విజయనగరంలో స్వచ్ఛంద బంద్
విజయనగరం: విజయనగరం పట్టణంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్కు వ్యాపారులు, పాఠశాల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహాకరించాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు తెల్లవారుజామున 4గంటలకు డిపో వద్దకు చేరుకొని బస్సులను అడ్డుకున్నారు.
ఎమ్మెల్సీ పాలుగట్ల వీరభద్రస్వామి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాతు విజయ్ల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. కాగా, వైఎస్సార్ సీపీ చేపట్టిన ఈ బంద్కు వామపక్షాలు సంపూర్ణ మద్దతునిచ్చాయి.