టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి


కంకిపాడు(కృష్ణా): టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని గోడవర్రు గ్రామానికి చెందిన ఇంటూరి. చింటూ, 8 వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 9 వ తేదీన ట్యూషన్ మాస్టర్ కొట్టడంతో చింటూ తీవ్రంగా గాయపడ్డాడు.



దీంతో బాధితుడు హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందాడు. తర్వాత చికిత్స ఖర్చు భరించే స్తోమత లేక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ రోజు చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top