సముద్రంలోకి వెళ్లి టైటానిక్‌ను చూడొచ్చు!

సముద్రంలోకి వెళ్లి టైటానిక్‌ను చూడొచ్చు!


లండన్‌: వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్‌ ఓడను సముద్రగర్భంలోకి వెళ్లి సందర్శించడానికి ఓ కంపెనీ పర్యాటకులకు అవకాశం కల్పించనుంది. ఈ సాహసయాత్రకు ఒక్కో వ్యక్తికి టికెట్‌ ధర 1,05,129 డాలర్లు (రూ.68 లక్షలు). వచ్చే ఏడాది మే నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర తొలిదశకు ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. 8 రోజులు సాగే ప్రయాణం కెనడా నుంచి మొదలవుతుంది.



‘బ్లూ మార్బుల్‌ ప్రైవేట్‌’ అనే సంస్థ పర్యాటకులను అట్లాంటిక్‌ మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్‌ ఓడ వద్దకు పర్యాట కులను తీసుకెళ్లనుంది. 1912 ఏప్రిల్‌ 14న ఆర్‌ఎంఎస్‌–టైటానిక్‌ ఓడ ఇంగ్లండ్‌ నుంచి అమెరికా వెళ్తూ తన తొలి ప్రయాణంలోనే మునిగిపోవడం తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top