మాజీ ప్రియుడు భర్తకు ఫొటోలు పంపడంతో!

మాజీ ప్రియుడు భర్తకు ఫొటోలు పంపడంతో!


థానె (మహారాష్ట్ర): తనతో దిగిన ఫొటోలను ప్రియుడు భర్తకు పంపడంతో ఓ 26 ఏళ్ల నవవధువు అఘాయిత్యానికి ఒడిగట్టింది. విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. థానె జిల్లాలోని ఖినావాలి ప్రాంతంలో ఆదివారం (19న) ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల వృశాలి భాగ్ రావుకు ఇటీవల పెళ్లయింది. ఈ నేపథ్యంలో వృశాలి ప్రియుడు రజాక్ పీర్ మహమ్మద్ తనతో ఆమె దిగిన ఫొటోలను భర్తకు పంపించాడు. ఈ ఫొటోలు చూసి ఆగ్రహించిన భర్త వృశాలితో గొడవపడ్డాడు. వృశాలిని షాహాపూర్ తాలుకాలోని ఆమె తల్లి ఇంటి వద్ద వదిలేశాడు. దీంతో మనస్తాపం చెందిన వృశాలి విషం తాగి తనువు చాలించింది.



వృశాలి నిందితుడు రజాక్ తో రెండేళ్లపాటు ప్రేమవ్యవహారాన్ని నడిపింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 29న ఆమెకు ముర్ బాద్ కు చెందిన చేతన్ తో పెళ్లయింది. వీరి పెళ్లిని కంటగింపుగా భావించిన రజాక్ తాను వృశాలితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను భర్త చేతన్ వాట్సాప్ కు పంపించాడని, ఈ క్రమంలో జరిగిన గొడవలతో కలత చెందిన వృశాలి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి.. నిందితుడు రజాక్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top