శ్రీలంక కాన్సులేట్ ముట్టడికి యత్నం
చెన్నై: శ్రీలంకలో తమిళ జాలర్ల ఉరిశిక్షను నిరసిస్తూ తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని శ్రీలంక కాన్సులేట్ ను శుక్రవారం ముట్టించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తమిళ జాలర్ల సంఘాల నేతలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత్ నుంచి శ్రీలంకకు మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేశారన్న అభియోగాలపై ఐదుగురు తమిళ జాలర్లకు కొలంబో హైకోర్టు గురువారం ఉరిశిక్ష విధించడంతో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. రామేశ్వరం ప్రాంతంలో రెండు బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారు.