అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
టెక్సాస్: అమెరికా టెక్సాస్రాష్ట్రం బ్యూమోన్ లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి శైలేంద్ర హర్ష మృతి చెందగా, దీపక్ అనే మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం దీపక్ ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. లామర్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్ చేస్తున్న శైలేంద్ర ప్రకాశం జిల్లా కందుకూరు వాసి. తండ్రి బి.విజయ్ కుమార్ ఒంగోలు జిల్లా మద్దిపాడు మండలం పంచాయితీరాజ్ ఏఈగా పని చేస్తున్నారు.
ఉగాది పండగకి వస్తాను అని చెప్పి రాలేదని..అంతలోనే రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలియగానే స్వస్థలం కందుకూరులో విషాద చాయలు అలుముకున్నాయి.