నిమిషాల్లోనే ఆ ఫోన్ అవుటాఫ్‌ స్టాక్!

నిమిషాల్లోనే ఆ ఫోన్ అవుటాఫ్‌ స్టాక్!

న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి ఇటీవల ప్రవేశపెడుతున్న స్మార్ట్ ఫోన్లకు ఆన్ లైన్ లో అనూహ్య స్పందన వస్తోంది. సంచలన విక్రయాలు నమోదుచేసిన రెడ్ మి నోట్ 4 అనంతరం, నేడు ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్ఫామ్పై తీసుకొచ్చిన తన లేటెస్ట్ మోడల్ రెడ్ మి4 ఏ ఫోన్కు భలే గిరాకి వచ్చింది. అమెజాన్ ప్లాట్ఫామ్ పైకి విక్రయానికి వచ్చిన ఆ ఫోన్, నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయింది. రెడ్మి 4ఏ తొలి సేల్ కూడా నేడే కావడం విశేషం. తర్వాతి సేల్ మార్చి 30న కంపెనీ నిర్వహిస్తోంది.

 

రెడ్ మి3 విజయంతో రెడ్మి 4ఏ ను కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ కొన్నవారికి లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. 5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ రెజుల్యూషన్(720పీ), క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 425 64-బిట్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 13ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3120 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ప్రత్యేకతలు. దీని ధర కూడా రూ.5,999లే కావడం విశేషం. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top