టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన ఈ విశాఖ కుర్రాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్తో వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.ఆల్ ఫార్మాట్ గ్రేట్గా టీమిండియా దిగ్గజ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాడు నితీశ్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క్యాప్ నంబర్ 260. నితీశ్ రెడ్డి. నీ ఆటిట్యూడ్, నైపుణ్యాలతో కెరీర్ను గొప్పగా ఆరంభించావు. ఇదే జోరును కొనసాగిస్తే వందకు 110 శాతం.. నువ్వు టీమిండియాతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తావని చెప్పగలను. ఆల్ ఫార్మాట్ గ్రేట్గా ఎదగబోతున్నావని అనిపిస్తోంది. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఫార్మాట్లోనూ ఆడాలన్న నీ కల నెరవేరింది. అందరూ నీకు తోడుగా ఉంటారునీకు జట్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆటగాడిగా నీకేం కావాలో అన్నీ సమకూరుస్తుంది. ఎప్పుడు, ఏం కావాలన్నా అందరూ నీకు తోడుగా ఉంటారు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. గుడ్ లక్. నీ కెరీర్ గొప్పగా ఉండాలి’’ అంటూ రోహిత్ శర్మ నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆసీస్తో తొలి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన నితీశ్ రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున టీ20 మ్యాచ్లు, తొమ్మిది టెస్టులు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టెస్టుల్లో ఎనిమిది, టీ20లలో మూడు వికెట్లు తీశాడు.అపుడు కోహ్లి.. ఇపుడు రోహిత్అదే విధంగా ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ ఖాతాలో టెస్టుల్లో 386, టీ20లలో 90 పరుగులు ఉన్నాయి. కాగా గతేడాది పెర్త్ వేదికగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న 22 ఏళ్ల నితీశ్ రెడ్డి.. తాజాగా అదే వేదిక మీద రోహిత్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం విశేషం. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గిల్ సేనకు ఓటమిఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఇక డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా తమ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అదేంటో.. ఎవరికీ అర్థం కాదు: DLS పద్ధతిపై గావస్కర్ విమర్శలు
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా 26 ఓవర్లకు ఈ మ్యాచ్ను కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యం 131 పరుగులుగా నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి కంగారూలు పనిపూర్తి చేశారు. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది.అదేంటో.. ఎవరికీ అర్థం కాదుఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీఎల్ఎస్ (Duckworth–Lewis–Stern method) పద్ధతి ద్వారా లక్ష్యాలు ఎలా నిర్దేశిస్తారో ఎవరికీ అర్థం కాదని వాపోయాడు. ‘‘ఈ మెథడ్ అందరికీ అర్థం అవుతుందని నేను అనుకోను. అయితే, సుదీర్ఘ కాలంగా ఈ పద్ధతినే వాడుతున్నారు.ఇలా మ్యాచ్లకు వర్షాలు ఆటంకం కలిగించినపుడు.. గతంలో ఓ భారతీయుడు VJD (వి. జయదేవన్ మెథడ్)మెథడ్ను ప్రవేశపెట్టాడు. దేశవాళీ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇదే ఉపయోగించేది. అయితే, ఇప్పుడు ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు.ఇరుజట్లకు సమన్యాయం జరిగేలాఏదేమైనా వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలిగినపుడు.. ఇరుజట్లకు సమన్యాయం జరిగేలా ఉండే పద్ధతులను వాడితే బాగుంటుంది. లక్ష్యం నిర్దేశించేందుకు ప్రామాణికం ఏమిటో వివరించాల్సి ఉంటుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అదే విధంగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆసీస్తో తొలి వన్డేలో విఫలం కావడంపై కూడా గావస్కర్ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘టీమిండియా ఐదు నెలల క్రితమే చాంపియన్స్ ట్రోపీ గెలిచింది. జట్టు బాగుంది.రో- కో ఒక్కసారి ఫామ్లోకి వస్తేరోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదుపరి మ్యాచ్లలో భారీగా పరుగులు రాబట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాన్నాళ్ల తర్వాత వారు మైదానంలో అడుగుపెట్టారు. నెట్స్లో రిజర్వు బౌలర్ల త్రోడౌన్స్ను ఎదుర్కొన్నారు. వాళ్లిద్దరు ఫామ్లోకి వస్తే టీమిండియా 300- 320 పరుగులు చేయగలదు’’ అని గావస్కర్ రో-కోకు మద్దతుగా నిలిచాడు.కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను నయా సారథిగా ఎంపిక చేసింది. ఇక గిల్ ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ వేదిక.చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’ -
నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం (IND vs AUS 1st ODI) పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు గుప్పించాడు.పెర్త్ వన్డేలో భారత తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరుగార్చారని అశూ మండిపడ్డాడు. వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) ఆసీస్తో సిరీస్తో తన ప్రయాణం మొదలుపెట్టాడు. పెర్త్ స్టేడియంలో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.రో- కో ఫెయిల్ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ 8, గిల్ 10 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా విఫలం కాగా.. అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్(10), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు.రాణించిన మిచెల్ మార్ష్వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టీమిండియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 21.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసి.. డీఎల్ఎస్ పద్ధతితో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37), మ్యాట్ రెన్షా (21 నాటౌట్) రాణించారు.Just when #TeamIndia needed it most! @Sundarwashi5 breaks a crucial partnership. 👏#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/6e1VZmbAjz— Star Sports (@StarSportsIndia) October 19, 2025 తేలిపోయిన భారత బౌలర్లువికెట్ తీయడానికి తిప్పలు పడ్డ భారత బౌలర్లలో పేసర్ అర్ష్దీప్ సింగ్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం గురించి అశ్విన్ మాట్లాడుతూ.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు‘‘వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నేను అర్థం చేసుకోగలను. పేస్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్లో డెప్త్ కోసమే. ఇక స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి నితీశ్ను వారికి జతచేశారు.కానీ ఇదేం పద్ధతి?అసలు మీరెందుకు బౌలింగ్పై దృష్టి పెట్టడం లేదు బాస్. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు? ఈ పిచ్పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు.అత్యుత్తమ బౌలర్లను పక్కన పెడతారా?ఏమైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడతారు. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే... బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా! పరుగులు రాబట్టడం బ్యాటర్ల పని. అదనపు బ్యాటర్ కోసం ఆల్రౌండర్లను దించి వారి పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? జట్టులో అత్యుత్తమ బౌలర్లను పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం?కేవలం బ్యాటింగ్ ఆర్డర్ను పొడిగించుకోవడానికి తుదిజట్టు కూర్పు విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి’’ అని అశ్విన్.. టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆసీస్- భారత్ మధ్య గురువారం రెండో వన్డేకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అడిలైడ్ వేదిక.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..!
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగుతున్న తొలి వన్డేలో (India Vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) డకౌటయ్యాడు. 8 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లికి ఇది తొలి డకౌట్.ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 29 మ్యాచ్లు ఆడిన కోహ్లి ఐదు సెంచరీలు, 51కు పైగా సగటుతో పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. చాలా విరామం తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి డకౌట్ కావడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఓవరాల్గా కోహ్లికి వన్డేల్లో ఇది 17వ డకౌట్. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లైన రికార్డు సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది. ఓవరాల్గా ఈ రికార్డు సనత్ జయసూర్య (34) ఖాతాలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్, అనంతరం 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోని సరసన -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోనిల సరసన
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్ల మైలు రాయిని అందుకున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రోహిత్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఈ ఫీట్ అందుకున్న ఐదో భారత క్రికెటర్గా హిట్మ్యాన్ నిలిచాడు.ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు. 38 ఏళ్ల రోహిత్ భారత తరపున ఇప్పటివరకు 274 వన్డేలు, 67 టెస్టులు,159 టీ20లు ఆడాడు. గత ఏడాది జూన్లో టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. నాలుగు నెలల కింద టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఈ ముంబైకర్ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్లో 19,708 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264(వన్డేల్లో)గా ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్ భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.500 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన టీమిండియా ప్లేయర్స్ వీరే👉 సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్లు👉విరాట్ కోహ్లి – 551 మ్యాచ్లు👉ఎంఎస్ ధోని – 535 మ్యాచ్లు👉 రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్లు👉రోహిత్ శర్మ – 500 మ్యాచ్లుచదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు -
రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆతృతగా ఎదురు చూసిన అభిమానులను కింగ్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ డకౌటయ్యాడు. 8 బంతులు ఆడిన కోహ్లి తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్ను చక్కదిద్దుతాడని అంతా భావించారు. కానీ ఈ ఢిల్లీ ఆటగాడు అందరి అంచనాలను తారుమారు చేశాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అతడు ఇబ్బంది పడుతూ కన్పించాడు. వరుసుగా ఏడు బంతుల్లో సింగిల్ రన్ కూడా రాకపోవడంతో విరాట్పై ఒత్తడి పెరిగింది. ఈ క్రమంలో 7 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ తొలి బంతిని ఆఫ్ స్టంప్కు వెలుపుల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని కోహ్లి డ్రైవ్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బ్యాక్వర్డ్ పాయింట్లో కూపర్ కొన్నోలీ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీంతో కోహ్లి డకౌట్గా మైదానాన్ని వీడాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లి డకౌట్ కావడం ఇదే తొలిసారి.అయితే వన్డే ప్రపంచకప్-2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లి.. ఈ తరహా ప్రదర్శనలు కనబరిస్తే భారత జట్టులో చోటు గల్లంతే అని చెప్పుకోవాలి. ఫిట్నెస్ పరంగా అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వరల్డ్కప్ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటివరకు అతడు ఫామ్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నర్థకంగా మారింది. మరోవైపు యువ ఆటగాళ్ల నుంచి కోహ్లి తీవ్ర పోటీ ఎదురు అవుతోంది. దీంతో కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా అతడు సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన రీఎంట్రీలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IND vs AUS: ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగాMitchell Starc gets Virat Kohli. pic.twitter.com/zsdEltOHRe— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2025 -
ఆసీస్తో తొలి వన్డే.. టీమిండియా ఓటమి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.అనంతరం డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్ను విజయతీరాలకు చేర్చారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్7.5వ ఓవర్- 44 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో మాథ్యూ షార్ట్ (8) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్26 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఛేదనను ఆసీస్ ఘనంగా ప్రారంభించింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో హెడ్ రెండు బౌండరీలు బాదాడు. అయితే రెండో ఓవర్లో ఆసీస్కు షాక్ తగిలింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్లో హర్షిత్ రాణాకు క్యాచ్ ఇచ్చి హెడ్ (8) ఔటయ్యాడు. స్వల్ప స్కోర్కే పరిమితమైన భారత్పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్టైమ్ వన్డే కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా19.6వ ఓవర్- 84 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కుహ్నేమన్ బౌలింగ్లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (310 ఔటయ్యాడు. రాహుల్కు (17) జతగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 26 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. భారత్ నాలుగో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్.. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(10), కేఎల్ రాహుల్(0) ఉన్నారు. మరి కాసేపట్లో ఆట మొదలుమరో 10 నిమిషాల్లో ఆట తిరిగి ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ను వర్షం కారణంగా 35 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.మరోసారి వర్షం అడ్డంకి..పెర్త్ వన్డేకు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. భారత్ స్కోర్ 37/3 వద్ద ఉండగా.. వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.11 ఓవర్లకు భారత్ స్కోర్: 35/311 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(6), శ్రేయస్ అయ్యర్(6) ఉన్నారు.వర్షం అటంకి..తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి భారత్ స్కోర్: 25/3.కెప్టెన్ గిల్ ఔట్.. భారత్కు వరుస షాక్లు తగిలాయి. కెప్టెన్ గిల్ ఔట్. ఇన్నింగ్స్లో 10 పరుగులు చేసిన గిల్.. ఇల్లీస్ బౌలింగ్లో ఔటయ్యాడు. కింగ్ కోహ్లీ ఔట్..భారత్ మరో షాక్ తగిలింది. రోహిత్ బాటలోనే కింగ్ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్లో కోహ్లీ.. క్యాచ్ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా13 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(5), రోహిత్ శర్మ(8) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ తరపున నితీశ్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్రౌండర్లతో టీమిండియాకు బరిలోకి దిగింది.మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లు ఫాస్ట్ బౌలర్లగా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు చోటు దక్కలేదు.రోహిత్, విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేశారు. మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్లకు వన్డే క్యాప్లను అందించారు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్ -
ఆసీస్తో తొలి వన్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది.అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్కు ఓ బ్యాడ్ న్యూస్.పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామమే అనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్చదవండి: ప్లే ఆఫ్స్కు చేరిన తెలుగు టైటాన్స్ -
రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్
టీమిండియా వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) విజయశాతం 75. ఆటగాడిగానూ యాభై ఓవర్ల ఫార్మాట్లో హిట్మ్యాన్కు తిరుగులేదు. రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్కప్లో భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్.. ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) గెలిచాడు. రానున్న వన్డే వరల్డ్కప్లోనూ అతడే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని అంతా అనుకున్నారు.పది కిలోల బరువు తగ్గి అందుకు అనుగుణంగానే ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పిన రోహిత్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. తద్వారా తన దృష్టి మొత్తం వన్డేలపైనే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు.. 38 ఏళ్ల రోహిత్ ఇటీవలే పది కిలోల బరువు కూడా తగ్గి మునుపటి కంటే కూడా మరింత ఫిట్గా తయారయ్యాడు.అయితే, అనూహ్య రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థాయంలో యువ ఆటగాడు, టెస్టు సారథి అయిన శుబ్మన్ గిల్కే వన్డే జట్టు బాధ్యతలూ అప్పగించింది. వన్డే వరల్డ్కప్-2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు గిల్తోనూ రోహిత్కు విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.రెండింటికీ చాలా తేడా ఉంటుందిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు శనివారం మీడియాతో మాట్లాడిన గిల్.. ఈ విషయంపై స్పందించాడు. ‘‘బయట మా గురించి జరుగుతున్న ప్రచారానికి, అంతర్గత విషయాలకు చాలా తేడా ఉంటుంది. మా మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ చెరిపివేయలేరు.ఇంతకు ముందు మేమెలా కలిసి ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నాము. అతడు పూర్తి సహాయసహకారాలు అందించే వ్యక్తి. ఇన్నేళ్ల అనుభవం కారణంగా.. నేనేదైనా తప్పు చేసినట్లు భావిస్తే.. నా తప్పులను సరిదిద్దుతాడు. ఒకవేళ నాకు ఆయన సలహాలు అవసరమని భావిస్తే.. తప్పక అడుగుతా.అంతిమ నిర్ణయం నాదేప్రతి ఒక్కరి ఆలోచనలను నేను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా. అలాగే మ్యాచ్ విషయంలో పరిస్థితులకు అనుగుణంగా నేనే అంతిమ నిర్ణయం తీసుకుంటా. రోహిత్ భాయ్, విరాట్ భాయ్తో నాకు మంచి రిలేషన్ ఉంది.నాకు ఏవైనా సందేహాలు వస్తే.. వారి సలహాలు తీసుకుంటా. నాకు సహాయం చేసేందుకు వాళ్లు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. కాగా రోహిత్ పాటు టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఆసీస్తో తొలి వన్డే.. డేంజర్లో సచిన్ వరల్డ్ రికార్డు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి దాదాపు 7 నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా జఆస్ట్రేలియాతో జరుగునున్న తొలి వన్డేలో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి సిద్దమయ్యాడు. మూడు రోజుల కిందట జట్టుతో పాటు ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన విరాట్.. ఈ సిరీస్ కోసం నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్కు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ క్రమంలో తొలి వన్డేకు ముందు కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(100) అగ్రస్ధానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో 51 టెస్టు, 49 వన్డేలు సెంచరీలు సాధించాడు. సచిన్ తర్వాతి స్ధానంలో 82 సెంచరీలతో విరాట్ కోహ్లి రెండో స్దానంలో ఉన్నాడు.ఈ మాజీ కెప్టెన్ వన్డేల్లో 51 శతకాలు సాధించగా.. టెస్టుల్లో 30 సెంచరీలు, టీ20ల్లో ఒకటి బాదాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి, సచిన్ పేరిట సంయుక్తంగా ఉంది. కోహ్లి వన్డేల్లో 51 సెంచరీలు చేయగా.. సచిన్ టెస్టుల్లో 51 శతకాలు చేశాడు. ఈ క్రమంలో పెర్త్ వన్డేలో కోహ్లి శతక్కొడితే.. ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ను అధిగమిస్తాడు. తొలి వన్డేలో సచిన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన రెండు వన్డేల్లోనైనా కోహ్లి ఈ ఫీట్ను అందుకునే ఛాన్స్ ఉంది. కోహ్లికి ఆసీస్ గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు అక్కడ 29 వన్డేలు ఆడిన విరాట్ 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు ఇదే..శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ! -
గిల్, శ్రేయస్ కాదు.. అతడే టీమిండియా లీడింగ్ రన్ స్కోరర్: క్లార్క్
ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా ఆదివారం(అక్టోబర్ 19) జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు భావిస్తున్నాయి. అందు కోసం తమ తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు దాదాపు ఏడు నెలల తర్వాత ఆడనుండడంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టాప్ రన్స్కోరర్ ఎవరు? లీడింగ్ వికెట్ టేకర్ ఎవరు? విజేత ఎవరు? అన్న ఆంశాలపై తమ అంచనాలను మాజీలు వెల్లడిస్తున్నారు. ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ చేరాడు. క్లార్క్ ఇటీవలే Beyond23 క్రికెట్ పోడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్ తరపున ఎవరు టాప్ స్కోరర్గా నిలుస్తారన్న ప్రశ్న క్లార్క్కు ఎదురైంది. అందుకు బదులుగా విరాట్ కోహ్లి(Virat Kohli) పేరును క్లార్క్ చెప్పుకొచ్చాడు."నా అభిప్రాయం ప్రకారం.. ఈ సిరీస్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లిలో ఎవరు ఒకరో నిలుస్తారు. వారికి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అని అనుకుంటున్నారు. కాబట్టి వారు ఈ టూర్ను విజయవంతంగా ముగించే అవకాశముంది.అయితే ఆస్ట్రేలియా పిచ్లో ఓపెనర్గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. అదే మూడు, నాలుగో స్దానంలో బ్యాటింగ్ చేయడం సులభం. ఎందుకంటే బంతి పాతబడి ఉంటుంది, అంతేకాకుండా పిచ్ కూడా బ్యాటర్లకు సహకరించనుంది. కాబట్టి రోహిత్ కంటే కోహ్లికే లీడింగ్ రన్స్కోరర్కే నిలిచే అవకాశాలు ఉన్నాయి" అని క్లార్క్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరును క్లార్క్ చెప్పకపోవడం గమనార్హం. గిల్ కెప్టెన్గా తన తొలి టెస్టు సిరీస్లో ఇంగ్లండ్పై అదరగొట్టాడు. 700 పైగా పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అయితే ఆస్ట్రేలియాపై వన్డేల్లో గిల్కు అంత మంచి రికార్డు లేదు. గిల్ ఇప్పటివరకు 8 వన్డే ఇన్నింగ్స్లలో 35.00 సగటుతో కేవలం 280 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ! -
IND vs AUS: జట్లు, షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా ఆదివారం (అక్టోబరు 19)నాటి మ్యాచ్తో తొలుత వన్డే సిరీస్కు తెరలేస్తుంది. అనంతరం ఆసీస్- భారత్ (IND vs AUS) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు ముహూర్తం ఖరారైంది.ఇందుకోసం ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం!ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ షెడ్యూల్🏏తొలి వన్డే: అక్టోబరు 19 (ఆదివారం)- పెర్త్ స్టేడియం, పెర్త్🏏రెండో వన్డే: అక్టోబరు 23 (గురువారం)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్🏏మూడో వన్డే: అక్టోబరు 25 (శనివారం)- సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఆసీస్- భారత్ వన్డే మ్యాచ్లు ఉదయం 9 గంటలకు ఆరంభంఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్, కాన్బెర్రా🏏రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్🏏మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్ ఓవల్, హోబర్ట్🏏నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్🏏ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్.👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్లు ఆరంభం.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..👉జియో హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం👉టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్స్లో ప్రసారంఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టుఅభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.భారత్తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు (తొలి రెండు మ్యాచ్లకు మాత్రమే)మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
Ro- Ko వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్కప్లో ఆడతారా?: అగార్కర్
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే వరల్డ్కప్-2027 టోర్నమెంట్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం.అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సిరీస్కు జట్లను ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి. రో- కో వన్డే ప్రపంచకప్ ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు.ఆడుతూనే ఉంటాం అనే సందేశంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత కోహ్లి.. ‘‘మీరు ఎప్పుడైతే ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడే నిజంగా మీరు విఫలమైనట్లు’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తద్వారా తాను ఇంకొన్నాళ్లు ఆటలో కొనసాగే అవకాశం ఉందంటూ పరోక్షంగా అగార్కర్కు కౌంటర్ ఇచ్చాడు.మరోవైపు.. 38 ఏళ్ల రోహిత్ శర్మ సైతం ఇటీవలే పది కిలోల బరువు తగ్గి మరింత ఫిట్గా తయారయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా చివరగా టీమిండియా తరఫున బరిలో దిగిన రో-కో.. ఆసీస్తో అక్టోబరు 19 నాటి తొలి వన్డేతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లుఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రో- కో భవితవ్యంపై మరోసారి స్పందించాడు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం వాళ్లిద్దరు జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లు. వరల్డ్కప్నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. యువ ఆటగాళ్లు వీరి స్థానాలను ఆక్రమిస్తారేమో.. చెప్పలేము కదా!.. లేదంటే యువ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కదేమో!ఏదేమైనా రోహిత్- కోహ్లి.. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. ప్రతి మ్యాచ్ తర్వాత వారి ప్రదర్శన గురించి శల్య పరీక్ష చేయడం ఉండదు. వాళ్లు ఆడటం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం.వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్కప్లో ఆడతారా?కేవలం పరుగులు చేయడం కాదు.. ట్రోఫీ గెలవడం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆస్ట్రేలియాలో రోహిత్- కోహ్లి వరుసగా మూడు సెంచరీలు చేసినంత మాత్రాన.. వారు వన్డే వరల్డ్కప్-2027 ఆడతారనే గ్యారెంటీ లేదు కదా!..అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే మా నిర్ణయం ఉంటుంది’’ అంటూ రోహిత్- కోహ్లిలకు మరో మెగా టోర్నీ ఆడే అవకాశం ఇవ్వకపోచ్చని అగార్కర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.అదే సమయంలో తాము సీనియర్ ఆటగాళ్లకు అత్యంత గౌరవం ఇస్తామని.. వారితో జరిగే మా సంభాషణలు బయటకు రావు కాబట్టి బయట అందరూ ఏదో ఊహించుకుంటారని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్తో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ Brace yourselves…they’re 𝘽𝙖𝙘𝙠 𝙄𝙣 𝘽𝙡𝙪𝙚𝙨 🔥 Rohit Sharma 🤝 Virat Kohli 🎥 Watch on loop as the duo gears up for #AUSvIND 💪 #TeamIndia | @ImRo45 | @imVkohli pic.twitter.com/u99yHyFfwJ— BCCI (@BCCI) October 17, 2025 -
IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?
వరల్డ్ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు సమయం అసన్నమైంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్లో తలపడేందుకు ఆస్ట్రేలియా-భారత్ జట్లు సిద్దమయ్యాయి. తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే పెర్త్కు చేరుకున్న భారత్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ఆసీస్ కూడా స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో చెమటోడ్చుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బలబలాలు, గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దం.గిల్ జర్నీ మొదలు.. ఈ సిరీస్తో భారత వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ ప్రయాణం మొదలు కానుంది. రోహిత్ శర్మ స్ధానంలో జట్టు పగ్గాలను గిల్కు సెలక్టర్లు అప్పగించిన సంగతి తెలిసిందే. టెస్టు కెప్టెన్గా తన తొలి టెస్టు సిరీస్లో ఆకట్టుకున్న గిల్.. ఇప్పుడు వన్డే సారథిగా ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియాకప్, విండీస్తో టెస్టు సిరీస్ గెలిచి మంచి జోష్లో ఉన్న భారత్.. అదే జోరును ఆసీస్ గడ్డపై కొనసాగించాలని భావిస్తోంది. గిల్ సేన బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికి.. బౌలింగ్లో మాత్రం చాలా వీక్గా కన్పిస్తోంది.బుమ్రా దూరం.. సిరాజ్పైనే భారంఆసీస్తో వన్డే సిరీస్కు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో మరో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్లో భారత్ పేస్ ధళ నాయకుడిగా సిరాజ్ వ్యవహరించనున్నాడు. అయితే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లలో సిరాజ్కు ఒక్కడికే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది.అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ పేసర్లకు ఆసీస్ పిచ్ల్పై పట్టు లేదు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022లో అర్ష్దీప్ 10 వికెట్లు పడగొట్టినప్పటికి.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో ఎలా రాణిస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మారింది.హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడినప్పటికి వారి స్ధాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. అతడితో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఆసీస్ పిచ్లు ఎక్కువగా పేస్ బౌలర్లు అనుకూలించే అవకాశమున్నందన తుది జట్టులో కుల్దీప్కు చోటు దక్కడం కష్టమే.రో-కోపై అందరి కళ్లు.. భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కన్పిస్తోంది. భారత్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండి ఉన్నది. నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ఆల్రౌండర్లు సైతం జట్టులో ఉన్నారు.కాబట్టి బ్యాటింగ్ పరంగా భారత్కు ఎటువంటి సమస్య లేదు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్కు ఆసీస్ గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ సీనియర్ ద్వయం మరోసారి చెలరేగితే కంగారులకు కంగారు తప్పదు. వీరిద్దరూ దాదాపు 7 నెలల తర్వాత భారత జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యారు. దీంతో అందరి కళ్లు వీరిద్దరిపైనే ఉన్నాయి.ఆసీస్కు గాయల బెడద..కాగా ఈ సిరీస్లో ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకుండా ఆడనుంది. నిజంగా ఇది ఆసీస్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే కమ్మిన్స్కు ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉంది. అతడితో పాటు వెన్ను గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం భారత్తో సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. గ్రీన్ స్దానంలో మార్నస్ లబుషేన్ జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా తొలి వన్డేకు స్టార్ స్పిన్నర్ జంపా, ఇంగ్లిష్ కూడా దూరమయ్యారు. కమ్మిన్స్ లేకపోవడంతో ఆసీస్ బౌలింగ్ విభాగం కూడా కాస్త వీక్గానే కన్పిస్తోంది. మిచెల్ స్టార్, జోష్ హాజిల్వుడ్లతో కూడిన ఆసీస్ బౌలింగ్ యూనిట్ ఫవర్ ఫుల్ భారత బ్యాటింగ్ లైనప్ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే హోమ్ ఎడ్వంటేజ్ ఖచ్చితంగా ఆసీస్కు కలిసిస్తోంది.భారత్కు హెడ్ 'ఎక్'భారత బౌలర్లకు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నుంచి ముప్పు పొంచి ఉంది. టీమిండియాపై వన్డేల్లో ట్రావిస్ హెడ్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్పై 9 వన్డేలు ఆడిన హెడ్.. 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్పై 27 మ్యాచ్లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు. ఇక అతడితో కెప్టెన్ మిచిల్ మార్ష్, మాథ్యూ షార్ట్, అలెక్స్ క్యారీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఏదేమైనప్పటికి ఆసీస్ కంటే భారత్ బ్యాటింగ్ విభాగమే పటిష్టంగా కన్పిస్తోంది.ఆసీస్దే పైయి..భారత జట్టు చివరగా వైట్బాల్ సిరీస్లు ఆడేందుకు 2020-21లో వెళ్లింది. అయితే వన్డే సిరీస్ను 2-1తో టీమిండియా కోల్పోయింది. ఆ సిరీస్లో భారత్ తరపున హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పటివరకు భారత్-ఆసీస్ మధ్య 152 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఆస్ట్రేలియా 84 మ్యాచ్లలో విజయం సాధించగా, భారత్ 58 మ్యాచ్లలో గెలిచింది. 10 మ్యాచ్లు ఫలితంలేకుండా ముగిశాయి.చెత్త రికార్డు..ఆస్ట్రేలియాలో భారత్ జట్టు చెత్త రికార్డు ఉంది. ఆసీస్ గడ్డపై భారత్ 54 వన్డేలు ఆడగా.. కేవలం 14 సార్లు మాత్రమే గెలిచింది. 38 సార్లు ఓడింది, 2 మ్యాచ్లు ఫలితంలేకుండా ముగిశాయి. అక్కడ భారత్ విజయం శాతం సుమారు 25.9% మాత్రమే. -
జోరుగా టీమిండియా సాధన
పెర్త్: దాదాపు ఏడాది క్రితం పెర్త్లోని ఆప్టస్ మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి అజేయ సెంచరీ సాధించాడు. అదే అతని టెస్టు కెరీర్లో చివరి సెంచరీ అయింది. ఇప్పుడు మళ్లీ అదే మైదానానికి వచ్చిన కోహ్లి కొత్త ఉత్సాహంతో కనిపించాడు. ఆసీస్తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధతలో భాగంగా అతను గురువారం సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగుతున్న కోహ్లి సాధనలో బాగా చురుగ్గా పాల్గొన్నాడు. ముందుగా 20 నిమిషాల పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన అతను ఆ తర్వాత 40 నిమిషాలు బ్యాటింగ్పై దృష్టి పెట్టాడు. హర్షిత్ రాణా, అర్‡్షదీప్ సింగ్లతో పాటు స్థానిక ఆటగాళ్లు బౌలింగ్ చేయగా... ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లు ఆడాడు. అతని పక్క నెట్స్లోనే మరో స్టార్ రోహిత్ శర్మ కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఆరంభంలోనే కొద్దిసేపు రోహిత్ తన ఫుట్వర్క్, టైమింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే కుదురుకున్న తర్వాత అతనూ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. సెషన్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో రోహిత్ చాలాసేపు చర్చించడం కనిపించింది. గతంతో పోలిస్తే ఈసారి కోహ్లి, రోహిత్ల వ్యవహార శైలి చాలా ఆసక్తికరంగా కనిపించింది. నెట్స్ వద్దకు అనుమతించిన అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వీరిద్దరు ఆటోగ్రాఫ్లు ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ సమయం గడపడం విశేషం. ఈ ఇద్దరితో పాటు కేఎల్ రాహుల్ కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. గురువారం ఆప్షనల్ ప్రాక్టీస్ డే కాగా... భారత్ నుంచి రెండో బృందంలో వచ్చిన సిరాజ్, కుల్దీప్, అక్షర్ తదితరులు సాధనకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయి జట్టుకు నేడు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, జాయ్ రిచర్డ్సన్ కూడా నెట్స్లో సాధన చేశారు. -
రూ. 80 కోట్ల ప్రాపర్టీ అన్నకు ఇచ్చేసిన కోహ్లి.. ట్విస్ట్ ఏంటంటే?
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం శుభ్మన్ గిల్(Shubman Gill) సారథ్యంలోని భారత జట్టు కంగారుల గడ్డపై అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత బృందంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సైతం ఉన్నాడు. దాదాపు ఆరు నెలల తర్వాత టీమిండియా తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు.ఐపీఎల్-2025 సీజన్ తర్వాత లండన్లో ఉన్న కోహ్లి ఇటీవలే భారత్కు వచ్చాడు. అయితే ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి గురుగ్రామ్ ప్రాపర్టీని తన సోదరుడు వికాస్ పేరుకు బదిలీ చేసినట్టు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. 37 ఏళ్ల విరాట్ ఇటీవలే తన ఆస్తి సంబంధిత పనుల కోసం గురుగ్రామ్లోని వజీరాబాద్ తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. దైనిక్ భాస్కర్’ నివేదిక ప్రకారం.. అతడు గురుగ్రామ్లో ఉన్న తన ఇంటికి సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)ని వికాస్ కోహ్లి పేరిట నమోదు చేసినట్లు సమాచారం.ఒక వ్యక్తి తన ప్రాపర్టీకి చెందిన ఆర్థిక, చట్టపరమైన, వ్యాపార సంబంధిత పనులు చూసుకోవడానికి మరొకరికి అధికారం కల్పించడాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు.కాగా కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ పేరిట గురుగ్రామ్లోని DLF ఫేజ్–1 ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఒకటి ఉంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ.80 కోట్లు పైమాటే. సుమారు 10,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఆ విల్లా.. అద్భుతమైన ఇంటీరియర్స్, వుడ్వర్క్, స్విమ్మింగ్ పూల్, బార్ వంటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడింది.చదవండి: IND vs AUS: జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపాన్ని అక్కడ చూపించేస్తున్నాడు -
Rohit- Kohli: ‘మా అభిమానులకు ఇదే ఆఖరి అవకాశం’
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (IND vs AUS ODIs)తో పునరాగమనం చేయనున్నారు. చాన్నాళ్ల తర్వాత రో- కో తిరిగి వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు.అదే సమయంలో రోహిత్- కోహ్లి వన్డేల నుంచి కూడా త్వరలోనే రిటైర్ అవనున్నారనే వార్త ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఆసీస్తో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.హామీ ఇవ్వలేదువన్డే కెప్టెన్గా రోహిత్పై వేటు వేసి.. శుబ్మన్ గిల్ (Shubman Gil)కు పగ్గాలు అప్పగించడంపై స్పందిస్తూ.. ‘‘వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు.. రో- కో ఈ మెగా ఈవెంట్లో ఆడతామని హామీ ఇవ్వలేదు’’ అంటూ రిటైర్మెంట్ ఊహాగానాలకు అగార్కర్ ఊతమిచ్చాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. టీమిండియా టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆస్ట్రేలియాలోని అభిమానులకు ఇది ఆఖరి అవకాశమని కమిన్స్ అన్నాడు.ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్కు ఇదే ఆఖరు‘‘ నిస్సందేహంగా వారిద్దరు ఆటలో చాంపియన్లు. వారితో మేం ఆడినప్పుడల్లా అభిమానులు మ్యాచ్లు చూసేందుకు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. గత 15 ఏళ్లలో వారిద్దరు భారత్ ఆడిన ప్రతీ సిరీస్లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్కు వారి ఆటను చూడటం ఇదే ఆఖరిసారి కావచ్చు’’ అని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.కమిన్స్ లేకుండానేకాగా వెన్ను నొప్పితో బాధపడుతున్న కమిన్స్ టీమిండియాతో సిరీస్లలో ఆడటం లేదన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో.. ఆసీస్ టీ20 సారథి మిచెల్ మార్ష్.. వన్డే జట్టును కూడా ముందుకు నడిపించనున్నాడు. ఇక అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టులకు కూడా రోజుల వ్యవధిలో రో- కో గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్లు.. ఐపీఎల్లోనూ అభిమానులను అలరిస్తున్నారు.చదవండి: IND vs AUS: వన్డే సిరీస్కు ముందు.. విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్ -
ఆసీస్ టూర్ తర్వాత రిటైర్మెంట్.. !? విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన కోహ్లి.. మళ్లీ ఇప్పుడు ఏడు నెలల తర్వాత భారత జెర్సీలో కన్పించనున్నాడు. ఈ నెల 19 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.కాగా ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో ఈ మాజీ కెప్టెన్ వన్డే ప్రపంచకప్-2027లో ఆడుతాడా లేదా? అన్నది సగటు క్రికెట్ అభిమాని మొదడను తొలుస్తున్న ప్రశ్న. రోహిత్, కోహ్లి వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ మెగా టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే ఏమి చెప్పలేమని అగార్కర్ చెప్పుకొచ్చాడు. అయితే వన్డే ప్రపంచకప్లో ఆడాలంటే ఖచ్చితంగా దేశవాళీ టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో పాల్గోవల్సేందేనని మాత్రం అగార్కర్ తెల్చి చేప్పేశాడు. కానీ రో-కో ద్వయం విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతారో లేదో మాత్రం తెలియదు. అయితే దేశవాళీ టోర్నమెంట్లలో ఆడకపోయినా వారిద్దరని వన్డే ప్రపంచకప్నకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ టూర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో కోహ్లి చేసిన ట్విట్ వైరలవుతోంది. "ఎప్పుడైతే మీరు ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడు మీరు నిజంగా విఫలమైనట్లే" ఎక్స్లో కోహ్లి రాసుకొచ్చాడు. దీంతో కింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కోహ్లి రాబోయో వన్డే ప్రపంచకప్లో ఆడుతాడని ఫిక్స్ అయిపోతున్నారు.ఆసీస్తో సిరీస్కు భారత వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్, ధ్రువ్ జురెల్, జైశ్వాల్చదవండి: పిరికిపందల్లారా!.. చిన్న పిల్లాడు.. వదిలేయండిరా!: టీమిండియా స్టార్ ఫైర్ -
ఎలా ఉన్నావు హీరో!
న్యూఢిల్లీ: దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుతో చేరారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగలేదు. టెస్టు లేదా టి20 జట్టు సభ్యులుగా ఉన్న ఇతర ప్లేయర్లు కలిసి ఆడుతూ బిజీగా ఉండగా వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లి మాత్రం టీమ్కు దూరంగా ఉన్నారు. వన్డే, టి20ల సిరీస్ల కోసం బుధవారం భారత జట్టు రెండు బృందాలుగా ఆ్రస్టేలియాకు బయల్దేరి వెళ్లింది. మొదటి బృందంలో రోహిత్, కోహ్లి, శ్రేయస్, కెపె్టన్ శుబ్మన్ గిల్ తదితరులు ఉన్నారు. ఎలా ఉన్నావు హీరో?ఈ సందర్భంగా రోహిత్, గిల్ భేటీ ఆసక్తిని సంతరించుకుంది. తన స్థానంలోనే గిల్ను సెలక్టర్లు వన్డే కెప్టెన్ గా నియమించగా... గిల్ నాయకత్వంలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. టూర్కు వెళ్లేందుకు ఆటగాళ్లంతా ఒకే చోటికి చేరే క్రమంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రోహిత్ను చూసిన గిల్ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే రోహిత్ కూడా ‘ఎలా ఉన్నావు హీరో’ అంటూ ఆత్మీయంగా పలకరించాడు. టీమ్ బస్సులోకి వెళ్లాక మొదటి సీటులోనే కూర్చున్న కోహ్లికి కూడా గిల్ అభివాదం చేయగా... దానికి బదులిచ్చిన కోహ్లి కెపె్టన్ భుజం తట్టి అభినందించాడు. జట్టు సహచరుల్లో కనిపించిన చిరునవ్వులు అందరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించాయి. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 5 టి20లు ఆడుతుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. 𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝘿𝙤𝙬𝙣 𝙐𝙣𝙙𝙚𝙧 ✈️Of familiar faces and special reunions as #TeamIndia depart for the Australia challenge 😍#AUSvIND pic.twitter.com/ElV3OtV3Lj— BCCI (@BCCI) October 15, 2025 -
IND-AUS XI: కోహ్లి, రోహిత్కు నో ప్లేస్..!
టెస్ట్ల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ (Pat Cummins) ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ రిహాబ్లో ఉన్నాడు. కమిన్స్ జులైలో వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఆతర్వాత ఆసీస్ ఆడిన అన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. త్వరలో భారత్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా ఎంపిక కాలేదు. నవంబర్లో జరిగే యాషెస్ సిరీస్లో తొలి టెస్ట్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్తో జరుగబోయే వన్డే సిరీస్కు ముందు కమిన్స్ వార్తల్లో నిలిచాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అతన్ని భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కూడిన ఆల్టైమ్ వన్డే జట్టును (Cummins All Time India Vs Australia ODI XI) ఎంపిక చేయమని అడిగారు.కమిన్స్ ఆశ్చర్యకరంగా వన్డేల్లో ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్లైన విరాట్ కోహ్లి (Virat kohli), రోహిత్ శర్మను (Rohit Sharma) ఎంపిక చేయలేదు. కమిన్స్ ఛాయిస్కు క్రికెట్ అభిమానులంతా షాకయ్యారు. కోహ్లి, రోహిత్ను ఎంపిక చేయని కమిన్స్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోని, భారత క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ను తన ఆల్టైమ్ ఫేవరెట్ వన్డే జట్టుకు ఎంపిక చేశాడు.ఈ జట్టులో కేవలం ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే చోటు కల్పించిన కమిన్స్.. ఎనిమిది మంది ఆస్ట్రేలియన్లకు అవకాశం ఇచ్చాడు. డేవిడ్ వార్నర్ను సచిన్కు జోడీగా ఓపెనర్గా ఎంపిక చేసిన కమిన్స్.. ఆతర్వాత వరుసగా రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవన్కు మిడిలార్డర్లో చోటు కల్పించాడు.వికెట్కీపర్ బ్యాటర్గా ధోనికి అవకాశం ఇచ్చిన కమిన్స్.. జహీర్ ఖాన్తో పాటు స్పెషలిస్ట్ పేసర్లుగా తన దేశానికే చెందిన గ్లెన్ మెక్గ్రాత్, బ్రెట్ లీకు చోటు కల్పించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా దివంగత షేన్ వార్న్ను ఎంపిక చేశాడు.కమిన్స్ ఆల్టైమ్ బెస్ట్ ఇండియా, ఆస్ట్రేలియా మిక్స్డ్ వన్డే టీమ్..డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవాన్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, బ్రెట్ లీ, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్గ్రాత్చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ -
గంభీర్ లేకుండానే!.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ ఆస్ట్రేలియాకు..
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. తొలి బ్యాచ్లో భాగంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తదితరులు కంగారూ దేశానికి బయల్దేరారు.వీరితో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఆ సమయంలో కొంత మంది సహాయక సిబ్బంది కూడా ఆటగాళ్ల వెంట ఉన్నారు.Team India off to Australia ✈️ pic.twitter.com/FCpqxYjTSI— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025గంభీర్ లేకుండానే..అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్ లేకుండానే తొలి బ్యాచ్తో వెళ్లడం లేదు. రెండో బ్యాచ్తో కలిసి అతడు సాయంత్రం ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నట్లు సమాచారం. ఇక టీమ్ బస్లో రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో కూర్చోగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Virat Kohli with Team India at Airport left for Australia. pic.twitter.com/ZJ6Wb80hPC— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025 కాగా స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులను 2-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. అక్టోబరు 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలుపెట్టనుంది. ఈ సిరీస్కు ముందే వన్డే సారథిగా రోహిత్ను తప్పించిన బీసీసీఐ.. గిల్కు కెప్టెన్సీ అప్పగించింది.కెప్టెన్సీ మార్పు వెనుకఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు వెనుక గంభీర్ హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్- కోహ్లి చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడారు. ఈ మెగా టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు.ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున రో- కో తొలిసారి ఆస్ట్రేలియాతో వన్డేల సందర్భంగా బరిలోకి దిగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఫిట్గా ఉన్న ఈ ఇద్దరు కంగారూ గడ్డపై సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారా?కాగా 37 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల కోహ్లి వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారో లేదోనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్గా ఉన్న ఈ ఇద్దరు తప్పక మెగా టోర్నీ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. వీరిద్దరి విషయంలో మేనేజ్మెంట్ వైఖరిపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐpic.twitter.com/BZLAUZArJP— Ro³ (@45__rohan) October 15, 2025 -
BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma)ల అంతర్జాతీయ క్రికెట్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఇద్దరూ ఐదు రోజుల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించారు.వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపుఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పెద్దల వైఖరితో నొచ్చుకున్న రో- కో ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కూ వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు. అయితే, ఊహించని రీతిలో రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది బీసీసీఐ.దేశీ టోర్నీలు కూడా ఆడాలిఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు రోహిత్ స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించింది. వన్డే వరల్డ్కప్-2027ను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా రో- కో వన్డే వరల్డ్కప్ వరకు కొనసాగుతారనే హామీ కూడా లేదని చెప్పాడు. అంతేకాదు.. అవసరమైతే ఈ ఇద్దరు దేశీ టోర్నీలు కూడా ఆడాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు.రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి వన్డేలకూ త్వరలోనే గుడ్బై చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసీస్తో జరిగే వన్డే సిరీస్ వీరి అంతర్జాతీయ కెరీర్లో చివరిదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.స్పందించిన బీసీసీఐఢిల్లీలో మంగళవారం వెస్టిండీస్తో రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించిన అనంతరం రాజీశ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు.వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్- కోహ్లికు ఆసీస్ సిరీస్ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.ఇద్దరూ ఇద్దరేకాగా వన్డేల్లో కోహ్లి, రోహిత్లకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో 51 సెంచరీలతో కోహ్లి ప్రపంచ రికార్డు సాధిస్తే.. రోహిత్ వన్డే ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది వీరిద్దరు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలవడంలో తమ వంతు పాత్ర పోషించారు.అంతేకాదు 2025లో రోహిత్ ఇప్పటికి 8 వన్డేల్లో ఓ సెంచరీ సాయంతో 302 పరుగులు చేయగా.. కోహ్లి ఏడు ఇన్నింగ్స్ ఆడి 275 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 36 ఏళ్ల కోహ్లి ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. 37 ఏళ్ల రోహిత్ ఇటీవల పది కిలోలు తగ్గి మరింత ఫిట్గా తయారయ్యాడు. కాబట్టి ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా వీరిద్దరు ఇప్పట్లో రిటైర్ కాకపోవచ్చని చెప్పవచ్చు.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే -
‘ప్రపంచకప్ టోర్నీకి చాలా సమయం ఉంది’
న్యూఢిల్లీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సిరీస్ ఫలితంకంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్తోనే బరిలోకి దిగుతున్న వీరిద్దరు ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయి ఒక్క వన్డేలే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈనేపథ్యంలో తాజా చర్చపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పటికిప్పుడు వారిద్దరి భవిష్యత్తుపై తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. ‘వన్డే వరల్డ్కప్కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టి భవిష్యత్తుకంటే ప్రస్తుతంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తా. వారిద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో సందేహం లేదు. పునరాగమనం చేస్తున్న వారి అనుభవం ఆ్రస్టేలియాలో పనికొస్తుంది. వీరిద్దరు బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పాడు. గిల్కు కెప్టెన్సీ అర్హత ఉంది... భారత టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా, అర్హత శుబ్మన్ గిల్కు ఉన్నాయని, ఈ హక్కును అతను సాధించుకున్నాడని గంభీర్ ప్రశంసించాడు. ‘కెప్టెన్గా గిల్ను నియమించి ఎవరూ ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్లో అతి కఠినమైన పర్యటనల్లో ఇంగ్లండ్ ఒకటి. అలాంటి చోట ఐదు టెస్టులూ గట్టిగా నిలబడి సిరీస్ను సమం చేసుకోగలగడం చిన్న విషయం కాదు. బ్యాటింగ్లోనూ అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థంగా నడిపి వన్డేల్లోనూ సారథి కాగల హక్కును అతను సాధించాడు’ అని గంభీర్ అన్నాడు. 2027 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరమని, వరుసగా విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అతను స్పష్టం చేశాడు. భారత జట్టు నవంబర్ 9న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడనుండగా... నవంబర్ 14 నుంచి కోల్కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతుంది. అయితే ప్రొఫెషనల్ క్రికెటర్లు తక్కువ సమయంలో పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోగలరని విశ్వాసం వ్యక్తం చేసిన గంభీర్... టెస్టు టీమ్లో మాత్రమే సభ్యులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని సూచించాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ గెలవడం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే భారత్లో కూడా పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే విధంగా బౌన్సీ పిచ్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణాపై అనవసర విమర్శలు... భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ వరుసగా అవకాశాలు పొందుతున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణాపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభావంతుడు కాకపోయినా... ఢిల్లీకి చెందినవాడు కావడంతో పాటు గంభీర్ ఐపీఎల్ టీమ్ కేకేఆర్కు మెంటార్గా ఉన్న సమయంలో సాన్నిహిత్యం వల్లే రాణాకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇటీవల ఇదే మాట అన్నాడు. తాజా విమర్శలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఈ వివాదంలో హర్షిత్కు అతను పూర్తి మద్దతు పలికాడు. ‘యూట్యూబ్లో వ్యూస్ కోసం కొందరు ఒక 23 ఏళ్ల యువ ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నందుకు సిగ్గుపడాలి. రాణా తండ్రి మాజీ క్రికెటర్ కాదు. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కానీ ఎన్ఆర్ఐ కానీ కాదు. అతను తన ప్రతిభను నమ్ముకొనే క్రికెట్ ఆడుతున్నాడు. ఒక ఆటగాడి ప్రదర్శన బాగా లేకుండా విమర్శించవచ్చు కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా. కావాలంటే నన్ను విమర్శించండి. నేను దానిని భరించగలను. కానీ 23 ఏళ్ల ఆటగాడిపై ఇది మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా. భారత క్రికెట్ జట్టు ఎవరిదో సొంత ఆస్తి కాదు. మన జట్టు గెలవాలని భావించే అందరిది ఈ జట్టు అని మర్చిపోవద్దు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
‘ఆస్ట్రేలియాలో కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు’
వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియా (India Tour Of Australia 2025)లో పర్యటించనుంది. కంగారూ జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 19 నుంచి టీమిండియా ఆసీస్ టూర్ ప్రారంభం కానుండగా... దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నారు.అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాకు ఆడిన రో- కో.. ఆ తర్వాత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక గతేడాదే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు కూడా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు మేటి బ్యాటర్లు.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు.ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలోఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్గా రోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలో మాజీ కెప్టెన్లు రోహిత్- కోహ్లి కలిసి ఆడనున్నారు.కాగా రోహిత్పై వేటు వేసిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లి వన్డే వరల్డ్కప్-2027 ఆడటం గురించి తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రో-కో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో నాలుగైదేళ్లు ఢోకా లేదు‘‘దయచేసి విరాట్ ఫిట్నెస్ గురించి ఎవరూ ఏమీ అడగకండి. ఫిట్నెస్ విషయంలో అతడొక గురు. అతడు ఏం చేసినా మిగతా వాళ్లు ఫాలో అయిపోతారు. కాబట్టి విరాట్ కోహ్లి ఫిట్నెస్ గురించి మనమేమీ ఆందోళన పడాల్సిన పనిలేదు.అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం అతడి కంటే ఫిట్గా ఉన్న మరొక ప్లేయర్ ఎవరూ లేరు. అయితే, కోహ్లి బ్యాట్చేతపట్టి ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని నేను ఎదురుచూస్తున్నా.చాలా రోజులుగా అభిమానులతో పాటు నేనూ అతడి ఆటను మిస్సవుతున్నాను. వన్డేల్లో కోహ్లి ఇంకా ఎంతో సాధించగలడు. ఇంకొన్నేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. కనీసం మరో నాలుగైదేళ్లు కోహ్లి వన్డేలు ఆడతాడని నేను నమ్ముతున్నా.కేవలం ఆడటమే కాదు.. తనదైన శైలిలో ఆధిపత్యం కూడా చూపిస్తాడని విశ్వసిస్తున్నా. ఆస్ట్రేలియాలో అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా. ఇక రోహిత్ విషయంలోనూ నేను ఇదే చెప్తా.కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడుఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు భారీ స్కోర్లు సాధించి టీమిండియాను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా కోహ్లికి ఇష్టమైన ప్రత్యర్థి. మూడు వన్డేల్లో కలిపి అతడు కనీసం రెండు శతకాలైనా బాదుతాడని అనుకుంటున్నా’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య వన్డే, టీ20 సిరీస్లు జరుగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్ -
కింగ్ కోహ్లి వచ్చేశాడు..!
భారత క్రికెట్ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) భారత్లో (ఢిల్లీ) ల్యాండయ్యాడు. విరాట్ గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి లండన్లో ఉంటున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కోహ్లి భారత్కు రావడం ఇదే మొదటిసారి.THE AURA OF KING KOHLI..!!!! 🐐- The Arrival of Virat Kohli at home in Delhi. 👑pic.twitter.com/fevrsiSB7L— Tanuj (@ImTanujSingh) October 14, 2025ఇవాళ (అక్టోబర్ 14) ఉదయం కోహ్లి న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం స్వల్ప తోపులాట కూడా జరిగింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణg మార్మోగిపోయింది. ప్రస్తుతం ఎక్స్లో #ViratReturns అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే సిరీస్ కోసం కోహ్లి ఢిల్లీ నుంచి బయల్దేరతాడు. విరాట్తో పాటు రోహిత్ శర్మ కూడా వెళ్తాడని సమాచారం. మిగతా సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే మ్యాచ్లు అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో జరుగనున్నాయి.విరాట్ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లికి ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ తర్వాత కోహ్లి భవిష్యత్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ (ఆసీస్ సిరీస్ తర్వాత) ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్పై గంభీర్ ఫైర్ కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్ల ఆట చూసేందుకు అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోహ్లి, రోహిత్ల నుంచి భారీ ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ఓ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో (WTC) 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 12) మొదలైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్లో 23 పరుగులు చేసి ఔటైన బాబర్.. 2 పరుగుల వద్ద 3000 పరుగుల మైలురాయిని తాకాడు. గత మూడేళ్లుగా విఫలమవుతున్నా బాబర్ ఈ ఘనత సాధించడం విశేషం. బాబర్ కంటే అన్ని విభాగాల్లో బలమైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా డబ్ల్యూటీసీలో 3000 పరుగుల మైలురాయిని తాకలేకపోయారు.ఆసియాలో అత్యధిక డబ్ల్యూటీసీ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాబర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాబర్కు అతి సమీపంగా టీమిండియా ఆటగాళ్లు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. కోహ్లి, రోహిత్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి, బాబర్ను ఈ విభాగంలో అధిగమించే అవకాశం వారికి లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019లో పరిచయమైన విషయం తెలిసిందే.డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-6 ఆసియా బ్యాటర్లుబాబర్ ఆజమ్- 3021శుభ్మన్ గిల్- 2826రిషబ్ పంత్- 2731రోహిత్ శర్మ- 2716కరుణరత్నే- 2642విరాట్ కోహ్లి- 2617డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-8 బ్యాటర్లుజో రూట్- 6080స్టీవ్ స్మిత్- 4278మార్నస్ లబూషేన్- 4225బెన్ స్టోక్స్- 3616ట్రవిస్ హెడ్- 3300ఉస్మాన్ ఖ్వాజా- 3288జాక్ క్రాలే- 3041బాబర్ ఆజమ్- 3021పాకిస్తాన్-సౌతాఫ్రికా మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. లాహోర్లోని గడాఫీ స్టేడియం ఈ మ్యాచ్ ఇవాళ ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.పాక్ ఇన్నింగ్స్లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్లో ఉన్నారు.మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
శుబ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్మన్ రికార్డు బ్రేక్
ల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన గిల్.. 177 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.గిల్కు ఇది తన కెరీర్లో పదో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్పై నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసిన గిల్, ఇప్పుడు విండీస్పై కూడా అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అతడి సంచలన బ్యాటింగ్ ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 518 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అతడితో పాటు జైశ్వాల్(175) సూపర్ సెంచరీతో మెరిశాడు. కాగా సెంచరీతో సత్తాచాటిన గిల్ రికార్డుల మోత మోగించాడు.గిల్ రికార్డుల పంట..ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ హిస్టరీలో ఇప్పటివరకు 71 మ్యాచ్లు ఆడిన గిల్ 2826 పరుగులు సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(2731) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో పంత్ను గిల్ అధిగమించాడు.కెప్టెన్గా అత్యంత వేగంగా 5 టెస్ట్ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్గా శుబ్మన్ నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ను అధిగమించాడు. బ్రాడ్మన్ ఈ ఫీట్ సాధించడానికి 13 ఇన్నింగ్స్లు అవసరమవ్వగా.. గిల్ కేవలం కేవలం 12 ఇన్నింగ్స్లలోనే నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో అలిస్టర్ కుక్(9), గవాస్కర్(10) తొలి రెండు స్దానాల్లో ఉన్నాడు.ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. కోహ్లి 2017, 2018లో చెరో ఐదు సెంచరీలు చొప్పున చేశాడు. ఇప్పుడు ఈ ఏడాదిలో గిల్కు ఇది ఐదో టెస్టు సెంచరీ. 2025లో గిల్ మరో సెంచరీ సాధిస్తే కోహ్లి ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.చదవండి: IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్.. -
శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో మెరిశాడు. 177 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.ఆరునెలలు తిరిగే లోపేఅంతేకాదు.. ఈ ఏడాది గిల్కు ఐదో టెస్టు శతకం. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. 2017, 2018లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇక టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టి ఆరునెలలు తిరిగే లోపే గిల్ ఈ ఫీట్ సాధించడం మరో విశేషం.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025ఇంగ్లండ్ పర్యటనలో నాలుగుకాగా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్థానంలో గిల్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల్లో భాగంగా గిల్ నాలుగు శతకాలు బాదాడు.అంతేకాదు ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 269 పరుగులు సాధించి.. ఈ వేదిక మీద డబుల్ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో అహ్మదాబాద్లో తొలి టెస్టు జరుగగా.. భారత్.. విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అనంతరం ఢిల్లీ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్తొలిరోజు రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన భారత జట్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద ఉన్న వేళ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. గిల్ 196 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175) భారీ శతకం సాధించగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (87) గొప్పగా రాణించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38, ఆల్రౌండర్ నితీశ్ కుమార్రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ జొమెల్ వారికన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
నాలో దూకుడు అలాగే ఉంది.. కానీ: గంభీర్ కామెంట్స్ వైరల్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇప్పటికీ దూకుడు అలాగే ఉందని.. మైదానంలో తనను తాను ఇలా ఆవిష్కరించుకోవడం తన సహజమైన భావోద్వేగం అని తెలిపాడు. అయితే, వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వాళ్ల కోసం కొన్నిసార్లు తనను తాను సంభాళించుకుంటున్నానని తెలిపాడు.కోహ్లితోనూ గొడవటీమిండియాకు ఆడిన రోజుల్లో గంభీర్ ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో క్రికెట్ ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవాడు. అంతేకాదు.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తోనూ.. ఈ వరల్డ్కప్ విన్నర్ గొడవ పడిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ‘ఢిల్లీ బాయ్స్’ గంభీర్- కోహ్లి రెండుసార్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పాత పగలు పక్కనపెట్టి కోహ్లితో కలిసిపోయాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్వయంగా వీరిద్దరు చెప్పడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్స్కు తెరపడింది.ఎప్పుడూ గంభీరంగానేఇక గంభీర్ డగౌట్లోనూ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడి ముఖంలో అమావాస్యకో.. పున్నమికో గానీ నవ్వు కనిపించదు. ఎప్పుడూ సీరియస్గా ఉండే గంభీర్పై ఈ విషయంలో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.నేను మారలేదుఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గౌతం గంభీర్ తన వ్యవహారశైలి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాలో ఇప్పటికీ ఆ దూకుడు అలాగే ఉంది. నేను మారలేదు. అగ్రెసివ్గా ముందుకు వెళ్లాలనుకున్నపుడు గొడవ పడటమే నాకు ముందుగా గుర్తుకువస్తుంది.ఇంట్లో పిల్లలు ఉన్నారుఅయితే, వయసు పెరిగింది కాబట్టి.. నా మనసు.. ‘ఇంట్లో పిల్లలు ఉన్నారు’ కదా అని హెచ్చరిస్తుంది’’ అంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉంది.రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. శుక్రవారం మొదలుపెట్టిన రెండో టెస్టులోనూ జోరు కనబరుస్తోంది. టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా గంభీర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. టీమ్ డిన్నర్ఇక ఈ మ్యాచ్కు ముందు గౌతీ తన ఇంట్లో టీమిండియాకు డిన్నర్పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా,ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ సహా కోచ్లు ర్యాన్ టెన్ డష్కాటే, మోర్నీ మోర్కెల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గంభీర్ పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్కు పగ్గాలు అప్పగించడంపై గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గౌతీ టీమ్ డిన్నర్ ఇవ్వడం గమనార్హం. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
విండీస్తో రెండో టెస్ట్.. అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతను అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 71 ఇన్నింగ్స్ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) (68 ఇన్నింగ్స్లు) జైస్వాల్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 51 ఓవర్లలో తర్వాత వికెట్ నష్టానికి 198 పరుగులు చేసింది. జైస్వాల్ 145 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సాయి సుదర్శన్ (58) క్రీజ్లో ఉన్నాడు.అంతకుముందు కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్కు దక్కింది. అతడి బౌలింగ్లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా -
దేశవాళీ క్రికెట్లో కోహ్లి, రోహిత్!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడనుండగా... దానికి ముందు ఈ ఇద్దరు స్టార్లు విజయ్ హజారే ట్రోఫీలో కనీసం మూడు మ్యాచ్లు ఆడే అవకాశాలున్నాయి. టెస్టు, టి20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు... కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం భారత జట్టు వన్డేలు ఆడకపోగా... ఆస్ట్రేలియాతో పర్యటన కోసం రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు అప్పగించి... కోహ్లి, రోహిత్ను ప్లేయర్లుగా ఈ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తుండగా... ఆలోపు టీమిండియా ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడేది లేకపోవడంతో... ఫామ్, ఫిట్నెస్ కాపాడుకు నేందుకు దేశవాళీల్లో ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం. ‘జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న ప్రతీ ఆటగాడు అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీల్లో ఆడాల్సిందే’అని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఇద్దరు బరిలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. ‘డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికా తో టీమిండియా చివరి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మధ్య దాదాపు ఐదు వారాల సమయం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభమవుతుంది. కివీస్తో సిరీస్కు ముందు ముంబై, ఢిల్లీ జట్లు విజయ్ హజారేలో ఆరేసి మ్యాచ్లు ఆడనున్నాయి. వాటిలో కనీసం మూడిట్లో రోహిత్, కోహ్లి ఆడొచ్చు’ అని బోర్డు అధికారి వెల్లడించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచాడు. ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్ ‘ఎ’ మ్యాచ్లు, విజయ్ హజారే వంటి టోర్నీల్లో ఆడుతూ ఫామ్ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నాడు. -
టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!.. రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..
ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్ సేన భారత్ నుంచి ఆసీస్కు పయనం కానున్నట్లు సమాచారం.టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!అయితే, అంతకంటే ముందు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ టూర్కు ముందు... వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుబ్మన్ గిల్ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.అయితే, రోహిత్ను ఓపెనర్గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- హెడ్కోచ్ గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్కు మద్దతుగా నిలుస్తున్నారు.రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్.. గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్. చదవండి: టీమిండియాతో సిరీస్లకు ఆసీస్ జట్ల ప్రకటన -
అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) విషయంలో అగార్కర్కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు.. ముఖ్యంగా కోహ్లి.. అగ్కార్ను తప్పక ఓడించితీరతాడని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. రో- కో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. బీసీసీఐ ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకుంది.శుబ్మన్ గిల్కు పగ్గాలుఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గా తప్పించి.. శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్ వన్డే సారథిగా తన ప్రయాణం మొదలుపెడతాడని వెల్లడించింది. ఇక ఈ జట్టులో రోహిత్, కోహ్లి ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.రో- కోకు పరోక్షంగా వార్నింగ్ఇక రోహిత్పై వేటు వేయడం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రో- కో వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతారని గ్యారెంటీ లేదని పేర్కొన్నాడు. అందుకే గిల్ను కెప్టెన్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్కప్ నాటికి జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడకతప్పదని రో- కోకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.అగార్కర్కు అవమానకర ముగింపు తప్పదుఈ విషయం గురించి స్టీవ్ హార్మిసన్ తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ.. చివరికి అగార్కర్ అవమానకరమైన ముగింపు తప్పదని భావిస్తున్నా. ఈ పోటీలో మాజీ కెప్టెన్లు గెలుస్తారా? లేదంటే మాజీ ఆల్రౌండర్దే గెలుపా? అంటే.. కచ్చితంగా ఆ ఇద్దరే గెలుస్తారని అనుకుంటున్నా.అలా కాకుండా కేవలం కోహ్లి- శర్మలను రెచ్చగొట్టడానికి.. వారిని ఎలాగైనా వరల్డ్కప్లో ఆడించాలనే ఉద్దేశంతో అగార్కర్ ఈ మాటలు అంటే అది వేరే సంగతి. నిజంగా అదొక మంచి విషయమే అవుతుంది. అలా కాకుండా వారి గురించి ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.కోహ్లి మాత్రం కచ్చితంగా..రోహిత్ కంటే కోహ్లికి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. రోహిత్ కోహ్లి కంటే వయసులోనూ కాస్త పెద్దవాడు. కాబట్టి వరల్డ్కప్ నాటికి రోహిత్ విషయం ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం కచ్చితంగా కొనసాగుతాడనే అనుకుంటున్నా.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై 350 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి లేకుంటే టీమిండియా ఎలా గెలవగలదు?.. బహుశా కోహ్లి మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది. ఏదేమైనా అగార్కర్కు ఈ విషయంలో ఓటమి తప్పదు.ఛేజింగ్ కింగ్ఒకవేళ అగార్కర్ నిజంగానే రో- కో గురించి అలా అన్నాడా? లేదంటే అనువాద తప్పిదాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియవు’’ అని స్టీవ్ హార్మిసన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ఛేజింగ్లోనే కోహ్లి 28 శతకాలు బాది 8064 పరుగులు రాబట్టాడు. ఇందులో 41 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అత్యుత్తమ స్కోరు 183. అంతేకాదు.. 300 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి ఏకంగా ఏడు సెంచరీలు నమోదు చేయడం అతడు ఛేజింగ్ కింగ్ అనడానికి మరో నిదర్శనం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
రోహిత్పై వేటు సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్
టీమిండియా వన్డే కెప్టెన్ను మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అన్న చర్చ నడుస్తూనే ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో భారత దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar)తో పాటు మదన్ లాల్ వంటి వారు సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తుండగా. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు దీనిని తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లెజండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా భారత వన్డే జట్టు కెప్టెన్ మార్పు అంశంపై తాజాగా స్పందించాడు. రోహిత్ శర్మను తప్పించి గిల్ను కెప్టెన్ను చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు వివరిస్తూ..రోహిత్పై వేటు సరైన నిర్ణయం‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (Virat Kohli).. వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతారో లేదో నమ్మకం లేదు. ఆ ఆలోచనతోనే శుబ్మన్ గిల్ను వన్డే కెప్టెన్గా చేసి ఉంటారు. అతడికి గొప్ప అవకాశం లభించింది.యువకుడు.. బ్యాటర్గానూ మంచి ఫామ్లో ఉన్నాడు. అద్భుతమైన నాయకుడిగా ఎదగగలడు. రోహిత్, కోహ్లి జట్టులో ఉండగానే గిల్ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. ఈ ఇద్దరు గొప్ప, అనుభవజ్ఞులైన కెప్టెన్ల నుంచి గిల్ ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది.రోహిత్, కోహ్లి జట్టులో కొనసాగాలంటే..వారి అనుభవం తనకు ఉపయోగపడుతుంది. కెప్టెన్గా ఎదిగే క్రమంలో అతడికి ఇది ఎంతో ముఖ్యం. వాళ్లిద్దరు జట్టులో ఉండటం గిల్కు సానుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఒకవేళ రోహిత్, కోహ్లి 2027 వరల్డ్కప్ వరకు కొనసాగాలనుకుంటే.. తప్పకుండా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది.సెలక్టర్లకు బ్యాట్ ద్వారానే సందేశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీని దాటి ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా పరుగులు చేయాల్సిందే. రోహిత్, కోహ్లి వరల్డ్కప్ వరకు జట్టులో ఉంటే.. టీమిండియాకు అంతకంటే గొప్ప ఆస్తి మరొకటి ఉండదు’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.ఆసీస్తో సిరీస్తో రీఎంట్రీకాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు. చివరగా ఇద్దరూ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్తో రో- కో పునరాగమనం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా టెస్టు కెప్టెన్గా గిల్ జట్టును ముందుకు నడిపిస్తుండగా.. టీ20 టీమ్కు సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
విరాట్, రోహిత్ బలిపశువులా? టీమిండియా లో భారీ కుట్ర!
-
గిల్ కాదు!.. సూర్య తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అతడే!
భారత క్రికెట్లో గత కొన్నాళ్లుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీమిండియా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు వీడ్కోలు పలకగా.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కూడా సంప్రదాయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.రో- కో బైబైఅంతకంటే ముందే.. అంటే 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతండగా.. ఆస్ట్రేలియా టూర్కు ముందు బీసీసీఐ రోహిత్పై వేటు వేసింది. వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించింది.ఇప్పటికే టెస్టు జట్టు సారథిగా వ్యవహరిస్తున్న యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను.. వన్డేలకూ కెప్టెన్గా నియమించింది. ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సరికాదని పేర్కొన్నాడు.గిల్కే మేనేజ్మెంట్ మద్దతువన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి పూర్తిస్థాయిలో జట్టును సిద్ధం చేసే క్రమంలో గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆడతామనే హామీ ఇవ్వలేదంటూ అభిమానుల హృదయాలు ముక్కలు చేశాడు.ఇదిలా ఉంటే.. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్ అయిన గిల్.. త్వరలోనే టీ20 కెప్టెన్గానూ స్వీకరించబోతున్నట్లు అగార్కర్ మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్-2026 తర్వాత తప్పుకొంటే.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టెస్టులలో ఒకే.. కానీ వన్డేలలో..ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్కు గిల్ కెప్టెన్ కావడం మంచి పరిణామం. అందుకు తాను అర్హుడినని ఇప్పటికే తను నిరూపించుకుంటున్నాడు.అయితే, వన్డేల్లో మాత్రం.. గిల్ కంటే గొప్ప సామర్థ్యమున్న ఆటగాడు టీమిండియాకు దొరికేవాడు. బ్యాటర్గా అతడి గణాంకాలు ఫర్వాలేదు. కానీ ఇప్పటికిప్పుడు కెప్టెన్ అంటేనే కాస్త చిత్రంగా ఉంది.శ్రేయస్ అయ్యర్ వైపు చూపుటీ20 ఫార్మాట్లో మాత్రం ఇప్పటికీ శుబ్మన్ గిల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నాకు తెలిసి టీ20 భవిష్య కెప్టెన్గా యాజమాన్యం శ్రేయస్ అయ్యర్ వైపు దృష్టి సారించే అవకాశం ఉందనిపిస్తోంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇటీవల టెస్టు ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. వన్డేల్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.జట్టులోనే స్థానం లేదుమరోవైపు.. ఐపీఎల్లో గతేడాది కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్ను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ సారథిగా జట్టును ఫైనల్కు చేర్చాడు. బ్యాటర్గానూ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 జట్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఆటగాడిగానే శ్రేయస్కు స్థానమివ్వని యాజమాన్యం.. సూర్యకుమార్ యాదవ్ తర్వాత అతడిని ఏకంగా కెప్టెన్ను చేస్తుందంటూ ఊతప్ప అంచనా వేయడం విశేషం. కాగా ఆసీస్తో వన్డేలకు గిల్కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్గా అయ్యర్ ఎంపిక కావడం గమనార్హం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ఇది నిజంగా సిగ్గుచేటు: రోహిత్పై గంభీర్ ‘కామెంట్స్’ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పు విషయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించాడంటూ హిట్మ్యాన్ అభిమానులు గౌతీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గౌతీతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్పై కూడా రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.అది సిగ్గుచేటుఈ నేపథ్యంలో గౌతం గంభీర్ రోహిత్ శర్మను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందులో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కాకపోతే అది జట్టు చేసుకున్న దురదృష్టమే కానీ... రోహిత్కు కాదు.పరిమిత ఓవర్ల క్రికెట్ లేదంటే టీ20 జట్టుకు అతడు కెప్టెన్ కాలేదంటే.. అది సిగ్గుచేటు. ఇంతకంటే రోహిత్ శర్మ ఇంకేం చేస్తే కెప్టెన్సీకి అర్హుడు అవుతాడు?’’ అంటూ గంభీర్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శిస్తూ రోహిత్ శర్మకు మద్దతు తెలిపాడు. పరోక్షంగా విరాట్ కోహ్లిని టార్గెట్ చేశాడు.నాడు కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకాగా టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే టీమిండియా ఇంటిబాట పట్టడంతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ కోహ్లిని తప్పించగా.. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా తప్పుకొన్నాడు.ఈ క్రమంలో 2021-22 మధ్య కాలంలో కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్ను చేసింది బీసీసీఐ. అప్పటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటిన టీమిండియా గతేడాది వరల్డ్కప్ గెలిచింది.అంతకుముందు వన్డే వరల్డ్కప్-2023లో అజేయంగా ఫైనల్ చేరింది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ట్రోఫీ-2025 గెలిచింది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతానని చెప్పగా.. బీసీసీఐ అనూహ్యంగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.ఇపుడు రోహిత్ ప్లేస్లో గిల్రోహిత్ స్థానంలో టెస్టు సారథిగా వచ్చిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు వన్డే పగ్గాలనూ అప్పగించింది. ఇందులో హెడ్కోచ్ గంభీర్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. గంభీర్తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసి 38 ఏళ్ల రోహిత్ను కెప్టెన్గా తప్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొనడం గమనార్హం.ఈ నేపథ్యంలో గంభీర్ గతంలో రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడలా.. ఇప్పుడిలా.. నిజంగానే ఇది సిగ్గుచేటు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2027 నాటికి గిల్ చుట్టు జట్టును నిర్మించే క్రమంలో అతడిని కెప్టెన్ను చేసినట్లు అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్Never seen anyone more hypocritical and two-faced than Gautam Gambhir. The same guy who once said, “If Rohit Sharma doesn’t become India’s captain, it’s India’s loss, not Rohit’s,” now doesn’t want him as captain after becoming coach himself. pic.twitter.com/pqRzYKDR2a— Kusha Sharma (@Kushacritic) October 4, 2025 -
గంభీర్, అగార్కర్ కలిసే చేశారు.. రోహిత్ కెప్టెన్గా ఉంటే ఆ ప్రమాదం!
‘వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు?’.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే ప్రధాన చర్చ. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన హిట్మ్యాన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మండలి తీరుపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు.. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి దిగ్గజాలు మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.రోహిత్ కెప్టెన్గా ఉంటే ఆ ప్రమాదం!ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల మేరకు.. ‘‘నాయకుడిగా డ్రెసింగ్రూమ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. సారథిగా తనకంటూ ప్రత్యేక శైలి ఉంది.అయితే, తను ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరి అలాంటపుడు.. కేవలం ఒక్క ఫార్మాట్కు తను కెప్టెన్గా ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరు నెలలు గౌతం గంభీర్ టెస్టు, వన్డే జట్ల విషయంలో వెనక ఉండే నడిపించాడు.అంతా గంభీర్ ఆధీనంలోనే..అయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (టెస్టుల్లో 3-0తో వైట్వాష్), ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్లో ఓటమి తర్వాత గంభీర్ అన్ని విషయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.ప్రస్తుత నిర్ణయం (కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించడం) కూడా గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసికట్టుగా తీసుకున్నారు. రోహిత్, విరాట్ కోహ్లిల వయస్సు ఇప్పటికే 35 ఏళ్లు దాటిపోయింది. కెరీర్లో వారు చివరి అంకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి దశలో అకస్మాత్తుగా రోహిత్, కోహ్లిలు ఫామ్ కోల్పోతే నాయకత్వ బృందంలో గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంటుంది.గంభీర్ నిర్ణయాల వల్లే మెరుగైన ఫలితాలునిజానికి ఇంగ్లండ్ పర్యటనకు ముందే వీరిద్దరు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్లో రెండు టెస్టుల్లోనూ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా గెలిచిన తీరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్తో పాటు కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్తో టెస్టులకు ముందు సంప్రదాయ క్రికెట్కూ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డేల్లో మాత్రం మరికొన్నాళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు.త్వరలోనే టీ20 జట్టు పగ్గాలు కూడా అతడికేకానీ అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను వన్డేలకూ సారథిని చేసింది. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వెల్లడించాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి 2027 ప్రపంచకప్ వరకు ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టూర్ సందర్భంగా గిల్ టెస్టు జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 జట్టులోనూ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ ఆసియా కప్-2025లో పాల్గొన్నాడు. త్వరలోనే టీ20లకు కూడా అతడే కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించినట్లు బీసీసీఐ వర్గాల మాటల ద్వారా స్పష్టం అవుతోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
IND Vs AUS: ఒకప్పుడు కోహ్లితో కలిసి ఆడారు.. కట్ చేస్తే.. ఇప్పుడు అంపైర్లుగా!
‘కింగ్’ కోహ్లి టీనేజ్లో భారత్ను అండర్–19 ప్రపంచకప్ విజేతగా నిలిపాడు. 2008లో అతని సారథ్యంలోనే యువ భారత్ ‘కప్’ తెచ్చింది. తర్వాత సీనియర్ జట్టు సభ్యుడైన కొన్నాళ్లకే 2011లో ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచింది.తర్వాత చాంపియన్స్ ట్రోఫీ, గతేడాది టి20 ప్రపంచకప్, ఈ ఏడాది మరో చాంపియన్స్ ట్రోఫీ ఇలా చాలా ఐసీసీ ట్రోఫీల్లో కోహ్లి కీలక ఆటగాడయ్యాడు. తదుపరి 2027 వన్డే ప్రపంచకప్ బరిలో నిలిచేందుకు ఫిట్నెస్తో ఉన్నాడు. అయితే అతని 2008 సహచరుల్లో ఇద్దరు తన్మయ్ శ్రీవాస్తవ, అజితేశ్ అర్గల్లు ఇప్పుడు ఫీల్డ్ అంపైర్లుగా మారారు. 35 ఏళ్ల తన్మయ్, 37 ఏళ్ల అజితేశ్లకు కాలం కలిసివస్తే... ఐసీసీ ఎలైట్ అంపైర్లయితే... కోహ్లి ఆడే మ్యాచ్లకు, 2027 మెగా ఈవెంట్కు ఫీల్డ్ అంపైర్లుగా బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే 22 గజాల పిచ్పై వికెట్ల ముందు కోహ్లి ఆడుతుంటే... వికెట్ల వెనుక (నాన్ స్ట్రయిక్ ఎండ్లో) ఒకప్పటి సహచరులు అంపైరింగ్ చేయడాన్ని చూడొచ్చు. ఇక ప్రస్తుత విషయానికొస్తే తన్మయ్, అజితేశ్లు 2023లో బీసీసీఐ అంపైరింగ్ పరీక్షల్లో పాసయ్యారు. ఇప్పటికే రంజీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలకు అంపైరింగ్ చేశారు. తాజాగా వీరికి ప్రమోషన్ లభించింది. వీళ్లిద్దరు ఇప్పుడు భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్కు కాన్పూర్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.చదవండి: ICC Womens World Cup 2025: పాక్పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు -
అందుకే రోహిత్ శర్మపై వేటు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్మ్యాన్.. వన్డేల్లో మాత్రం కెప్టెన్గా కొనసాగుతానని ప్రకటించాడు. అయితే, అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్పై వేటు వేసింది.వన్డే సారథిగా రోహిత్ శర్మను తప్పించి.. అతడి స్థానంలో.. యువ ఆటగాడు, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. దీంతో రోహిత్ కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కెప్టెన్కు ఇది అవమానం లాంటిదేనని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును ఎండగడుతున్నారు. వన్డేల్లో డెబ్బై ఐదుకు పైగా విజయశాతం కలిగి ఉన్న సారథి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు.అందుకే రోహిత్ శర్మపై వేటుఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్లకు జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. ‘‘భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.జట్టు అత్యుత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించాల్సి ఉంటుంది. ముందుగానే స్పందించి.. కొత్త వ్యక్తి (గిల్) చుట్టూ జట్టును నిర్మించాల్సి ఉంటుంది. ఇది సహేతుకమైన నిర్ణయం’’ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.అదే విధంగా.. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ప్రాక్టికల్గా అంతగా వర్కౌట్ కాదని.. అన్ని జట్లకు ఒకే కెప్టెన్ ఉండటం ద్వారా హెడ్కోచ్ గౌతం గంభీర్కు కూడా పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్తో ఎలాంటి చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం అగార్కర్ స్పష్టతనివ్వలేదు.అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమేఏదేమైనా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని.. కెప్టెన్సీ విషయం గురించి రోహిత్తో మాట్లాడమని మాత్రమే అగార్కర్ వెల్లడించాడు. ఇక రోహిత్తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా దేశీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆటగాళ్లు అందుబాటులో ఉన్నపుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని మేము స్పష్టంగా చెప్పాము’’ అని పేర్కొన్నాడు.అంతేకాదు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే వరల్డ్కప్-2027 నాటికి ఆడే విషయంపై తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఇద్దరికీ ఫిట్నెస్ టెస్టులు నిర్వహించామని.. ఇద్దరూ మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నారని తెలిపాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన బీసీసీఐ శనివారం తమ జట్లను ప్రకటించింది.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్ -
క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చిన 2025
2025వ సంవత్సరాన్ని క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరచిపోలేరు. ఎందుంటే ఈ ఏడాది ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మందికి పైగా స్టార్ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు (Retirement) పలికారు. ఈ విషయం సగటు క్రికెట్ అభిమానికి తీవ్ర శోకాన్ని కలిగిస్తుంది. తమ ఆరాధ్య ఆటగాళ్లు ఇకపై అంతర్జాతీయ వేదికపై ఆడరని తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.ఈ ఏడాది న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మార్టిన్ గప్తిల్తో రిటైర్మెంట్ల పరంపర మొదలైంది. మధ్యలో భారత దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్ట్లకు వీడ్కోలు పలికారు. తాజాగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ ఆట మొత్తానికి అల్విదా చెప్పాడు. ఈ మధ్యలో కొందరు కొన్ని ఫార్మాట్లకు మరికొందరు అంతర్జాతీయ కెరీర్ మొత్తానికి గుడ్బై చెప్పారు.ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..మార్టిన్ గుప్తిల్ (అన్ని ఫార్మాట్లు)వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)తమీమ్ ఇక్బాల్ (అన్ని ఫార్మాట్లు)వృద్దిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)షకీబ్ అల్ హసన్ (టెస్ట్)కేన్ విలియమ్సన్ (టీ20)షాపూర్ జద్రాన్ (అన్ని ఫార్మాట్లు)మహ్మదుల్లా (అన్ని ఫార్మాట్లు)దిముత్ కరుణరత్నే (అన్ని ఫార్మాట్లు)విరాట్ కోహ్లి (టెస్ట్)రోహిత్ శర్మ (టెస్ట్)మార్కస్ స్టోయినిస్ (వన్డే)స్టీవ్ స్మిత్ (వన్డే)గ్లెన్ మ్యాక్స్వెల్ (వన్డే)హెన్రిచ్ క్లాసెన్ (అన్ని ఫార్మాట్లు)ముష్ఫికర్ రహీం (వన్డే)నికోలస్ పూరన్ (అన్ని ఫార్మాట్లు)ఆండ్రీ రసెల్ (అన్ని ఫార్మాట్లు)ఏంజెలో మాథ్యూస్ (టెస్ట్)పియూశ్ చావ్లా (అన్ని ఫార్మాట్లు)అమిత్ మిశ్రా(అన్ని ఫార్మాట్లు)చతేశ్వర్ పుజారా (అన్ని ఫార్మాట్లు)మిచెల్ స్టార్క్ (టీ20)క్రిస్ వోక్స్ (అన్ని ఫార్మాట్లు)చదవండి: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ -
విరాట్ కోహ్లీని అధిగమించిన తిలక్ వర్మ
ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) పాకిస్తాన్పై భారత్ (India vs Pakistan) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 53 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఫహీమ్ అష్రఫ్ ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేల తిలక్ ప్రశాంతంగా, సమర్థంగా ఇన్నింగ్స్ను పునర్నిర్మించాడు. సంజు శాంసన్, శివమ్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బౌండరీలు, సిక్సర్లు బాదడంతో పాటు స్ట్రైక్ రొటేషన్లో తన నైపుణ్యాన్ని చూపించాడు. ఈ ఇన్నింగ్స్కు గానూ తిలక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ సిక్సర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు లభించాయి.ఈ టోర్నీలో తిలక్ 7 మ్యాచ్ల్లో 71.00 సగటున, 131.48 స్ట్రైక్ రేట్తో 213 పరుగులు చేశాడు. మొత్తం T20I కెరీర్లో 32 మ్యాచ్లు ఆడిన తిలక్.. 53.44 సగటున, 149.14 స్ట్రైక్ రేట్ 962 పరుగులు చేశాడు.కోహ్లీని అధిగమించిన తిలక్ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తిలక్ వర్మ 30 T20I ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక సగటు కలిగిన భారత బ్యాటర్గా విరాట్ కోహ్లీని (Virat Kohli) అధిగమించాడు.30 T20I ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక సగటు కలిగిన భారత బ్యాటర్లు:తిలక్ వర్మ- 53.4విరాట్ కోహ్లీ- 50.7మనీష్ పాండే- 43.1కేఎల్ రాహుల్- 41.9సూర్యకుమార్ యాదవ్- 39.0ఛేజింగ్లో మొనగాడుఅంతర్జాతీయ టీ20ల్లో తిలక్కు ఛేజింగ్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 11 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 92.50 సగటున, 134.54 స్ట్రైక్ రేట్తో 370 పరుగులు చేశాడు. ఛేజింగ్లో ఇంత అద్భుతమైన సగటు చాలా తక్కువ మందికి ఉంది.ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, క్రమంగా భారత జట్టులో నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్గా ఎదిగాడు. ఒత్తిడిలో ఇన్నింగ్స్ నిర్మించడం, మ్యాచ్ ఫినిష్ చేయడం వంటి అంశాల్లో తిలక్ ఇప్పటికే తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు.ఇదిలా ఉంటే, నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్గా అవతరించింది.ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడినప్పటికీ.. తిలక్ వర్మ అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు.చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..! -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న విరాట్ కోహ్లి పోస్ట్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) మైదానంలో దిగి చాన్నాళ్లే అయింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) ఫైనల్లో భాగంగా కోహ్లి చివరగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. మార్చిలో న్యూజిలాండ్తో జరిగిన టైటిల్ పోరులో ఒకే ఒక్క పరుగు చేశాడు.ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడాల్సి ఉండగా.. కోహ్లి ఊహించని రీతిలో సంప్రదాయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇక అంతకుముందే అంటే.. గతేడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు.ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్ఇక ఆట నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. భార్య అనుష్క శర్మ (Anushka Sharma), కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ (Akaay)లతో కలిసి లండన్లో ఉన్న కోహ్లి.. చాలా రోజుల తర్వాత తన వ్యక్తిగత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘చాలా రోజుల తర్వాత ఇలా..’’ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ పోస్టుకు ఇప్పటికే తొమ్మిదిన్నర మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. విరాట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.ఆస్ట్రేలియాతో సిరీస్తో రీఎంట్రీఐపీఎల్-2025 తర్వాత కోహ్లి.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆసీస్తో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్లో కోహ్లి ఆడనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే జిమ్లో చెమటోడుస్తున్న ఈ రన్మెషీన్.. పునరాగమనంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.కాగా ఈ ఏడాది కోహ్లి చిరకాల కోరిక నెరవేరిన విషయం తెలిసిందే. పదిహేడేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని అతడు ముద్దాడాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే.. 2008 నుంచి ఇప్పటిదాకా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే.చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
చరిత్ర సృష్టించిన నిసాంక.. ఆసియా కప్ హిస్టరీలోనే...
టీమిండియాతో ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్లో.. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుత ప్రదర్శన కనబరిచాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి... 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 107 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.కోహ్లి ఆల్టైమ్ రికార్డు బద్దలుఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాతుమ్ నిసాంక (Pathum Nissanka) ఆసియా కప్ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర క్రికెట్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును నిసాంక బద్దలు కొట్టాడు.కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. లీగ్, సూపర్-4 మ్యాచ్లలో పరాజయమే ఎరుగక ఫైనల్ చేరింది టీమిండియా. ఈ క్రమంలో సూపర్-4 దశలో చివరిగా ఈ రెండు జట్లు (IND vs SL) నామమాత్రపు మ్యాచ్లో తలపడ్డాయి.అభిషేక్ శర్మ ధనాధన్దుబాయ్లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి మెరుపులు మెరిపించగా.. తిలక్ వర్మ (49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39) రాణించారు.Beast mode Abhishek Sharma! 🥵#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/CrQW1M492m— Sony Sports Network (@SonySportsNetwk) September 27, 2025 నిసాంక మెరుపు సెంచరీఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంకకు.. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్ను డకౌట్ చేశాడు. అయితే, భారత శిబిరానికి ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ నిసాంకతో పాటు వన్డౌన్ బ్యాటర్ కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) ధనాధన్ దంచికొట్టాడు.టీమిండియా సూపర్ విజయంఆఖర్లో దసున్ శనక (11 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి శ్రీలంక కూడా ఐదు వికెట్ల నష్టానికి సరిగ్గా 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.అయితే, ఈసారి టీమిండియా ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వలేదు. ఆరు బంతుల్లో లంకను రెండు పరుగులకు కట్టడి చేసి రెండు వికెట్లు తీసిన వికెట్ తీసిన భారత్.. ఆ తర్వాత తొలి బంతికే మూడు పరుగులు చేసి జయభేరి మోగించింది.ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల వీరులు వీరే🏏పాతుమ్ నిసాంక (శ్రీలంక)- 12 ఇన్నింగ్స్లో 434* పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 9 ఇన్నింగ్స్లో 429 పరుగులు🏏అభిషేక్ శర్మ (ఇండియా)- 6 ఇన్నింగ్స్లో 309 పరుగులు🏏బాబర్ హయత్ (హాంకాంగ్)- 8 ఇన్నింగ్స్లో 292 పరుగులు🏏మొహమ్మద్ రిజ్వాన్ (ఇండియా)- 6 ఇన్నింగ్స్లో 281 పరుగులు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మPathum Nissanka anchors the chase with a six-hitting spree 💥 Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/jlzQgHf6Ga— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో (India vs Bangladesh) మరో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్తో మ్యాచ్లోనూ అభి'షేక్' (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడంతో అభిషేక్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat kohli) తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్లో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్లో ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడిన అతను.. 206.67 స్ట్రయిక్రేట్తో 248 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి 3 ఓవర్లలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత అభిషేక్ గేర్ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్, గిల్ క్రీజ్లో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఈ ఇద్దరు ఔట్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది.వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 15 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా (11), అక్షర్ పటేల్ (2) క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ 75, గిల్ 29, శివమ్ దూబే 2, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలరల్లో రిషద్ హొసేన్ 2, తంజిమ్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ రనౌటయ్యాడు. చదవండి: సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్కు భారత జట్టు ప్రకటన వాయిదా -
ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు బరితెగించారు. ఓ బ్యాటర్ ఏకే-47 మాదిరి బ్యాట్తో సంబరాలు చేసుకుంటే.. ఇంకో ఆటగాడు ఇంకాస్త దిగజారి వ్యవహరించాడు. ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో భారత నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఛీ.. మీ బుద్ధి మారదా?‘‘ఛీ.. మీ బుద్ధి మారదా? ఇంతకంటే ఇంకెంతకు దిగజారుతారు?’’ అంటూ చివాట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఆదివారం తలపడ్డాయి.దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసి.. పాక్ను 171 పరుగులకు కట్టడిచేసింది. ఆపై 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగాఫర్హాన్ నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 58 పరుగులు సాధించాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగా అభినయిస్తూ బ్యాట్ను చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.విరాట్ కోహ్లి నామస్మరణయువ ఆటగాడు ఫర్హాన్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ప్లేయర్ హ్యారిస్ రవూఫ్ మరో అడుగు ముందుకు వేశాడు. బౌండరీ రోప్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత దిగ్గజం విరాట్ కోహ్లి నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరిచారు. దీంతో టీ20 ప్రపంచకప్-2022లో కోహ్లి తన బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాది.. మ్యాచ్ను లాగేసుకున్న విషయం అతడికి గుర్తుకు వచ్చినట్లు ఉంది.ఇదొక దిగజారుడు చర్యఅయితే, ఇందుకు తాజా మ్యాచ్లో తన బౌలింగ్తో సమాధానం ఇవ్వాల్సింది పోయి.. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్.. భారత్కు చెందిన ఆరు ఫైటర్ జైట్లను కూల్చామని ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. హ్యారిస్ రవూఫ్ సైగలు చేశాడు.అంతకు ముందు ప్రాక్టీస్ సమయంలో ఫుట్బాల్ ఆడుతూ.. 6-0sతో లీడ్లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు పాక్ ఆటగాళ్లు అతి చేశారు. ఈ నేపథ్యంలో ఇదొక దిగజారుడు చర్య అంటూ క్రికెట్ ప్రేమికులు పాక్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.ఆసియా కప్ -2025 సూపర్ 4: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాకిస్తాన్ స్కోరు: 171/5 (20)👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన టీమిండియా.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య Haris Rauf never disappoints, specially with 6-0. pic.twitter.com/vsfKKt1SPZ— Ihtisham Ul Haq (@iihtishamm) September 21, 2025సెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)సరికొత్త చరిత్ర లిఖించాడు. పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో.. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్-2025 టోర్నమెంట్లో దుబాయ్ వేదికగా భారత్- పాక్ ఆదివారం మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.తొలి బంతికే బౌండరీ బాదిఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి బంతికే బౌండరీ బాది.. పాక్ కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi)కి స్వాగతం పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో బంతిని ఏకంగా సిక్సర్గా మలిచాడు.ధనాధన్ దంచికొట్టిఆ తర్వాత కూడా ధనాధన్ దంచికొట్టిన అభిషేక్ శర్మ మొత్తంగా.. 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులు సాధించాడు. సయీమ్ ఆయుబ్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను ఫాహిమ్ అష్రాఫ్ అందుకోవడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ (3.4 ఓవర్లో)కు తెరపడింది. కాగా పాకిస్తాన్ జట్టు మీద పవర్ ప్లేలో భారత బ్యాటర్లలో ఎవరికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు (31) కావడం విశేషం. ఇదిలా ఉంటే.. అభిషేక్ (31)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివం దూబే (7 బంతుల్లో 10 నాటౌట్) రాణించారు. ఫలితంగా 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన టీమిండియా.. పాక్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాకిస్తాన్పై టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత క్రికెటర్లు🏏అభిషేక్ శర్మ- 31 పరుగులు- 2025లో దుబాయ్ వేదికగా..🏏విరాట్ కోహ్లి- 29 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏రోహిత్ శర్మ- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా🏏కేఎల్ రాహుల్- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! -
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా
ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చాడు. భారత బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఈ పేస్ ఆల్రౌండర్ తొలి బంతిని వైడ్గా సంధించాడు. అయితే, ఆ తర్వాత వెంటనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం అందించాడు.హార్దిక్ వేసిన అవుట్స్వింగర్ను తప్పుగా అంచనా వేసిన పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్.. బంతిని గాల్లోకి లేపగా జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టాడు. దీంతో ఆయుబ్ డకౌట్ అయ్యాడు. ఫలితంగా పాక్ తొలి వికెట్ కోల్పోగా.. హార్దిక్ ఖాతాలో తొలి వికెట్ చేరింది.పాండ్యా సూపర్ క్యాచ్ఇక ఆ మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా మంచి క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్ను పాండ్యా కష్టపడి పట్టాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ను తాకిన బంతి గాల్లోకి లేవగా లాంగ్ లెగ్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి మరీ అందుకున్నాడు. ఫలితంగా పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న రెండో భారత ఫీల్డర్గా నిలిచాడు. రోహిత్ శర్మ 65 క్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా.. మహ్మద్ హ్యారిస్ క్యాచ్తో కలిపి 55 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్- పాక్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పది ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ఫీల్డర్లురోహిత్ శర్మ- 65హార్దిక్ పాండ్యా- 55*విరాట్ కోహ్లి- 54సూర్యకుమార్ యాదవ్- 51*సురేశ్ రైనా- 42. చదవండి: టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన𝗕𝗢𝗢𝗠! 💥India are tearing through. Pakistan lose their 2nd wicket 🔥Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xqJXwEHqnf— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు
దిగ్గజ బ్యాటర్, టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లి ఈ ఏడాది మే 12న టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచానికి ఊహించని షాకిచ్చాడు. కోహ్లిలో మరో మూడు, నాలుగేళ్లు టెస్ట్ల్లో కొనసాగే సత్తా ఉన్నా ఎందుకో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. కోహ్లి ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా అతను మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందే (గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత) పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. త్వరలో ఆస్ట్రేలియాతో వారి దేశంలోనే జరుగబోయే మూడు మ్యాచ్ల సిరీస్లో విరాట్ పాల్గొనే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, తాజాగా విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబన్ అగ్రనేత అనాస్ హక్కానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సోషల్మీడియాలో వైరలవుతుంది. క్రికెట్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే హకాన్నీ విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ వెనుక కారణాలు నాకు తెలియదు. బహుశా భారత మీడియా వల్ల విసిగిపోయి అతనలా చేసి ఉండవచ్చు. విరాట్ లాంటి ఆటగాడు కనీసం 50 ఏళ్ల వరకైనా ఆడాలన్నది నా కోరిక. విరాట్కు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. జో రూట్ను చూడండి, సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును ఛేదిస్తున్నాడు. విరాట్ కూడా ఆ రికార్డును టార్గెట్గా పెట్టుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.హక్కానీ లాంటి ఉగ్ర నేపథ్యమున్న నేత విరాట్ టెస్ట్ రిటైర్మెంట్పై స్పందించడం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. హక్కానీకి తాలిబన్ ఉద్యమ నేత. తాలిబన్లు తీసుకునే అంతర్గత నిర్ణయాల్లో హక్కానీ కీలకపాత్రధారుడు. హక్కానీ క్రమం తప్పకుండా క్రికెట్ను ఫాలో అవుతుండటంతో పాటు సోషల్మీడియాలోనూ యాక్టివ్గా ఉంటాడు. హక్కానీ వారి దేశ క్రికెట్ జట్టుకు (ఆఫ్ఘనిస్తాన్) మంచి మద్దతుదారుడు. వారి తురుపుముక్క రషీద్ ఖాన్ను హక్కానీ అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ భారత్తో పాటు ఆసియా కప్లో పాల్గొంటుంది. ఈ ఖండాంతర టోర్నీలో ఇరు జట్లు వేరువేరు గ్రూప్ల్లో ఉండటంతో గ్రూప్ దశలో పోటీపడటం లేదు. ఇరు జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తే సూపర్ ఫోర్లో తలపడే అవకాశం ఉంటుంది. -
Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్
-
విరాట్- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్మోడల్.కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.ఒకే హోటల్లో బస.. అనుష్క కూడా అక్కడే‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్ను కలవాలి అనుకున్నాం.మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.ఇక చాలు.. బయటకు వెళ్లండిఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.లండన్లోనే నివాసంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. లండన్లో అకాయ్కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆ సిరీస్కు కోహ్లి-రోహిత్ దూరం!?
అంతా ఊహించిందే జరిగింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా-ఎ సిరీస్లో భాగం కావడం లేదు. ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోకో ద్వయం ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు.చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో కన్పించిన వీరిద్దరూ తిరిగి వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్లో ఆడనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిని స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న అనాధికారిక వన్డే సిరీస్లో భారత్-ఎ జట్టు తరపున ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది వారికి ప్రాక్టీస్ ఉపయోగపడుతుందని, అందుకు రో-కో కూడా అంగీకరించారని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఇవన్నీ వట్టి రూమర్సే అని ఆయన కొట్టిపారేశారు."ఆస్ట్రేలియా-తో జరిగే సిరీస్లో రోహిత్, కోహ్లి ఇద్దరూ ఆడడం ఆసాధ్యమనే చెప్పాలి. ఇప్పటివరకు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా జానియర్లతో కలిసి ఆడమని వారిని మేము బలవంతం కూడా చేయము. వారింత వారు ప్రాక్టీస్ కావాలని భావిస్తే, ఆస్ట్రేలియా వన్డేలకు ముందు ఒకటి రెండు అనాధికారిక మ్యాచ్లు ఆడే అవకాశముంది. కానీ ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే వారు ప్రస్తుతం చాలా ఫిట్గా ఉన్నారు. ఆస్ట్రేలియాతో వన్డేలకు రోహిత్, కోహ్లి కూడా సిద్దంగా ఉన్నారని" సదరు అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా రోహిత్ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్గా కన్పిస్తున్నాడు. దాదాపు ఎనిమిది కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవలే హిట్మ్యాన్ తన ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేశాడు. కోహ్లి ఇంకా తన ఫిట్నెస్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో ఆసీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్లో మెన్ ఇన్ బ్లూ తలపడనుంది.చదవండి: ఆల్టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్ -
ఆల్టైమ్ ఆసియా టీ20 జట్టు: భారత్ నుంచి ఐదుగురు.. యువీకి నో ఛాన్స్
ఆసియా కప్- 2025 (Asia Cup) టోర్నీకి రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఈసారి ఈ ఈవెంట్ను నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా.. టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.భారత్ నుంచి ఐదుగురుఇందుకోసం ఇప్పటికే ఎనిమిది జట్లు యూఏఈకి చేరుకుని.. అన్ని విధాలా సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బ్రెట్ లీ.. ఆసియా ఉత్తమ టీ20 జట్టును ఎంచుకున్నాడు. ఇందులో ఐదుగురు టీమిండియా స్టార్లకు చోటిచ్చిన ఈ ఆసీస్ దిగ్గజం.. బంగ్లాదేశ్ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు.యూఏఈ నుంచి ఇద్దరుఅయితే, అనూహ్యంగా యూఏఈ నుంచి ఇద్దరు.. హాంకాంగ్ నుంచి ఒక ఆటగాడికి బ్రెట్ లీ తన జట్టులో చోటివ్వడం విశేషం. ఇక పాకిస్తాన్ నుంచి ఇద్దరిని ఎంచుకున్న బ్రెట్ లీ... స్పిన్ విభాగంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు. అయితే, బ్రెట్ లీ ఎంచుకున్న జట్టులో టీమిండియా టీ20 ప్రపంచకప్ విజేతలు యువరాజ్ సింగ్ (2007), సూర్యకుమార్ యాదవ్ (2024)లకు మాత్రం చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ధోని, రో- కో తమకు తామే సాటిఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2007లో భారత్ వరల్డ్కప్ గెలవడంలో యువీది కూడా కీలక పాత్ర.ఇక అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక రన్స్కోరర్ రోహిత్ శర్మ (4231 పరుగులు). ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి (4188) ఉన్నాడు. 2024లో కెప్టెన్గా రోహిత్ పొట్టి ప్రపంచకప్ గెలవగా.. కోహ్లి ఖాతాలో మరో టైటిల్ చేరింది. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా కూడా టీమిండియాను చాంపియన్గా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ టోర్నీ తర్వాత రోహిత్- కోహ్లి.. ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారుబ్రెట్ లీ ఎంచుకున్న ఆసియా ఆల్టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్విరాట్ కోహ్లి (ఇండియా), రోహిత్ శర్మ (ఇండియా), మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), బాబర్ హయత్ (హాంకాంగ్), మహేంద్ర సింగ్ ధోని (ఇండియా), హార్దిక్ పాండ్యా (ఇండియా), వనిందు హసరంగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), అమ్జద్ జావేద్ (యూఏఈ), మొహమ్మద్ నవీద్ (యూఏఈ), హ్యారిస్ రవూఫ్ (పాకిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
‘ఎవరూ తోపులు కారు.. నేనే దేవుడిని అనుకుంటే ఇలాగే ఉంటుంది’
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్లో చివరి దశకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్, టెస్టులకు ఈ లెజెండరీ బ్యాటర్లు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా తరఫున వన్డేల్లో కొనసాగుతున్న రో-కో ద్వయం వన్డే ప్రపంచకప్-2027 వరకు ఆడతారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.ఆట కంటే ఎవరూ తోపులు కారుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రకాంత్ పండిట్ వంటి కోచ్ దగ్గరికి వెళ్తే కోహ్లి, రోహిత్ మరికొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగవచ్చని పేర్కొన్నాడు. ‘‘రోహిత్, విరాట్ అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు అని ఒప్పుకొంటాను.అయితే, వారికి గనుక నేనే కోచ్ని అయి ఉంటే.. ‘ఉదయం ఐదు గంటలు అయింది. లేవండి.. శిక్షణ మొదలుపెడదాం పదండి’ అనే చెప్తా. ఎందుకంటే ఆట కంటే ఎవరూ గొప్పోళ్లు, తోపులు కారు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి పదే పదే అవుటయ్యాడు.పది కిలోమీటర్లు పరిగెత్తాలి బాబూ!అయినా సరే.. విరాట్ దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు తప్పుగా ఆడుతున్నావు. బ్యాటింగ్పై దృష్టి పెట్టు’ అని ఎవరూ ఎందుకు చెప్పరు? రోహిత్ దగ్గరికి వెళ్లి ఐదు గంటలకే లేచి పది కిలోమీటర్లు పరిగెత్తాలి అని ఎందుకు అతడిని తొందరపెట్టరు?డాన్ బ్రాడ్మాన్ సగటు 99.9గా ఉంటే.. మన సగటు 54-55 మధ్య మాత్రమే ఎందుకు ఉందని రో-కో తమను తాము ఎందుకు ప్రశ్నించుకోరు?.. ‘నేనే దేవుణ్ణి.. అందరికంటే గొప్పోడిని’ అనుకుంటే కుదరదు. సచిన్ 43 ఏళ్ల వయసు వరకు ఎలా ఆడగలిగాడు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే మంచిది.ముంబై తరపున రంజీల్లో ఆఖరి వరకు సచిన్ ఆడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని యోగ్రాజ్ సింగ్ విరాట్- రోహిత్ల తీరును విమర్శించాడు. ఇన్సైడ్ స్పోర్ట్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా కోల్కతా నైట్ రైడర్స్కు గతేడాది ఐపీఎల్ టైటిల్ అందించిన దేశీ కోచ్ చంద్రకాంత్ పండిట్ వంటి వారి వద్దకు రో-కో వెళ్లి.. తమ తప్పులు సరిచేసుకోవాలని యోగ్రాజ్ ఈ సందర్భంగా సూచించాడు.ఆసీస్తో వన్డేలతో రీఎంట్రీ కాగా టీమిండియా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్-2025 టోర్నమెంట్తో బిజీ కానుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో టోర్నీ జరుగుతున్నందున విరాట్- రోహిత్కు మరికొంత కాలం విశ్రాంతి లభించనుంది. ఈ మెగా ఈవెంట్ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడిన తర్వాత.. పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇక ఆసీస్తో వన్డే సిరీస్తో వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే ఇద్దరూ ఫిట్నెస్ పరీక్ష పాసయ్యారు. కాగా రోహిత్- కోహ్లి చివరగా ఆస్ట్రేలియా టూర్లో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియాకు ఆడారు.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్.. కోహ్లి, స్కైను అధిగమించి ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ దేశాల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను వెనక్కు నెట్టాడు.నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఈ అవార్డుతో అంతర్జాతీయ టీ20ల్లో రజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల సంఖ్య 17కు చేరగా.. కోహ్లి, స్కై 16 వద్ద ఉన్నారు. ఓవరాల్గా (ఐసీసీ సభ్య దేశాలన్నీ) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు మలేసియా ఆటగాడు విరన్దీప్ సింగ్ (22) పేరిట ఉంది.కొనసాగుతున్న రజా హవాఅంతర్జాతీయ టీ20ల్లో సికందర్ రజా హవా గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్లో అతను 39 ఏళ్ల లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటుతూ, తన దేశం కాని దేశానికి వన్నె తెస్తున్నాడు. రజా పాకిస్తాన్లో పుట్టి, జింబాబ్వే తరఫున అంతర్జాతీయ కెరీర్ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.2013లో అంతర్జాతీయ టీ20 కెరీర్ మొదలుపెట్టిన రజా.. 12 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించి, టాప్ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. వ్యక్తిగతంగా సత్తా చాటుతూనే, కెప్టెన్గా జింబాబ్వేకు చిరస్మరణీయ విజయాలు అందిస్తున్నాడు. తాజాగా అలాంటి ప్రదర్శనే మరోసారి చేసి, తమ కంటే చాలా రెట్లు పటిష్టమైన శ్రీలంకను చిత్తు చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన మ్యాచ్లో బౌలింగ్లో సత్తా చాటి తన జట్టుకు అదిరిపోయే విజయాన్నందించాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రజా.. శ్రీలంకను 80 పరుగులకే కుప్పకూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో జింబాబ్వే శ్రీలంకను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. -
కోహ్లి భిన్నమైన ప్లేయర్!.. కానీ టఫెస్ట్ బ్యాటర్ మాత్రం అతడే: షాహిన్ ఆఫ్రిది
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) తనకు కఠిన సవాలు విసిరిన బ్యాటర్ పేరును తాజాగా వెల్లడించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) అందరి కంటే భిన్నమైన ఆటగాడు అని చెప్పిన షాహిన్.. అతడి కంటే ఓ సౌతాఫ్రికా బ్యాటర్కు బౌల్ చేయడం అత్యంత కష్టమని చెప్పాడు.అనతికాలంలోనే కీలక బౌలర్గా కాగా టీనేజీలోనే పాకిస్తాన్ తరఫున షాహిన్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2018లో వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేసిన అతడు.. అనతికాలంలోనే కీలక బౌలర్గా ఎదిగాడు. ఇప్పటి వరకు పాక్ తరఫున 84 టీ20లు, 66 వన్డేలు, 31 టెస్టులు ఆడిన షాహిన్ ఆఫ్రిది.. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 107, 131, 116 వికెట్లు కూల్చాడు.ఏడేళ్ల కెరీర్లో షాహిన్ ఆఫ్రిది ఎంతో మంది మేటి బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. అయితే, ఈ లెఫ్టార్మ్ పేసర్ కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో మాత్రమే టీమిండియా ఆటగాళ్లకు బౌల్ చేశాడు. ఈ నేపథ్యంలోనే.. తనకు కఠిన సవాలు విసిరిన బ్యాటర్ ఎవరన్న విషయంలో విరాట్ కోహ్లిని కాదని సౌతాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లాకు ఓటేశాడు.టెస్టులలో ఒక్కసారి కూడా..సౌతాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి హషీమ్ ఆమ్లా 18672 పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 80 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఈ మాజీ క్రికెటర్ను టెస్టుల్లో అవుట్ చేయడంలో పాతికేళ్ల షాహిన్ ఆఫ్రిది ఒక్కసారి కూడా సఫలం కాలేదు. అతడికి 31 పరుగులు సమర్పించుకున్నాడు.అదే విధంగా.. వన్డేల్లో హషీమ్ ఆమ్లాను రెండుసార్లు అవుట్ చేయగలిగిన షాహిన్ ఆఫ్రిది.. 40 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన ఈ పాక్ పేసర్కు.. మీ కెరీర్లో ఇంత వరకు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది.కోహ్లి భిన్నమైన ప్లేయర్!.. కానీ టఫెస్ట్ బ్యాటర్ మాత్రం అతడేఇందుకు బదులిస్తూ.. ‘‘వన్డేల్లో, టెస్టుల్లో ఆయనతో మ్యాచ్లు ఆడాను. ఇంగ్లండ్ టీ20 టోర్నీ విటలిటి బ్లాస్ట్లో కూడా ఆయనతో పోటీపడ్డాను. ఆయనొక గొప్ప బ్యాటర్. తన ప్రణాళికలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు.అందుకే హషీం ఆమ్లానే నాకు కఠినమైన సవాలు విసిరిన బ్యాటర్ అని చెప్పగలను. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. అతడొక భిన్నమైన ప్లేయర్. అయితే, నా వరకు మాత్రం హషీమ్ భాయ్ మాత్రం అందరికంటే టఫెస్ట్ బ్యాటర్’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం యూఏఈ పర్యటనలో జట్టుతో కలిసి ఉన్న షాహిన్.. తదుపరి ఆసియా కప్ టీ20-2025 టోర్నీలో ఆడనున్నాడు. సెప్టెంబరు 9 -28 వరకు జరిగే ఈ ఈవెంట్కు యూఏఈ వేదిక.చదవండి: భారత జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
కోహ్లి ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా?
-
‘ధోని, కోహ్లిలకు యువీ అంటే భయం.. అందుకే తొక్కేశారు’
టీమిండియా ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ప్రత్యేకం. భారత్ 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ గెలవడంలో ఈ చండీగఢ్ స్టార్ది కీలక పాత్ర. ముఖ్యంగా సొంతగడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.ఇక ఈ రెండు ఐసీసీ ట్రోఫీలను మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలోనే టీమిండియా గెలుచుకోవడం విశేషం. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత విరాట్ కోహ్లి (Virat Kohli) భారత జట్టు పగ్గాలు చేపట్టగా.. యువీ అతడి నాయకత్వంలోనూ ఆడాడు. అయితే, క్యాన్సర్ బారిన పడిన తర్వాత యువీ కెరీర్ నెమ్మదించింది. ఈ క్రమంలో 2017లో టీమిండియా తరఫును ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.అక్కడంతా వెన్నుపోటుదారులేఈ పరిణామాల నేపథ్యలో యువీ తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్.. ధోని, కోహ్లిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘డబ్బు, పేరు ప్రఖ్యాతులు, విజయం ఉన్న చోట.. స్నేహితులు ఉండరు. అక్కడంతా వెన్నుపోటుదారులే ఉంటారు.అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతూ ఉంటే వెనక్కి లాగాలని ప్రయత్నిస్తారు. చాలా మందికి యువరాజ్ సింగ్ అంటే భయం. అతడు తనకున్న ప్రతిభతో తమ స్థానాల్ని ఎక్కడ ఆక్రమిస్తాడేమోననే అభద్రతా భావం.ధోని, కోహ్లిలకు యువీ అంటే భయంయువీ.. దేవుడు సృష్టించిన గొప్ప ఆటగాడు. గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ ప్లేయర్స్. ఎంఎస్ ధోని నుంచి.. ఆ తర్వాత కెప్టెన్ అయిన వారి దాకా అంతా యువీ అంటే భయపడేవాళ్లే. తమ కుర్చీని అతడు లాక్కుంటాడేమోనని భయపడ్డారు.నా కుమారుడికి సచిన్ టెండుల్కర్ తప్ప క్రికెట్ ప్రపంచంలో మంచి స్నేహితులు ఎవరూ లేరు’’ అని యోగ్రాజ్ సింగ్ ఇన్సైడ్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భయం వల్లే ధోని, కోహ్లిలు తన కుమారుడి కెరీర్ నాశనం చేశారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా ధోనిపై యోగ్రాజ్ ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. అయితే, ఈసారి కోహ్లిని కూడా ఇందులోకి లాగాడు.మేటి ఆల్రౌండర్కాగా ఎడమచేతి వాటం బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన యువీ.. 2000- 2017 తదాకా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. టీమిండియా తరపున 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 8701, 58 టీ20 మ్యాచ్లలో కలిపి 1177 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టెస్టుల్లో తొమ్మిది, వన్డేల్లో 111, టీ20లలో 28 వికెట్లు పడగొట్టాడు.చదవండి: చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో.. -
కెప్టెన్లకు నచ్చితేనే అవకాశాలు!.. ధోని, కోహ్లిలే టార్గెట్?
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టుకు ఆడే సమయంలో సెలక్షన్ విధానం వేరుగా ఉండేదని పేర్కొన్నాడు. కెప్టెన్లకు నచ్చితే అవకాశాలు వస్తూనే ఉంటాయని.. లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోవాల్సి ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకొన్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని స్థాయిల్లోనూ ఆట నుంచి రిటైర్ అవుతున్నట్లు అతడు తెలిపాడు. కాగా 43 ఏళ్ల మిశ్రా తొలిసారి 2003లో భారత జట్టుకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 25 ఏళ్ల తర్వాత గుడ్బై చెబుతున్నామరో ఐదేళ్ల తర్వాత అతనికి టెస్టు ఆడే అవకాశం దక్కింది. భారత జట్టు తరఫున 2017లో మిశ్రా చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక 2000–01 సీజన్లో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన అమిత్ మిశ్రా 25 ఏళ్ల పాటు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.‘నా జీవితంలో అన్ని రకాలుగా భాగమైన క్రికెట్కు 25 ఏళ్ల తర్వాత గుడ్బై చెబుతున్నా. నా కెరీర్లో ఎన్నో విజయాలు, మలుపులు, భావోద్వేగాలు ఉన్నాయి. నా కెరీర్లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మరో రూపంలో ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది’ అని అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్లో మిశ్రా 22 టెస్టుల్లో 35.72 సగటుతో మొత్తం 76 వికెట్లు పడగొట్టాడు. 36 వన్డేలు, 10 టీ20ల్లో కలిపి అమిత్ 80 వికెట్లు తీశాడు. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్లో ఎక్కువగా మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిల సారథ్యంలోనే ఆడటం విశేషం.కెప్టెన్లకు నచ్చితేనేఇక రిటైర్మెంట్ అనంతరం అమిత్ మిశ్రా హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. తనకు టీమిండియాలో అవకాశాలు తక్కువగా రావడం పట్ల స్పందించాడు. ‘‘నిజంగా ఓ ఆటగాడిని అన్నింటికంటే నిరాశపరిచే విషయం ఇదే. కొన్నిసార్లు జట్టులో ఉంటాము.. మరికొన్ని సార్లు మనల్ని ఎంపిక చేయరు.మరికొన్నిసార్లు జట్టులో ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఉండదు. ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటే విసుగు వస్తుంది. నా విషయంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. కొంత మంది ఆటగాళ్లంటే కెప్టెన్లకు ఇష్టం.కాబట్టి వారికి వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి. అయినా.. అదో పెద్ద విషయం కాదు. ఏదేమైనా మనల్ని మనం నిరూపించుకుంటే అవకాశం అదే తలుపు తడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే అంతా ఉంది.ఒకవేళ సెలక్టర్లు నన్ను పరిగణనలోకి తీసుకోలేదంటే.. ఫిట్నెస్, బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా ఎందులో ఇంకా మెరుగవ్వాలని మాత్రమే ఆలోచించేవాడిని. టీమిండియాకు ఆడే ఛాన్స్ వచ్చినప్పుడల్లా నన్ను నేను నిరూపించుకున్నాడు. ఎల్లప్పుడూ కఠిన శ్రమ, అంకిత భావంతో పనిచేసే వాడిని’’ అని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.ధోనిని అడిగాను కూడా!కాగా గతంలో ధోని జట్టులో తనకు స్థానం కరువు అవడం గురించి మిశ్రా స్పందించాడు. ‘‘జట్టు ఎంపిక సమయంలో చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. మనం మన ఆటపై దృష్టి పెడితే చాలు. తుదిజట్టును కెప్టెన్ నిర్ణయిస్తాడు. నాకు ఎంఎస్ ధోనితో మంచి అనుబంధం ఉంది.నన్ను ఎందుకు తీసుకోలేదని ఒకటి.. రెండు సందర్భాల్లో అతడిని అడిగాను. జట్టు కూర్పునకు అనుగుణంగానే నన్ను పక్కనపెట్టామని అతడు చెప్పాడు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్రఇదిలా ఉంటే.. హరియాణా తరఫున రంజీ ట్రోఫీలో ఎన్నో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు నమోదు చేసిన మిశ్రా...బ్యాటింగ్లో కూడా కర్ణాటకపై డబుల్ సెంచరీ (202 నాటౌట్) సాధించడం విశేషం. ఇక ఐపీఎల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్ర వేసిన బౌలర్లలో అమిత్ మిశ్రా కూడా ఒకడు. 2008 నుంచి 2024 వరకు మధ్యలో ఒక సీజన్ మినహా ప్రతీసారి మిశ్రా ఐపీఎల్ బరిలోకి దిగాడు.అంతేకాదు.. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో తరఫున ఆడిన అతను 162 మ్యాచ్లలో 7.37 ఎకానమీతో 174 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 3 హ్యాట్రిక్లు (2008, 2011, 2013) సాధించిన ఏకైన బౌలర్గా మిశ్రా నిలిచాడు. చదవండి: కివీస్ క్రికెట్ దిగ్గజం సంచలన నిర్ణయం.. 41 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ.. ఓ ట్విస్ట్ -
అతడికి అనుమతి ఎందుకు?.. అసలు బీసీసీఐ ఏం చేస్తోంది?
ఆసియా కప్-2025 టోర్నమెంట్, ఆ తర్వాత వరుస సిరీస్ల నేపథ్యంలో ఇప్పటికే భారత ఆటగాళ్లలో చాలా మంది ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యారు. బెంగళూరులో నిర్వహించిన టెస్టుల్లో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), టెస్టు సారథి శుబ్మన్ గిల్, టీ20 జట్టు నాయకుడు సూర్యకుమార్ యాదవ్ పాసయ్యారు.వీరితో పాటు మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మ (Jitesh Sharma), ప్రసిద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అభినవ్ మనోహర్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, సంజూ శాంసన్, శివం దూబే, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, ముకేశ్ కుమార్, హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్ తదితరులు ఫిట్నెస్ పరీక్ష పూర్తి చేసుకున్నట్లు సమాచారం.వారంతా రెండో దశలో..ఇక రెండో దశలో భాగంగా రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ నెలలో ఫిట్నెస్ పరీక్ష పూర్తిచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆటగాళ్లంతా బెంగళూరులో ఫిట్నెస్ పరీక్షకు హాజరైతే.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మాత్రం లండన్లోనే ఉన్నాడు.లండన్లోనే కోహ్లి ఫిట్నెస్ టెస్టుఅక్కడే కోహ్లి ఫిట్నెస్ పరీక్షలో పాల్గొన్నట్లు సమాచారం. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి కోహ్లి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, టీమిండియా అభిమానులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘కోహ్లి భారత్లో కంటే లండన్లోనే ఎక్కువగా ఉంటాడు.తన కుటుంబమంతా అక్కడే ఉంటుంది. మ్యాచ్లు, ఐపీఎల్ ఉన్నపుడు మాత్రమే ఇండియాకు వస్తాడు. ఇప్పుడు ఫిట్నెస్ టెస్టు కూడా అక్కడేనా?.. అసలు బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?..అతడు ఏమైనా స్పెషలా? వేరేదేశంలో ఫిట్నెస్ టెస్టుకు ఎలా అనుమతినిస్తారు? మాకైతే ఇప్పుడు కోహ్లి ఇంగ్లండ్ క్రికెటర్ ఏమో అనే డౌట్ వస్తోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, కోహ్లి తీరును ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీకాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టుల నుంచి కూడా వైదొలిగాడు. ప్రస్తుతం వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్.. తదుపరి ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. తదుపరి ఆసియా కప్-2025 టోర్నీలో పాల్గొననుంది. సెప్టెంబరు 9-28 వరకు పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి యూఏఈ వేదిక.చదవండి: ధృవ్ జురెల్ను తప్పించిన సెలెక్టర్లు -
బెంగళూరు తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ యేడు ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆనందం ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కానీ, అభిమానాలకు కానీ, యాజమాన్యానికి కానీ ఎన్నో రోజుల మిగల్లేదు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన మరుసటి రోజు, అంటే జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 75 మందికి పైగా గాయపడ్డారు.ఈ విషాద సంఘటనపై నాడు యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మానవాళి మొత్తం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. చాలా కాలం సైలెంట్గా ఉన్న ఆర్సీబీ యాజమాన్యం కొద్ది రోజుల కిందటే మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది.తాజాగా ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా స్పందించాడు (తొలిసారి). ఆర్సీబీ అధికార వెబ్సైట్ ద్వారా తన భావాలను పంచుకున్నాడు.జూన్ 4 లాంటి విషాదాన్ని జీవితంలో ఏదీ సిద్ధం చేయదు. ఇది మా ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత ఆనందకరమైన క్షణంగా ఉండాల్సింది. కానీ విషాదంగా మారింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. గాయాలపాలైన వారు పూర్తిగా కోలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. వారి బాధ మా కథలో భాగమైంది. ఇకపై జాగ్రత్తగా, గౌరవంతో, బాధ్యతతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.“Nothing in life really prepares you for a heartbreak like June 4th. What should’ve been the happiest moment in our franchise’s history… turned into something tragic. I’ve been thinking of and praying for the families of those we lost… and for our fans who were injured. Your… pic.twitter.com/nsJrKDdKWB— Royal Challengers Bengaluru (@RCBTweets) September 3, 2025కాగా, బెంగళూరు దుర్ఘటనపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి మైఖేల్ డికున్హా నేతృత్వంలోని కమిషన్ ఆర్సీబీ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో ఆర్సీబీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. బెంగళూరులో శ్రద్ధాంజలి స్థూపం నిర్మించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా 6-పాయింట్ల మానిఫెస్టోను విడుదల చేసింది. -
‘రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’
కెప్టెన్గా టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మ (Rohit Sharma) సొంతం. 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ను చాంపియన్గా నిలిపిన హిట్మ్యాన్.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో టైటిల్ సాధించాడు.అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్తద్వారా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni- 3) తర్వాత భారత్కు అత్యధిక ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇక 2024లో వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా గుడ్బై చెప్పాడు.ప్రస్తుతం వన్డేల్లో కెప్టెన్ కొనసాగుతున్న 38 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా పదిహేనేళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ గురించి టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి‘‘భారత క్రికెట్ మంచి కోసం రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 2019లో మేము రాజ్కోట్ వేదికగా బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడుతున్నపుడు.. నేను సరిగ్గా బౌల్ చేయలేకపోయాను. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాను.అప్పుడు డ్రెసింగ్రూమ్లో రోహిత్ భయ్యా నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. జట్టులోని సభ్యులంతా వెళ్లిపోయిన తర్వాత.. నా దగ్గరికి వచ్చి.. నేనెలా ఆడాలో చెప్పాడు. నాలో ఉన్న నైపుణ్యాల గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలియదని.. నా సామర్థ్యాలను నేనే బయపెట్టాలని చెప్పాడు.ఇలాంటి కెప్టెన్లు అరుదుమేము స్టేడియం వీడి వెళ్తున్నపుడు అభిమానులంతా రోహిత్ భయ్యాను చూసి సంతోషంతో కేకలు వేస్తుంటే.. ‘ఏదో ఒకరోజు నీకు కూడా ఇలాంటి ఆనందకర సమయం వస్తుంది’ అని నాతో అన్నాడు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పాడు.ఇలాంటి కెప్టెన్లు అరుదు. ప్రతి మ్యాచ్ తర్వాత భాయ్ నాతో మాట్లాడుతూ.. నా తప్పొప్పులను ఓపికగా వివరించాడు. ఇంత మంచి మనసు ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఉంటారా? అనిపించింది. రిషభ్ పంత్తో కూడా భయ్యా ఇలాగే ఉంటాడు.పూర్తి ఫిట్గావ్యక్తిగా, కెప్టెన్గా ఆయనకు ఆయనే సాటి. నిజంగా ఆరోజు రోహిత్ భయ్యా స్థానంలో వేరే వాళ్లుంటే అంత ఓపికగా నాతో మాట్లాడేవారే కాదు. ఈ మధ్య జాతీయ క్రికెట్ అకాడమీలో భయ్యాను కలిశాను. ఆయన పూర్తి ఫిట్గా ఉన్నాడు. నిజంగా ఇలాంటి కెప్టెన్లు టీమిండియాకు అవసరం. ఆయన ఇంకో పదేళ్లు ఆడితే బాగుంటుంది’’ అని ఖలీల్ అహ్మద్ రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు.రోహిత్ కెప్టెన్సీలో అరంగేట్రంకాగా 2018లో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకోగా.. అతడి స్థానంలో రోహిత్ శర్మ ఆసియా వన్డే కప్ టోర్నీలో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. అప్పుడే ఖలీల్ అహ్మద్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 11 వన్డేలు, 18 టీ20లు ఆడిన ఖలీల్ అహ్మద్.. ఆయా ఫార్మాట్లలో 15, 16 వికెట్లు తీశాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ గతేడాది చివరగా టీమిండియాకు ఆడాడు.చదవండి: అవకాశం రాకుంటే.. నేనూ యూఎస్కు వెళ్లిపోయేవాడిని: టీమిండియా స్టార్ -
కోహ్లి దేశీ బాయ్!.. రన్ మెషీన్ మాత్రం అతడే: గంభీర్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ తర్వాత టీమిండియాతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్కు కూడా విశ్రాంతి లభించింది. దాదాపు నెలరోజులుగా ఈ మాజీ క్రికెటర్ ఎక్కువగా కుటుంబానికే సమయం కేటాయించాడు. ఇక ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)-2025 ఫైనల్కు కూడా గౌతీ హాజరయ్యాడు.ఈ క్రమంలో ఓ ఫన్ సెగ్మెంట్లో గంభీర్ భాగమయ్యాడు. ఈ పదం వినగానే మీకు ఏ క్రికెటర్ గుర్తుకువస్తారు అంటూ యాంకర్ అడుగగా.. ఈ ఢిల్లీ స్టార్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ‘క్లచ్ (క్లిష్ట పరిస్థితులు, ఒత్తిడిలో గొప్పగా రాణించే ఆటగాడు’ ఎవరన్న ప్రశ్నకు గంభీర్.. సచిన్ టెండుల్కర్ పేరు చెప్పాడు.ఇక ‘దేశీ బాయ్’గా విరాట్ కోహ్లిని అభివర్ణించిన గౌతీ.. స్పీడ్ అన్న పదం వినగానే తనకు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గుర్తుకువస్తాడన్నాడు. అదే విధంగా.. ‘గోల్డెన్ ఆర్మ్ (పార్ట్ టైమ్ బౌలరే అయినా కీలక వికెట్లు పడగొట్టే ఆటగాడు)’ అనగానే నితీశ్ రాణా పేరు చెప్పిన గంభీర్.. ‘మోస్ట్ స్టైలిష్’ అన్న పదానికి శుబ్మన్ గిల్ పేరు చెప్పాడు.ఇక ‘మిస్టర్ కన్సిస్టెంట్’గా రాహుల్ ద్రవిడ్ను పేర్కొన్న గంభీర్.. ‘రన్మెషీన్’ అనగానే తనకు వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుకువస్తాడని తెలిపాడు. ‘మోస్ట్ ఫన్నీ’గా రిషభ్ పంత్ పేరు చెప్పిన గంభీర్.. ‘డెత్ ఓవర్ స్పెషలిస్టు’గా జహీర్ ఖాన్కు ఓటేశాడు.కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టాడు. వన్డే, టీ20లలో కోచ్గా వరుస విజయాలు సాధించిన ఈ ఢిల్లీ మాజీ బ్యాటర్.. టెస్టుల్లో మాత్రం విఫలమయ్యాడు.గంభీర్ మార్గదర్శనంలో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో వైట్వాష్కు గురైన టీమిండియా.. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (3-1)తో కోల్పోయింది. అయితే, ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ తర్వాత.. శుబ్మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఇందులో బర్మింగ్హామ్ టెస్టు విజయం ప్రత్యేకమైనది. ఈ వేదికపై తొలిసారి భారత్ టెస్టు గెలవడం విశేషం. ఈ సానుకూల ఫలితాలు గంభీర్కు కాస్త ఉపశమనం కలిగించాయి.ఇక తదుపరి ఆసియా కప్-2025 టోర్నమెంట్తో టీమిండియాతో పాటు గంభీర్ బిజీ కానున్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో సెప్టెంబరు 9-28 వరకు ఈ టోర్నీ జరుగనుంది. కాగా ఈ ఏడాది గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. గతేడాది ప్రారంభమైన ఢిల్లీ ప్రీమియర్ లీగ్.. రెండో ఎడిషన్ ఆదివారం ముగిసింది. అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో.. నితీశ్ రాణా కెప్టెన్సీలోని వెస్ట్ ఢిల్లీ లయన్స్.. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా డీపీఎల్-2025 చాంపియన్గా అవతరించింది. -
నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి
భారత క్రికెట్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎవరివారే ప్రత్యేకం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనుడు. విరాట్ కోహ్లి (Virat Kohli).. టెస్టుల్లో టీమిండియాను అగ్రపథాన నిలిపిన సారథి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక సెంచరీల వీరుడిగా చెరగని రికార్డు..రోహిత్ శర్మ (Rohit Sharma).. హిట్మ్యాన్గా గుర్తింపు.. వన్డే, టీ20లలో తిరుగులేని బ్యాటర్.. కెప్టెన్గా భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన నాయకుడు. అయితే, కోహ్లి, రోహిత్ తొలినాళ్లలో ధోని సారథ్యంలోనే ఆడారు. అతడి నాయకత్వంలోనే రోహిత్ ఓపెనర్గా ప్రమోట్ అయితే.. కోహ్లి నాడు భవిష్య కెప్టెన్గా ఎదిగాడు.నాడు పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ఆసియా టీ20 కప్-2025 సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురికి సంబంధించిన ఓ పాత ఘటన తాజాగా వైరల్ అవుతోంది. ఆసియా వన్డే కప్-2012లో భాగంగా నాడు టీమిండియా పాకిస్తాన్తో తలపడింది. ఆరోజు 231/2తో పటిష్టంగా ఉన్న పాక్ జట్టు.. భారీ స్కోరు దిశగా పయనిస్తుండగా.. కోహ్లి- రోహిత్ వల్ల తప్పిదం జరిగింది.ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారుటీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో..38 ఓవర్ తొలి బంతిని ఉమర్ అక్మల్ బౌండరీ దిశగా తరలించాడు. బంతిని ఆపే క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి- రోహిత్ బలంగా ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారు. ఫలితంగా పాక్కు అదనంగా మరో రెండు పరుగులు.. మొత్తంగా త్రీ రన్స్ వచ్చాయి.ధోనికి చాలా కోపం వచ్చిందిదీంతో కెప్టెన్ ధోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురించి 2020లో అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు. ‘‘ఆరోజు ఎంఎస్ ఏమాత్రం సంతోషంగా లేడు. అప్పుడు తనకి చాలా కోపం వచ్చింది. వాళ్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. మన వల్ల అదనపు పరుగులు కూడా వస్తున్నాయి.అప్పుడు వాళ్లకు ఒక్క పరుగే రావాల్సింది. కానీ మనం మూడు ఇచ్చాము. ఇర్ఫాన్ బంతి వెంట నెమ్మదిగా పరిగెడుతూ ధోని వైపు త్రో చేశాడు. అప్పుడు ఎంఎస్.. ‘అసలు వీళ్లిద్దరు అలా ఎలా ఢీకొట్టుకున్నారు. మూడు పరుగులు ఎలా ఇచ్చారు’ అన్నట్లుగా ముఖంలో భావాలు పలికించాడు.ఆరోజు నేను మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. రోహిత్ డీప్ స్వ్కేర్ లెగ్లో ఉన్నాడు. ఇద్దరమూ బంతిని పట్టుకోవాలని పరిగెత్తాము. ఇంతలో నా తల కుడి భాగం అతడి భుజానికి బలంగా తాకింది. అప్పటికి అదేమీ సీరియస్ అనిపించలేదు.కానీ ఐదు నిమిషాల తర్వాత అసలేం జరిగిందో మాకు అర్థమైంది’’ అని కోహ్లి గుర్తుచేసుకున్నాడు. కాగా నాటి మ్యాచ్లో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ఛేజింగ్ ‘కింగ్’ భారీ సెంచరీఇక లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి 148 బంతుల్లో 183 పరుగులు సాధించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సచిన్ టెండుల్కర్తో కలిసి రెండో వికెట్కు 133 పరుగులు జోడించిన కోహ్లి.. రోహిత్తో కలిసి 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా.. ఆరు వికెట్లు మిగిలి ఉండగానే.. 48 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. నాటి మ్యాచ్లో కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు -
టాప్-5 క్రికెటర్లలో కోహ్లికి నో ఛాన్స్.. సారీ చెప్పిన డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించినప్పటి నుంచి మొదలైన వారిద్దరి స్నేహ బంధం ఇప్పటికి అలానే కొనసాగుతోంది. అయితే ప్రతీసారి కోహ్లికి సపోర్ట్గా ఉండే ఏబీడీ.. ఈసారి మాత్రం కింగ్ అభిమానులను నిరాశపరిచాడు. డివిలియర్స్ ఇటీవల బియర్డ్ బీఫోర్ వికెట్ పాడ్ కాస్ట్లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్లో తాను చూసిన టాప్-5 బెస్ట్ టెస్టు క్రికెటర్లు ఎవరన్న ప్రశ్న హోస్ట్ నుంచి డివిలియర్స్కు ఎదురైంది. ఆశ్యర్యకరంగా డివిలియర్స్ ఎంచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి పేరు లేదు.నేను చాలా మంది దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడాను. టాప్-5లో అగ్రస్దానం కచ్చితంగా జాక్ కల్లిస్(సౌతాఫ్రికా)కే దక్కుతుంది. ఆ తర్వాత మొహమ్మద్ ఆసిఫ్(పాకిస్తాన్) ఉంటాడు. జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యుత్తమ సీమర్ అతడే. ఇక మూడో స్ధానం షేన్ వార్న్(ఆస్ట్రేలియా). వార్నీ బౌలింగ్ని ఆడటాన్ని ఆస్వాదిస్తా. కానీ అతడి బౌలింగ్లో నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు.అతడు బంతిని రిలీజ్ చేసే విధానం, అతడి హెయిర్ స్టైల్.. వర్ణించడానికి మాటలు చాలవు. ఇక నాలుగో స్ధానంలో ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లండ్) ఉంటాడు. ఎడ్జ్బాస్టన్లో కల్లిస్కు ఫ్లింటాఫ్ వేసిన యార్కర్ ఇప్పటికీ నాకు గుర్తు ఉంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ యార్కర్ అదే. చివరగా మరో స్ధానం మిగిలి ఉంది. ఈ ప్లేస్ ఇండియన్ లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్కు ఇవ్వాలనకుంటున్నాను. నేను అతడికి ఒక అభిమానని. సచిన్ బ్యాటింగ్ స్టైల్ చాలా అందంగా ఉంటుందని డివిలియర్స్ పేర్కొన్నాడు. అయితే పక్కన ఉన్న ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్.. కోహ్లికి ఛాన్స్ ఇవ్వలేదని గుర్తించాడు. అందుకు ఏబీడీ స్పందిస్తూ.. సారీ విరాట్. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమని అన్నాడు. కాగా ఇటీవల ముగిసిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో సౌతాఫ్రికాను డివిలియర్స్ ఛాంపియన్గా నిలిపాడు.చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు -
పొట్టివాళ్లే గొప్ప బ్యాటర్లు... సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణ: ద్రవిడ్
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లే గొప్ప బ్యాటర్లుగా ఎదిగారని పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (Virat Kohli) చక్కటి ఉదాహరణ అని తెలిపాడు.అయితే, ప్రస్తుత టీ20 జమానాలో తనలాంటి పొడవైన బ్యాటర్లకు ఎత్తు అదనపు ప్రయోజనంగా మారిందని ద్రవిడ్ పేర్కొన్నాడు. బలంగా సిక్సర్లు బాదేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. హల్ చాల్ ఔర్ సవాల్ పాడ్కాస్ట్లో ఈ మేరకు మాట్లాడుతూ..నేను కాస్త పొడవుగా ఉంటాను.. కాబట్టి‘‘క్రీజులో ఉన్నపుడు బ్యాలెన్స్ చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. గావస్కర్ (Sunil Gavaskar) అద్భుతంగా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటాడు. క్రీజులో ఆయన నిలబడే తీరు సూపర్.నేను కాస్త పొడవుగా ఉంటాను కదా!.. కాబట్టి ఆయనను అనుకరించడం సాధ్యంకాకపోయేది. నాకైతే బ్యాలెన్స్ చేసుకోలేక.. అసౌకర్యంగా ఉండేది. అలాగే సచిన్ టెండుల్కర్ కూడా!గావస్కర్ మాదిరే తనూ చక్కగా బ్యాలెన్స్ చేసుకునేవాడు. ఏదేమైనా పొట్టిగా ఉన్న వాళ్లకు ఇదొక అదనపు ప్రయోజనం. వాళ్ల గురుత్వాకర్షణ కేంద్ర బలం తక్కువగా ఉంటుంది. అందుకే గొప్ప బ్యాటర్లలో చాలామంది పొట్టివాళేల ఉంటారు.సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణగావస్కర్, టెండుల్కర్, బ్రియన్ లారా, రిక్కీ పాంటింగ్.. డొనాల్డ్ బ్రాడ్మన్ ఇందుకు ఉదాహరణ. కోహ్లి కూడా షార్టిష్. నేను తనని పొట్టివాడు అని అనడం కోహ్లికి నచ్చకపోవచ్చు’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.అయితే, టీ20 యుగంలో హైట్ బ్యాటర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ద్రవిడ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. భౌతికశాస్త్రం అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. కెవిన్ పీటర్సన్, కీరన్ పొలార్డ్, పొడవుగా ఉండటం వల్ల సిక్సర్లు బలంగా బాదగలిగారు. టీ20 ఫార్మాట్ విస్తృతమయ్యాక టాలెస్ట్ బ్యాటర్ల హవా నడుస్తోంది’’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.చదవండి: గిల్, స్కై, సంజూ కాదు!.. టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు: సెహ్వాగ్ -
కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్
మార్క్ వుడ్.. వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగంతో బంతులు సంధించే పేస్ బౌలర్లలో ఒకడు. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడిది. కానీ ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ను ఓ బ్యాటర్ భయపెట్టాడంట. సదరు బ్యాటర్కు బౌలింగ్ చేసేందుకు వుడ్ తీవ్రంగా శ్రమించాడంట.ఆ బ్యాటర్ ఎవరో కాదు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ఏడాది మార్చి నుంచి గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉంటున్న మార్క్ వుడ్.. తిరిగి తన ఫిట్నెస్ను పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. యాషెస్ సిరీస్ సమయానికి గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.అయితే మార్క్ వుడ్ తాజాగా ఓవర్లాప్ క్రికెట్ అనే యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరన్న ప్రశ్న వుడ్కు ఎదురైంది. అందుకు అతడు బదులుగా రోహిత్ శర్మ పేరును చెప్పాడు. 35 ఏళ్ల మార్క్ వుడ్ అన్ని ఫార్మాట్లలోనూ హిట్మ్యాన్ను ఎదుర్కొన్నాడు."నా కెరీర్లో ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ రోహిత్ శర్మ. ఫార్మాట్ ఏదైనా కానీ అతడికి బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాను. షార్ట్ బాల్ వేసినప్పుడు అతడిని ఔట్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. కానీ ఆ రోజు అతడు మంచి రిథమ్లో ఉంటే అపడం ఎవరి తరం కాదు. భారీ షాట్లతో విరుచుకుపడతాడు" అని వుడ్ పేర్కొన్నాడు.అదేవిధంగా విరాట్ కోహ్లి గురుంచి కూడా వుడ్ మాట్లాడాడు. "కోహ్లికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ బౌలర్కు అతడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ ఆఫ్సైడ్ ఫోర్త్, ఫిఫ్త్ స్టంప్లైన్లో వచ్చే బంతులు ఆడే విషయంలో మాత్రం అతడికి బలహీనత ఉంది. వాటికి తప్ప మరో బంతికి అతడిని అవుట్ చేయడం చాలా కష్టం" అని మార్క్ వుడ్ చెప్పుకొచ్చాడు. యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా ద్వయం స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్లకు బౌలింగ్ చేయడం కష్టమని ఈ ఇంగ్లీష్ స్పీడ్ స్టార్ తెలిపాడు.చదవండి: పాక్, భారత్, శ్రీలంక కాదు.. ఆసియాకప్ గెలిచేది వాళ్లే: పాక్ మాజీ క్రికెటర్ -
ODIs: ‘కోహ్లిని తప్పించలేరు.. రోహిత్ శర్మపై వేటు వేసేందుకు కుట్ర?’
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో అంతర్గత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి రోహిత్ తనకు తానుగా తప్పుకొనేలా చేయాలని చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.కొత్తగా బ్రోంకో టెస్టు అయితే, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దగ్గర మాత్రం వారి పప్పులు ఉడకవని మనోజ్ తివారి పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే.. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్షకు కొత్తగా బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రగ్బీ, ఫుట్బాల్ ఆటగాళ్లకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ను పరీక్షించాలని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (CoE) నిర్ణయించింది.ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.కోహ్లిని తప్పించలేరు.. రోహిత్పై వేటు వేసేందుకు కుట్రఈ నేపథ్యంలో బ్రోంకో టెస్టు గురించి మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల నుంచి విరాట్ కోహ్లిని తప్పించడం అంత తేలికేమీ కాదు. అయితే, రోహిత్ శర్మపై విషయంలో మాత్రం వారు సఫలమయ్యే అవకాశం ఉంది. భారత క్రికెట్లో ఏం జరుగుతుందో నేను గత కొన్నాళ్లుగా నిశితంగా పరిశీలిస్తున్నా.కొన్ని రోజుల క్రితం బ్రోంకో టెస్టు ప్రవేశపెట్టారు. రోహిత్ శర్మ లాంటి వాళ్లను బయటకు పంపేందుకే ఇలాంటి కఠినమైన ఫిట్నెస్ పరీక్షను తీసుకువచ్చారు. అన్నిటికంటే ఇదే టఫెస్ట్ ఫిట్నెస్ టెస్టు. అయినా.. ఇప్పుడే ఇది ఎందుకు ప్రవేశపెట్టారు? హెడ్కోచ్గా తొలి టెస్టు సిరీస్కు సన్నద్ధమైనపుడే దీనిని తీసుకురావాల్సింది.ఈ ప్రశ్నలకు నాకైతే బదులు తెలియదు. అయితే, నిశితంగా పరిశీలిస్తే మాత్రం రోహిత్ శర్మ ఈ టెస్టు పాస్ కావడం కష్టం. అతడు ఫిట్నెస్పై అంతగా దృష్టి పెట్టడు. బ్రోంకో టెస్టు ద్వారా అతడిని ఆపేయాలనే ఉద్ధేశంతో ఉన్నారని నాకు సందేహం’’ అంటూ మనోజ్ తివారి పరోక్షంగా హెడ్కోచ్ గౌతం గంభీర్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.చదవండి: ఒక్క సిక్స్తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్ -
ఆర్సీబీ కోచ్ లేదంటే మెంటార్గా వస్తా: ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB de Villiers)కు ఉన్న ఫ్యాన్ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్తోనూ అభిమానులను అలరించాడు.ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డివిలియర్స్.. 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరాడు. రిటైర్మెంట్ వరకు అదే జట్టుతో కొనసాగిన ఏబీడీకి ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. కోహ్లితో కలిసి సంబరాలుఐపీఎల్-2025 ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్తో కలిసి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీకి మద్దతుగా వచ్చి.. ఆర్సీబీ పదిహేడేళ్ల సుదీర్ఘకల నెరవేరగానే డివిలియర్స్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ డివిలియర్స్ తమ జట్టులో భాగంగానే భావిస్తారు. అతడు తిరిగి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిలాషను తెలుపుతూ ఉంటారు. ఇక ఇందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. డివిలియర్స్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు.కోచ్ లేదంటే మెంటార్గా..అయితే, ఆటగాడిగా రీఎంట్రీ కాకుండా.. కోచ్ లేదంటే మెంటార్ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే, సీజన్ ఆసాంతం ప్రొఫెషనల్ విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా లేను.మనసంతా ఆర్సీబీతోనేఆరోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంఛైజీ నాకు కోచ్ లేదా మెంటార్గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఐపీఎల్లో పునరాగమనం చేస్తే కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటాను’’ అని డివిలియర్స్ వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు.పరుగుల వీరుడుకాగా సౌతాఫ్రికా తరఫున 2004- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు డివిలియర్స్. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 8765, 9577, 1672 పరుగులు సాధించాడు.ఇక ఐపీఎల్లో 184 మ్యాచ్లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. 2021లో ఆర్సీబీ తరఫున కోల్కతా నైట్ రైడర్స్తో పోరులో డివిలియర్స్ చివరగా తన ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్ పుజారా -
ఇంపాక్ట్ ప్లేయర్గా రావాల్సి వస్తే.. ఆరోజే రిటైర్మెంట్: కోహ్లి
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి ఆడాలనేది ఎంతో మంది యువ క్రికెటర్లకు చిరకాల కోరిక. అతడితో కలిసి డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకున్నా చాలని తపించే ప్లేయర్లు ఎందరో!.. ఐపీఎల్-2025 ద్వారా ఉత్తరప్రదేశ్ కుర్రాడు స్వస్తిక్ చికారాకు ఆ కల నెరవేరింది. క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ప్రాతినిథ్య వహించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.ట్రోఫీని ముద్దాడుతూఅరంగేట్రం చేయకపోయినా.. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ పదిహేడేళ్ల తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టులో చికారా భాగమయ్యాడు. అంతేకాదు.. కోహ్లితో కలిసి ట్రోఫీని ముద్దాడుతూ ఫొటోలకు ఫోజులిస్తూ సంతోషంలో తేలిపోయాడు. ఇరవై ఏళ్ల ఈ యూపీ బ్యాటర్ తాజాగా కోహ్లి గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు.ఆరోజే క్రికెట్ను వదిలేస్తాను‘‘‘నేను ఎంత కాలం ఫిట్గా ఉంటే.. అంతకాలం క్రికెట్ ఆడతాను. ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రం అస్సలు రాను. సింహంలా ఆడటంలోనే మజా ఉంది. నేను 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయగలగాలి. ఆ తర్వాత బ్యాటింగ్కు రావాలి.ఏ రోజైతే నేను ఇంపాక్ట్ ప్లేయర్గా రావాల్సి వస్తుందో ఆరోజే క్రికెట్ను వదిలేస్తాను’ అని విరాట్ భయ్యా నాతో చెప్పారు’’ అని స్వస్తిక్ చికారా (Swastik Chikara) రెవ్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే.. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ ఈసారి అందడంతో ఫుల్ ఖుషీ అయిపోయాడు.వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న కోహ్లిఇక 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నాడు ఈ రన్మెషీన్.కాగా 36 ఏళ్ల కోహ్లి ఇప్పటి టీమిండియా తరఫున 123 టెస్టుల్లో 9230, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. వన్డేల్లో సచిన్ టెండుల్కర్కు కూడా సాధ్యంకాని రీతిలో 51 సెంచరీలు సాధించి.. 14181 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటికి 267 మ్యాచ్లు ఆడిన కోహ్లి 8661 రన్స్ రాబట్టాడు.చదవండి: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు -
లార్డ్స్లో విరాట్ కోహ్లి.. ఆ సిరీస్కు సన్నద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!
వన్డే వరల్డ్కప్-2027 వరకు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఆటలో కొనసాగుతారా?.. ఈ ఇద్దరి పేర్లను మెగా ఐసీసీ టోర్నీకి బీసీసీఐ (BCCI) సెలక్టర్లు పరిగణిస్తున్నారా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదో హాట్టాపిక్.ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి విరాట్, రోహిత్ పేర్లు మాయంకావడం.. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకున్న ఐసీసీ మళ్లీ వారి పేర్లను చేర్చడం.. వన్డే రిటైర్మెంట్ వార్తలకు ఊతమిచ్చింది. ఇలాంటి తరుణంలో విరాట్, రోహిత్.. ఇద్దరూ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడం ద్వారా వదంతులకు చెక్ పెట్టేశారు.లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్కు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం లండన్లో ఉన్న విరాట్ కోహ్లి.. తాజాగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ దాదాపు రెండు గంటల పాటు నెట్స్లో తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం.స్పిన్, పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ... వైవిధ్యభరితమైన షాట్లు ఆడుతూ కోహ్లి తన ప్రాక్టీస్ సెషన్ను పూర్తిచేసినట్లు తెలిసింది. ఇక ప్రాక్టీస్కు వెళ్లిన సమయంలో లార్డ్స్ స్టేడియంలో అభిమానులతో కలిసి కోహ్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు.భారత్-ఎ తరఫునమరోవైపు.. రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. మరో అనూహ్య నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో స్వదేశంలో జరుగబోయే అనధికారిక వన్డే సిరీస్లో భారత్-ఎ తరఫున ఆడాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు కూడా గుడ్బై చెప్పగా.. ఆ వెంటనే కోహ్లి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ ఇద్దరూ వన్డేల్లో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేశారు.ఆసీస్ సిరీస్తో కోహ్లి, రోహిత్ రీ ఎంట్రీఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20లలో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్మన్ గిల్ టీమిండియా పగ్గాలు చేపట్టారు. గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసిన భారత్.. తదుపరి యూఏఈ వేదికగా సూర్య కెప్టెన్సీలో ఆసియా టీ20 కప్-2025 టోర్నీ ఆడనుంది. సెప్టెంబరు 9-28 వరకు జరిగే ఈ ఖండాంతర టోర్నీ అనంతరం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులు ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. చదవండి: Asia Cup 2025: అదొక వింత నిర్ణయం.. కెప్టెన్ అయ్యే ప్లేయర్ను జట్టు నుంచి తీసేస్తారా?రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు -
రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా టూర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత రో-కో ద్వయం ఇప్పటివరకు భారత తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే వన్డే ప్రపంచకప్-2027 దృష్ట్యా వీరిద్దరి స్ధానాల్లో యువ ఆటగాళ్లను బీసీసీఐ సిద్దం చేయనుందని, అక్టోబర్లో ఆసీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డేల సిరీసే ఆఖరిదని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సీనియర్ ద్వయం రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ (BCCI ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అవన్నీ వట్టి రూమర్సే అని అతడు కొట్టిపారేశారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్లోకి తిరిగొచ్చేందుకు తమ ట్రైనింగ్ను తిరిగి ప్రారంభించారు. కాగా రాజీవ్ శుక్లా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో శుక్లాను సచిన్ టెండూల్కర్లాగానే రోహిత్, కోహ్లిలకు ప్రత్యేకంగా ఫేర్వెల్ నిర్వహిస్తారా ? అని హోస్ట్ ప్రశ్నించాడు."రోహిత్, కోహ్లి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారు. వారు ప్రస్తుతం కేవలం రెండు ఫార్మాట్ల నుంచి మాత్రమే తప్పుకొన్నారు. మరో ఫార్మాట్లో ఆడుతున్నప్పుడు మీరెందుకు వారి ఫేర్వెల్ గురుంచి మాట్లాడుతున్నారు? వారి రిటైర్మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? బీసీసీఐకి ఒక పాలసీ ఉంటుంది. బీసీసీఐ ఎవరిని కూడా రిటైర్మెంట్ ఇవ్వమని అడగదు. వారే సొంతంగా తమ నిర్ణయాలు తీసుకోవాలి. ప్లేయర్ తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. ఆటగాళ్లు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు. కానీ ఇదంతా ఇప్పుడు అనవసరం.విరాట్ కోహ్లి చాలా ఫిట్గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా బాగా ఆడుతున్నాడు. కాబట్టి వారి ఫేర్వెల్ గురుంచి ఆలోచిండం ఆపయేండి" అని శుక్లా పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
విరాట్ నుంచి ఆ రెండు రికార్డులకు ముప్పు తప్పినట్లే..!
క్రికెట్లో రికార్డుల రారాజు ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు విరాట్ కోహ్లి. ఈ బ్యాటింగ్ దిగ్గజం మరో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ బిరుదుకు పూర్తి న్యాయం జరగాలంటే విరాట్ మరో రెండు భారీ రికార్డులు బద్దలు కొట్టాల్సి ఉంది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎందుకుంటే, విరాట్ ఇదివరకే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజాగా విరాట్ వన్డే రిటైర్మెంట్పై కూడా ఊహాగానాలు ఎక్కువయ్యాయి. పైగా అతడి వయసు కూడా పైబడుతుంది.ఈ పరిస్థితుల్లో విరాట్ సచిన్ ఖాతాలో ఉన్న ఆ రెండు భారీ రికార్డులను బద్దలు కొట్టడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఆ రికార్డులకు విరాట్ నుంచి ముప్పు తప్పినట్లే అనుకోవాలి. ఇంతకీ ఆ రెండు రికార్డులు ఏవంటే.. మొదటిది వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు. రెండవది అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సెంచరీల రికార్డు.ప్రస్తుతం ఈ రెండు రికార్డులు విరాట్ కనుచూపుమేరల్లో కూడా లేవు. నాలుగైదేళ్ల కిందట ఈ రికార్డులను విరాట్ సులువుగా బద్దలు కొడతాడని అనిపించింది. అయితే గత కొంతకాలంగా విరాట్ నెమ్మదిపడటంతో ఈ రికార్డులు పరిధి దాటిపోయాయి. విరాట్కు వీటికి దూరం పెరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ రికార్డులు అందని ద్రాక్షాల్లా మిగిలిపోవడం ఖాయమని అనిపిస్తుంది. ఇదే జరిగితే ఆ రెండు భారీ రికార్డులు సచిన్ ఖాతాలోనే సేఫ్గా ఉంటాయి. వాటిని సమీప భవిష్యత్తులో కూడా ఎవరూ బద్దలు కొట్టలేరు.వన్డేల్లో అత్యధిక పరుగులుసచిన్ ఖాతాలో ఉన్న ఈ రికార్డును (18426) చేరుకోవాలంటే విరాట్ మరో 4245 పరుగులు చేయాలి. విరాట్ వయసు దృష్ట్యా ఇది అసంభవమనే చెప్పాలి. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 14181 పరుగులు ఉన్నాయి. మహా అయితే అతడు మరో 50 లేదా 60 వన్డేలు ఆడతాడు. ఈ మ్యాచ్ల్లో 4000 పైచిలుకు పరుగులు సాధించడం అసాధ్యం.100 సెంచరీలుప్రపంచ క్రికెట్లో అసాధ్యంగా కనిపించే ఈ రికార్డును సచిన్ నెలకొల్పాడు. నాలుగైదేళ్ల కిందటి వరకు ఈ రికార్డును విరాట్ సాధిస్తాడనే నమ్మకముండేది. అయితే విరాట్ గత కొంతకాలంగా నెమ్మదించడంతో ఈ రికార్డుకు దూరం పెరిగింది. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 82 సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డును సమం చేయాలన్నా విరాట్ మరో 18 సెంచరీలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమనే చెప్పాలి. ఈ లెక్కన పై రెండు రికార్డులు సచిన్ ఖాతాలోనే సేఫ్గా ఉంటాయి. -
తప్పు సరిదిద్దుకున్న ఐసీసీ.. రీఎంట్రీ ఇచ్చిన రోహిత్, కోహ్లి
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఘోర తప్పిదం జరిగింది. గత వారం ర్యాంకింగ్స్లో రెండు, నాలుగు స్థానాల్లో ఉండిన టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తాజా ర్యాంకింగ్స్లో టాప్-100లో కూడా కనబడలేదు. ఈ ఇద్దరి పేర్లు ఆకస్మికంగా మాయం కావడంపై సోషల్మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్స్ నడుస్తుండగా ఐసీసీ స్పందించింది.సాంకేతిక లోపం కారణంగా రోహిత్, కోహ్లి పేర్లు ర్యాంకింగ్స్లో కనబడలేదని వివరణ ఇచ్చింది. తప్పును సరి దిద్దుకుంటూ వారిద్దరి పేర్లను తిరిగి ర్యాంకింగ్స్ జాబితాలో చేర్చింది. అప్డేట్ చేసిన తర్వాత రోహిత్, కోహ్లి తమ పాత ర్యాంకులైన రెండు, నాలుగు స్థానాలను తిరిగి దక్కించుకున్నారు.రోహిత్, కోహ్లి వన్డే ర్యాంకింగ్స్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ర్యాంకింగ్స్లో కనపడకపోయే సరికి రోహిత్, కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారని ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక లోపం కారణంగా తప్పిదం జరిగిందని తెలిసి రోహిత్, కోహ్లి అభిమానుల మనసులు కుదుటపడ్డాయి.కాగా, సాంకేతిక లోపం కారణంగా తాజా వన్డే ర్యాంకింగ్స్లో మరిన్ని తప్పిదాలు దొర్లాయి. రోహిత్, కోహ్లి పేర్లు మాయమైపోవడంతో పాటు పలువురు రిటైరైన ఆటగాళ్ల పేర్లు జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, స్టీవ్ టికోలో, అలెక్స్ ఓబండ, థామస్ ఒడోయో, అన్షీ రథ్ లాంటి పేర్లు ఉన్నాయి. తప్పిదాన్ని గుర్తించిన తర్వాత ఐసీసీ వీరి పేర్లను తొలగించింది.సవరించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాడు శుభ్మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, చరిత్ అసలంక, హ్యారీ టెక్టార్, శ్రేయస్ అయ్యర్, ఇబ్రహీం జద్రాన్, కుసాల్ మెండిస్ టాప్-10లో ఉన్నారు. -
రోహిత్, కోహ్లికి ఊహించని షాకిచ్చిన ఐసీసీ.. ఆకస్మికంగా తొలగింపు
ఐసీసీ తాజాగా (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను భారీ షాక్కు గురి చేశాయి. గత వారం ర్యాంకింగ్స్లో రెండు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు.. వారం తిరిగేలోపే ర్యాంకింగ్స్ నుంచి పూర్తిగా మాయమైపోయారు. ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లి పేర్లు కనిపించలేదు. ఇది చూసి రోహిత్, కోహ్లితో పాటు వారి అభిమానులు కూడా షాక్కు గురవుతున్నారు. ఇంత సడెన్గా తమ ఆరాధ్య ఆటగాళ్ల పేర్లు ఎలా మాయమైపోయాయని ఆశ్చర్యపోతున్నారు. ఇలా జరగడంలో ఐసీసీ తప్పిదమేమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. కొందరేమో రోహిత్, కోహ్లి టీ20, టెస్ట్ తరహాలో వన్డే రిటైర్మెంట్ కూడా సడెన్గా ప్లాన్ చేశారేమోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఐసీసీ రూల్స్ ఇలా..!ఐసీసీ ర్యాంకింగ్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు 9-12 నెలల కాలంలో సంబంధింత ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. అయితే తాజా ఉదంతంలో రోహిత్, కోహ్లి విషయంలో అలా జరగలేదు. వీరిద్దరు మార్చి 9న, అంటే ఐదు నెలల కిందట ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. ఈ లెక్కన రోహిత్, కోహ్లి పేర్లు సడెన్గా వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించడానికి వీల్లేదు.మరి ఏం జరిగి ఉంటుంది..?రోహిత్, కోహ్లి పేర్లు వన్డే ర్యాంకింగ్స్ నుంచి ఆకస్మికంగా తొలగించడం వెనుక ఏదైనా కుట్ర (బీసీసీఐ) దాగి ఉందా అని వారి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు 2027 వన్డే వరల్డ్కప్ వరకు ఈ ఫార్మాట్లో కొనసాగుతామని పరోక్షంగా చెప్పారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ సానుకూలంగా లేదని తెలుస్తుంది.రోహిత్, కోహ్లి రెండు ఫార్మాట్లలో లేకపోయినా యువ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగా ఉందని వారి భావన. వీరిద్దరు వన్డేల నుంచి తప్పుకున్నా జట్టుపై పెద్ద ప్రభావముండదని వారి అభిప్రాయం. ఇప్పటి నుంచే వన్డేల్లో రోహిత్, కోహ్లి ప్రత్యామ్నాయాలకు తగినన్ని అవకాశాలిస్తే 2027 వరల్డ్కప్ సమయానికి రాటుదేలతారని వారి అంచనా. ఇవన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీయే రోహిత్, కోహ్లిలను బలవంతంగా వన్డేల నుంచి తప్పుకునేలా చేస్తుందన్న వాదన వినిపిస్తుంది. ఇందులో భాగంగానే వారి పేర్లను వన్డే ర్యాంకింగ్స్ నుంచి తొలగించేలా ఐసీసీకి లేఖ రాసి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఇదే జరిగి ఉంటుందని రోహిత్, కోహ్లి అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, వన్డే ర్యాంకింగ్స్ నుంచి రోహిత్, కోహ్లి పేర్లు తొలగింపు తర్వాత కూడా శుభ్మన్ గిల్ టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా నుంచి శ్రేయస్ అయ్యర్ ఆరో స్థానంలో ఉన్నాడు.


