రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే: అవినాష్‌రెడ్డి


వేముల(వైఎస్సార్ జిల్లా): రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన వైఎస్సార్‌జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టు వద్ద జరిగిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.



శనివారం తెల్లవారుజామున 5గంటలకే కార్యకర్తలతో కలిసి ప్రాజెక్టు దగ్గరకు ఆయన చేరుకున్నారు. ప్రాజెక్టులో పని చేసే ఉద్యోగులను, కార్మికులను విధుల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. దీంతో యురేనియం ప్రాజెక్టులో శనివారం పనులు నిలిచిపోయాయి. ఈ మేరకు యురేనియం ప్రాజెక్టు ఉద్యోగులు, కార్యకర్తలు బంద్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని నిరసన తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top