సూట్కేసుల పాలన కంటే మేలే
కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, విమర్శిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 60 ఏళ్ల పాటు వాళ్లు సాగించిన పాలన వల్లే దేశం నేటికీ పేదరికంలో మగ్గిపోతోందని మండిపడ్డారు. తమది సూటు-బూటు పాలన అంటూ వాళ్లు విమర్శిస్తున్నారని, కానీ సూట్కేసుల పాలన కంటే తమది బెటరే కదా అని ఆయన ఎద్దేవా చేశారు.
నిజంగా మీరు పేదల పక్షమే అయితే.. దేశంలో ఇంకా పేదరికం ఎందుకు ఉందని కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోదీ సూటిగా ప్రశ్నించారు. సొంత మనుషులకు గనులు కట్టబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి.. తనను ప్రశ్నించే అధికారం లేదని ఆయన కుండబద్దలుకొట్టి చెప్పారు.