ఈ రోజు కోహ్లీ గ్యాంగ్ ఏం చేసిందంటే..
బెంగళూరు: బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో భారత క్రికెట్ జట్టు పాల్గొంది. వెస్టిండీస్లో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా కొత్త చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో విరాట్ కోహ్లీ సేన సన్నద్ధమవుతోంది.
శనివారం ఉదయం భారత ఆటగాళ్లు యోగా చేశారు. శరీరాన్ని, మనసును చురుగ్గా ఉంచుకునేందుకు యోగాసనాలు వేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా యోగా శిబిరంలో పాల్గొన్నాడు. కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, రహానే, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ తదితరులు యోగాసనాలు వేస్తూ కనిపించారు.
వెస్టిండీస్ పర్యటనలో భారత్ నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ నెల 21న ఆంటిగ్వాలో ఇరు దేశాల మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఆదివారం జాతీయ క్రికెట్ అకాడమీలో కుంబ్లే.. అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్, భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, కోహ్లీ, సెలక్షన్ కమిటీ సభ్యులతో సమావేశంకానున్నట్టు సమాచారం.