రఘువీరా కాన్వాయ్ పై టీడీపీ రాళ్ల దాడి

రఘువీరా కాన్వాయ్ పై టీడీపీ రాళ్ల దాడి - Sakshi


కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయం ప్రతిపాదిత స్థలంతో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సోమవారం పర్యటించారు. ఎయిర్ పోర్టు నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతుండటంతో ఆయన వారిని కలిశారు. అయితే రఘవీరారెడ్డి అక్కడికి రావడాన్ని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ పై చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘర్షణ ఆపటానికి ప్రయత్నించిన ఓ ఎస్‌ఐకు స్వల్పగాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.



కాగా కుప్పంలో సభ నిర్యహించదలచిన కాంగ్రెస్ కు పోలీసులు అభ్యంతరం తెలిపారు. సభకు అనుమతి లేదంటూ భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా రఘువీరా సభకు వెళుతున్న 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top