కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్


న్యూఢిల్లీ :  కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో  పండుగ వాతావరణాన్ని అపుడే నింపేసింది.  గత రెండు సం.రాలుగా  పెండింగ్ లో ఉన్న బోనస్  చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు.  ఈ డబుల్ బొనాంజాతో దాదాపు  33 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.   రెండు సంవత్సరాలుగా  పెండింగ్లో  ఉన్న తమ  వార్షిక బోనస్  చెల్లించేందుకు అంగీకరించడంతో ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునగనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన నిబంధనల ప్రకారం  2014-15 ,  2015-16  సం.రాల  బోనస్  విడుదల  కానుంది.   తరువాత ఇది  7 వ వేతన సంఘం కింద పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  విలేఖరులకు చెప్పారు.




 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top