పదికోట్లకు అమ్ముడుపోయిన పళ్లెం!

పదికోట్లకు అమ్ముడుపోయిన పళ్లెం!


గుజరాత్కు చెందిన 16వ శతాబ్దపు విశిష్టమైన పళ్లెం కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. మేలిమి ముత్యాలతో తయారుచేసిన ఈ చారిత్రక పళ్లెం రికార్డుస్థాయిలో 9,62,500 పౌండ్లకు (రూ. 9.56 కోట్లు) వేలంలో అమ్ముడుపోయింది. ఈ నెల 6న ఇస్లామిక్, భారతీయ కళాకృతుల అమ్మకంలో భాగంగా లండన్లో బోన్హామ్ సంస్థ ఈ పళ్లాన్ని వేలం వేసింది.




దీనికి మొదట్లో 60 వేల నుంచి 80 వేల పౌండ్లు ధర పలుకవచ్చునని భావించగా.. అంతకు పది రెట్లు అధికంగా అమ్ముడుపోవడం ఆశ్చర్యపరిచింది. పర్షియన్, భారతీయ, యూరోపియన్ సంస్కృతుల మిశ్రమ కళాకృతిగా ఈ పళెంపై ఎగురుతున్న పక్షులు, ఓడ ప్రయాణాలు వంటి అరుదైన బొమ్మలు చిత్రించి ఉన్నాయి.



 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top