త్రివర్ణ పతాకం ఎగురవేసిన సాహస మహిళ
పాట్నా: బిహార్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో సాహస మహిళ శాయిల్ దేవి జెండా ఎగురవేసింది. 50 ఏళ్ల శాయిల్ దేవి ఇటీవల ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల్లో ముస్లిం కుటుంబాన్ని దుండగుల బారి నుంచి కాపాడింది.
అసమాన తెగువ కనబరిచి సాటి మనుషుల ప్రాణాలు కాపాడిన శాయిల్ దేవిని జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఈ రోజు జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో మువ్వన్నెల జెండా ఎగురవేసింది. బిహార్ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌదరి, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.