గౌతమి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
బెంగళూరు: ప్రగతి రెసిడెన్షియల్ కళాశాల ఇంటర్ విద్యార్థిని గౌతమి(18)ని కాల్చిచంపిన నిందితుడు మహేష్(30) ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. తనను ప్రేమించలేదన్న కోపంతో గౌతమిని మహేష్ కాల్చిచంపాడు. బెంగళూరు వైట్ఫీల్డ్ ఏరియాలోని కాడ్గోడి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బెంగళూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకురు జిల్లాలోని ఓ పట్టణానికి చెందిన మహేష్ గత రెండేళ్లుగా ప్రగతి రెసిడెన్షియల్ కళాశాల పనిచేస్తున్నట్టు సమాచారం. మృతురాలు గౌతమి స్వస్థలం అనంతపురం జిల్లా పావుగడ.
ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు...