పచ్చి మిర్చి తిన్నట్లు మంటెత్తిపోతున్నారు

పచ్చి మిర్చి తిన్నట్లు మంటెత్తిపోతున్నారు - Sakshi


గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంతే టీడీపీ నేతలు పచ్చి మిరపకాయలు తిన్నట్లు మంటెత్తిపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. గురువారం గుంటూరు నల్లపాడు రోడ్డులో ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దీక్ష స్థలిలో రోజా ప్రసంగించారు.


తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష చూసి పచ్చ పార్టీ నేతలు మైండ్ బ్లాక్ అయిందన్నారు. అందుకే వారికి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరు కాదు వంద మంది టీడీపీ నేతలు వచ్చి విమర్శించినా... తమ పార్టీ లెక్క చేయదన్నారు. ప్రత్యేక హోదా అంటే చంద్రబాబుకు జైలు గుర్తుకొస్తుందని విమర్శించారు. అసలు ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు అనుకూలమో లేక వ్యతిరేకమో చెప్పే దమ్ము ధైర్యం లేవన్నారు.




రాజకీయాల్లో 40 ఏళ్ల ఎక్స్పిరియన్స్ ఉన్న చంద్రబాబు... 40 ఏళ్ల వయస్సు ఉన్న మహానేత వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ని చూసి వణుకుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చంద్రబాబు చేతులు కలిపి... వైఎస్ జగన్ని జైలుకు పంపడమే కాకుండా.... రాష్ట్రాన్ని విభజించారని చెప్పారు. కుట్ర అనే పదం చంద్రబాబు పేటెంట్ అని రోజా అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా ఉన్న పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ని ఎలా కుట్ర చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి ఎలా దింపేసింది... రోజా ఈ సందర్బంగా వివరించారు. 


అలాగే జగన్ దీక్షపై విమర్శలు సంధిస్తున్న చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావులపై రోజా తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. జగన్ దీక్ష ఆపాలని చూస్తున్న బాబు తరం కాదుకదా ఆయన బాబు తరం కూడా కాదని రోజా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా తీసుకువచ్చే వరకు టీడీపీ నేతలను గ్రామాల్లో అడుగుపెట్టనివ్వదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి రోజా విజ్ఞప్తి చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top