ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
హాజీపూర్: ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణ ఘటన బీహార్ లోని వైశాలి జిల్లాలో చోటుచేసుకుంది. దామోదర్పూర్ గ్రామంలో పొదల్లో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. మృతురాలు సారాయ్ పోలీసు స్టేషన్ పరిధిలో పూలు అమ్ముకుని నివసిస్తున్న దేవతి దేవి కుమార్తె.
గురువారం బాలిక అదృశ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికపై అత్యాచారం చేసి హతమార్చారని పోలీసులు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.