కన్నకూతురిపై.. ఏడాదిగా అత్యాచారం

కన్నకూతురిపై.. ఏడాదిగా అత్యాచారం - Sakshi


కన్నకూతురని కూడా చూడకుండా.. కనురెప్పే కాటేసింది. రాజస్థాన్లో 16 ఏళ్ల అమ్మాయిపై ఆమె కన్న తండ్రి గత ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. డ్రైవర్గా పనిచేస్తున్న తన తండ్రి ప్రమోద్ కుమార్ చేస్తున్న అఘాయిత్యం గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇంట్లో ఒంటరిగా కనపడినప్పుడల్లా అతడు అత్యాచారం చేసేవాడని ఎస్ఐ కఝోద్మల్ శర్మ తెలిపారు.



పదోతరగతి చదువుతూ మధ్యలో ఆపేసిన ఆ అమ్మాయి.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తన తండ్రి బెదిరించినట్లు చెప్పింది. ఇదే విషయాన్ని తన అమ్మకు, అన్నకు చెప్పినా.. వాళ్లు కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు.  ఆమెను వైద్యపరీక్షలకు పంపి, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మేజిస్ట్రేట్ వద్ద ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇంత నేరం జరుగుతున్నా అడ్డుచెప్పనందుకు బాధితురాలి అమ్మ, అన్నలపై కూడా సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top