గంటన్నరసేపు ఏం మాట్లాడారు: వైఎస్ జగన్

గంటన్నరసేపు ఏం మాట్లాడారు: వైఎస్ జగన్ - Sakshi


నెల్లూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే యువతకు మంచి జరుగుతుందని ఎవరిని అడిగినా చెబుతారని, అలాంటిది చంద్రబాబు నాయుడు మాత్రం 'హోదా'పై మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి  బీజేపీ, టీడీపీ కలిసి చేసిన వాగ్దానాల సంగతేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రావటం లేదని కలత చెంది నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.  ఆ కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.



ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు నాయుడు... ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయిన అనంతరం...ప్రత్యేక హోదాపై కేంద్రం నామమాత్రంగా కూడా ప్రకటన చేయలేదన్నారు. గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన చంద్రబాబు ఏంమాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన  రాష్ట్రవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ...ఐక్యంగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందామని ఆయన కోరారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top