'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'

'రామమందిరం కట్టకపోతే కోర్టుకెళ్తా'


మాథూరా: అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. 2016లో రామమందిరం నిర్మాణం ప్రారంభించకపోతే కోర్టుకెక్కడం సహా ఇతర మార్గాలు ఎంచుకుంటామని ఆయన చెప్పారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంగ్లేయులు రూపొందించిన సిలబస్ నే ఇప్పటికీ విద్యాలయాల్లో బోధిస్తున్నారని, దీన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 80 శాతమున్న హిందూ జనాభాను రాజకీయ పార్టీలు చీల్చాయని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top