జలదృశ్యం కాదు.. ఆత్మహత్యల దృశ్యం చూడండి

జలదృశ్యం కాదు.. ఆత్మహత్యల దృశ్యం చూడండి - Sakshi


గవర్నర్‌కు డీకే అరుణ సూచన

 సాక్షి, హైదరాబాద్: ‘జలదృశ్యం కాదు, ముందుగా రైతు ఆత్మహత్యల దృశ్యాన్ని చూడండి’ అని రాష్ట్ర గవర్నర్‌కు మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ సూచించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు, రుణమాఫీపై చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం వంటివాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ జలదృశ్యం అంటున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల సినిమాను ముందుగా చూపించి, ఆ తరువాత ఇంకే సినిమానైనా చూపించుకోవచ్చునన్నారు. రుణమాఫీని ఒకేసారి చేసేవరకు అసెంబ్లీలోనూ, ప్రజా క్షేత్రంలోనూ పోరాడుతామని హెచ్చరించారు. జలదృశ్యం అంటూ అసెంబ్లీలో సినిమాను చూపించడానికి గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top