‘లోక్‌సభ’ నుంచి తాండూరు వాసికి ఆహ్వానం


తాండూరు రూరల్ : ఢిల్లీలోని లోక్‌సభ సచివాలయం (అర్జీల శాఖ కమిటీ) నుంచి తనకు ఆహ్వానం అందిందని తాండూరుకు చెందిన ఎం.సాయి సంపత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను ‘అటవీ హక్కుల చట్టం అమలు - అటవీ భూమి క్షీణత’ అనే అంశంపై అధ్యయనం చేసి అన్ని రాజ్యాంగ కార్యాలయాలతోపాటు లోక్‌సభ స్పీకర్‌కు కూడా అందజేశానని చెప్పారు. ఈ సందర్భంగా లోక్‌సభ సచివాలయం నుంచి ఫోన్ వచ్చిందని సాయి సంపత్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో లోక్‌సభ స్పీకర్ అపాయిమెంట్ ఉందని వివరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top