పాకిస్థాన్లో బాంబు పేలుడు: ఇద్దరు మృతి


పాకిస్థాన్ నౌకాశ్రయనగరం కరాచీలో గురువారం ఓ షాపు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవల విధుల నుంచి తొలగించి పోలీసు అధికారి, అతని స్నేహితుడితో ఓ షాపు బయట కూర్చుని ఉండగా ఆ పేలుడు సంభవించిందని తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు స్థానికుల సహాయంతో తరలించినట్లు మీడియా చెప్పింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top