ఆ టూర్ విహారయాత్ర కాదు..!

ఆ టూర్ విహారయాత్ర కాదు..! - Sakshi


ఢిల్లీ:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటన విహార యాత్ర కాదని ఆ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన ఆ ఐదు రోజుల పర్యటనను స్టడీ టూర్ గా ఆయన అభివర్ణించారు. ఆదివారం ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నేటి విద్యుత్ సంక్షోభానికి గత పాలకుల విధానాలే కారణమని మండిపడ్డారు. అవసరమైతే పరిశ్రమలకు కోత విధించైనా.. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ చేసిన సింగపూర్ టూర్ పై వస్తున్న విమర్శలను ఆయన తనదైన శైలిలో తిప్పికొట్టారు.


 


ఆ టూర్ విహారయాత్ర కాదని.. అదొక స్టడీ టూర్ అని కేటీఆర్ తెలిపారు. 2019 కల్లా ప్రతీ ఇంటికి మరుగుదొడ్డిని మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టనున్న డిజిటల్ ఇండియాకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top