ప్రయాణికురాలికి అనారోగ్యం : విమానం దింపివేత


ఇండోర్ : ముంబై నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికురాలు తీవ్ర అనారోగ్యం పాలైంది. దాంతో విమానాన్ని అత్యవసరంగా ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ ఎయిర్పోర్ట్లో దించివేశారు. అనంతరం ఆమెను ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్కి చెందిన సరోజ్ సింగ్ (54) సోమవారం ఇండిగో విమానంలో ముంబై నుంచి లక్నో బయలుదేరింది.


ఆ క్రమంలో ఆమె శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపింద. దాంతో వారు ఇండోర్ విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. విమానం అత్యవసరంగా దిగేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో స్థానిక విమానాశ్రయంలో విమానాన్ని దింపారు. అనంతరం సరోజ్ సింగ్ను ఆసుపత్రికి తరలించారు.  అనంతరం విమానం లక్నో బయలుదేరి వెళ్లింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top