విజయవాడలో అరెస్టుల పర్వం

విజయవాడలో అరెస్టుల పర్వం - Sakshi


విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసంవైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన కృష్ణా జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. చాలాచోట్ల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతుగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేశారు. పెట్రోలు బంక్‌లు, సినిమాహాళ్లు పనిచేయటం లేదు. విజయవాడలో ఉదయం 5 గంటలకే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, కొడాలి నాని, వంగవీటి రాధ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. తిరువూరులో ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.



జగ్గయ్యపేట బస్‌డిపో ముందు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నాయి. అవనిగడ్డలో తెల్లవారు జాము 3.30 గంటల నుంచి బంద్ కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారావు నేతృత్వం వహించిన ఈ కార్యకమంలో 300 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top