నవాజ్ షరీఫ్ కు తప్పిన ప్రమాదం!

నవాజ్ షరీఫ్ కు తప్పిన ప్రమాదం!


ఇస్లామాబాద్:పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం నవాజ్ కుటుంబంతో కలిసి కారులో ఇస్లామాబాద్ కు వెళుతున్న సమయంలో ఆయన కాన్వాయ్ పైకి ఓ అనుమానాస్పద వాహనం ఆకస్మాత్తుగా దూసుకొచ్చింది.   ఆ ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు తెలియకపోయినా.. నవాజ్ షరీఫ్ ను లక్ష్యంగా  చేసుకుని ఆ వ్యక్తి దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.  దీంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


 


ఆకస్మాత్తుగా దూసుకొచ్చిన ఓ కారు నవాజ్ కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేసిన అనంతరం.. ఆయన కారును గట్టిగా ఢీకొట్టినట్లు పాక్ ప్రధాని కార్యాలయం ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ ఘటన నుంచి ప్రధాని సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది.  ఆ కారుకు ఉపయోగించిన నంబర్ ప్లేట్ నకిలీదిగా గుర్తించినట్లు పీఎంవో తెలిపింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top