ప్రజలకు శఠగోపం పెట్టాడు


విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ బాధిత గ్రామాల్లో పర్యటించారు. అందులోభాగంగా భోగాపురం మండలం కవులవాడలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఇంటికో జాబు ఇస్తాననని చెప్పి... అధికారంలోకి వచ్చి... ఉన్న జాబులను తీస్తున్నాడని ఎద్దేవా చేశారు.


నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ భృతి కూడా ఇవ్వడం లేదు. సరికద ఇళ్లు, పొలం కూడా లాక్కుంటున్నాడని విమర్శించారు. ప్రజలకు ఆమోదయోగం కాని నిర్ణయాలు ఇకనైనా మానుకోవాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top