ఇంద్రాణిని విచారించనున్న సీబీఐ


ముంబై: సంచలం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా సహా ఇతర నిందితులను సీబీఐ విచారించనుంది. బుధవారం ముంబై కోర్టు ఈ మేరకు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ నిందితులుగా ఉన్నారు. నిందితులు ముగ్గురు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. వీరి ముగ్గురికి ఈ నెల 19వరకు ముంబై కోర్టు రిమాండ్కు ఆదేశించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top