మరణం కూడా విడదీయలేకపోయింది

మరణం కూడా విడదీయలేకపోయింది - Sakshi


సేలం: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా తనువు చాలించిన విదారక ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. 44 ఏళ్లు అన్యోన్యంగా కలిసి జీవించిన ఆ దంపతులను మరణం కూడా వేరు చేయలేకపోయింది. మనోహరన్(70) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మరణించారు. ఆయనకు కొడుకు స్టీఫెన్, కూమార్తె ఉన్నారు.



క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో మనోహరన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగానే ఆయన భార్య క్రిస్ట్రీ(67) కూడా ప్రాణాలు కోల్పోయింది. భర్త శవపేటికపై కుప్పకూలి ఆమె తుదిశ్వాస విడిచింది. మనోహరన్, క్రిస్టీ మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top