ఉత్తరాఖండ్ మహిళలకు ఉచిత ఆఫర్

ఉత్తరాఖండ్ మహిళలకు ఉచిత ఆఫర్


డెహ్రడూన్: రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉచిత ఆఫర్ ప్రకటించింది. శనివారం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ముఖ్యమంత్రి హరీష్ రావత్ తోలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చారు.



తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లే మహిళలు సులువుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు రావత్ చెప్పారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను గౌరవావించాలన్న స్ఫూర్తిని రాఖీ పండుగ కలగజేస్తుందని పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top